- Home
- Entertainment
- Peddi: రాంచరణ్ పెద్ది రిలీజ్ టైంలో న్యూసెన్స్.. నిజంగా అంత ప్రేమ ఉంటే ఇలా చేయండి, నాగవంశీ అదిరిపోయే కౌంటర్
Peddi: రాంచరణ్ పెద్ది రిలీజ్ టైంలో న్యూసెన్స్.. నిజంగా అంత ప్రేమ ఉంటే ఇలా చేయండి, నాగవంశీ అదిరిపోయే కౌంటర్
పర్సెంటేజీ విధానంపై శిరీష్ చేసిన వ్యాఖ్యలకు మైత్రి రవిశంకర్, సితార నాగవంశీ కౌంటర్ ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పెద్ది లాంటి భారీ సినిమా రిలీజ్ అవుతున్న టైంలో కావాలనే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.

టాలీవుడ్ లో పర్సెంటేజీ విధానం
టాలీవుడ్ లో మరోసారి నిర్మాతల మధ్య వివాదం భగ్గుమంటోంది. చాలా కాలంగా టాలీవుడ్ లో రెంటల్, పర్సెంటేజీ విధానంపై నిర్మాతల మధ్య విభేదాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రెంటల్ విధానం కొనసాగుతోంది. దీనిని పర్సెంటేజీ విధానానికి మార్చాలి అని చాలా కాలంగా వాదనలు వినిపిస్తున్నాయి. పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ వాదన ఎక్కువవుతోంది.

రెండు వర్గాలుగా చీలిపోయిన నిర్మాతలు
కొందరు ప్రొడ్యూసర్లు దీనిని వ్యతిరేకిస్తున్నారు. దీనితో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ రెండు వర్గాలుగా చీలిపోయారు. మంగళవారం రోజు ఎగ్జిబిటర్లతో కలసి శిరీష్, సునీల్ నారంగ్ లాంటి వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పర్సెంటేజీ విధానానికి అంగీకరించిన నిర్మాతల సినిమాలని మాత్రమే థియేటర్స్ లో ప్రదర్శిస్తాం అని తేల్చి చెప్పారు. రాంచరణ్ పెద్ది రిలీజ్ టైంలోనే ఈ వివాదాన్ని లేవనెత్తడంతో టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.
శిరీష్ పై దుమ్మెత్తిపోసిన నాగవంశీ
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు బుధవారం రోజు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో మైత్రి రవిశంకర్, సితార నాగవంశీ, సాహు గారపాటి లాంటి నిర్మాతలు పాల్గొన్నారు. శిరీష్ చేసిన వ్యాఖ్యలపై నాగవంశీ, రవిశంకర్ దుమ్మెత్తిపోశారు. నాగవంశీ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత టాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతున్న భారీ చిత్రం పెద్ది. ఈ సినిమాపై మంచి బజ్ ఉంది.
పెద్దిపై కావాలనే న్యూసెన్స్
పెద్ది సినిమాతో జనాలు తిరిగి థియేటర్స్ కి రావడం ప్రారంభం అవుతుంది అని ఇండస్ట్రీ మొత్తం నమ్ముతోంది. వచ్చే ఆరు నెలల్లో భారీ చిత్రాలు వరుసగా ఉన్నాయి. పెద్ది సినిమాతో మొదలైన మొమెంటం అలాగే కొనసాగాలి. కానీ ఇలాంటి తరుణంలో కావాలనే పెద్ది సినిమాపై న్యూసెన్స్ క్రియేట్ చేసేలా కొందరు ప్రయత్నిస్తున్నారు అంటూ నాగవంశీ.. శిరీష్ కి కౌంటర్ ఇచ్చారు.
అంత ప్రేమ ఉంటే ఇలా చేయొచ్చు కదా
మీకు సింగిల్ స్క్రీన్స్ పై ప్రేమ ఒలకబోస్తూ శిరీష్ మాట్లాడారు. వాళ్లకు సింగిల్ స్క్రీన్స్ పై నిజంగానే అంత ప్రేమ ఉంటే మల్టీప్లెక్స్ లని ఆపి సింగిల్ స్క్రీన్స్ ని డెవలప్ చేయొచ్చు కదా. కానీ అలా చేయరు. సింగిల్స్ స్క్రీన్స్ చెత్తగానే కనిపిస్తాయి. వీళ్ళు మాత్రం మల్టిప్లెక్స్ లతో లాభం పొందుతారు అని నాగవంశీ అన్నారు. పర్సెంటేజీ విధానం కావాలని కోరిన వాళ్ళ దగ్గరే మల్టిప్లెక్స్ లు ఎక్కువగా ఉన్నాయి మైత్రి రవిశంకర్ విమర్శించారు.

