మాల్దీవుల్లో బర్త్ డే కపుల్ చైతూ, సామ్.. తెగ ఎంజాయ్ చేస్తున్నారు
సినీ తారలకు ఇప్పుడు మాల్దీవులు అడ్డాగా మారింది. రకుల్ ప్రీత్ సింగ్, దిశాపటానీ, సోనాక్షి సిన్హా వంటి కథానాయికలు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. హాలీడేస్ తీసుకుని అందమైన ద్వీపకల్పంలో సేద తీరుతున్నారు. వీరి జాబితాలో బర్త్ డే కపుల్ నాగచైతన్య, సమంత కూడా చేరిపోయారు.
సోమవారం బర్త్ డే జరుపుకున్నారు నాగచైతన్య. ఆయనకిది సంతోషకరమైన బర్త్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే వరుస హిట్లతో ఉన్నారు.
అయితే ఈ సారి తన భర్త చైతూ బర్త్ డేని స్పెషల్ గా ప్లాన్ చేసింది ఆయన భార్య, స్టార్ హీరోయిన్ సమంత. మాల్దీవులకు తీసుకెళ్లింది.
ప్రస్తుతం వీరిద్దరు అక్కడ ఘాటు రొమాన్స్ లో మునిగితేలుతున్నారనే చెప్పాలి. అంతేకాదు సాహసాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా ఈ ఫోటోలను సమంత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఇందులో చైతూ బ్లూ షార్ట్ ధరించి సముద్ర అందాలను, మాల్దీవ్ అందాలను ఆస్వాధిస్తున్నారు. అలాగే సమంత కూడా సముద్ర డ్రెస్ ధరించి ఆకట్టుకుంది. ఈ సందర్భంగా స్పెషల్గా చైతూకి బర్త్ డే విషెస్ తెలిపిన సామ్.. ఎవరి జీవితాన్ని వాళ్లు తమదైన స్టయిల్లో బతకాలని తెలిపింది.
అంతేకాదు తనకు ఇష్టమైన స్కూబా డ్రైవ్ చేసింది. సముద్రంలోకి వెళ్ళింది సముద్రగర్భం అందాలను తిలకించింది. ఫైనల్గా ఇది సాధించినట్టు సమంత పేర్కొంది.
మరోవైపు పిట్టగూడుని పోలిన ఆకృతిలో కూర్చొని కొంటెగా పోజులిచ్చింది సామ్. ప్రస్తుతం తన మాల్దీవ్స్ ఫోటోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సమంత సినిమాలను పక్కన పెట్టి `సామ్జామ్` టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఇక చైతూ ప్రస్తుతం `లవ్స్టోరి`లో నటించగా, అది విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో `థ్యాంక్యూ` చిత్రంలో నటించబోతున్నారు. ఆయన బర్త్ డేని పురస్కరించుకుని సోమవారం `హ్యాపీబర్త్ డే యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యింది.