Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలకు 3500 మంది అతిథులు..వేదిక, భద్రతా ఏర్పాట్లపై ఆసక్తికర వివరాలు

మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలకు 3500 మంది అతిథులు..వేదిక, భద్రతా ఏర్పాట్లపై ఆసక్తికర వివరాలు

మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా మే 31న జరిగే గ్రాండ్ ఫినాలేకి అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఫైనల్ పోటీలు జరుగుతాయి. 

tirumala AN | Updated : May 28 2025, 10:59 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
మూడోసారి ఇండియాలో..
Image Credit : Instagram

మూడోసారి ఇండియాలో..

మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే ఈ నెల 31న హైదరాబాద్‌లోని HITEX ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనుంది. 1996, 2024 తర్వాత భారత్‌ మూడోసారి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 100కు పైగా దేశాల సుందరీమణులు గత నెల రోజులుగా వివిధ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

26
టాప్ మోడల్ విజేతగా నందిని గుప్తా 
Image Credit : google

టాప్ మోడల్ విజేతగా నందిని గుప్తా 

ఈ పోటీలు గచ్చిబౌలి స్టేడియం, శిల్పకళా వేదిక, ట్రైడెంట్ హోటల్ వంటి ప్రసిద్ధ స్థలాల్లో నిర్వహించబడ్డాయి. స్పోర్ట్స్ చాలెంజ్‌లో ఎస్తోనియాకు చెందిన ఎలీస్ రాండ్‌మా నాయకత్వంలోని యూరప్ బ్లూ టీమ్ విజేతగా నిలిచింది. టాలెంట్ షోకేస్‌లో ఇండోనేషియా ప్రతినిధి మోనికా కేజియా అద్భుతమైన ప్రదర్శనతో టాప్ 10లో స్థానం సంపాదించింది. మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ మోడల్ ఛాలెంజ్ లో విజేతగా నిలిచింది. 

హెడ్ టు హెడ్ చాలెంజ్‌లో ఆసియా-ఓషియానా నుంచి మిస్ టర్కీ, యూరప్ నుంచి మిస్ వేల్స్, ఆఫ్రికా నుంచి మిస్ జాంబియా, అమెరికాస్-కరేబియన్ నుంచి మిస్ ట్రినిడాడ్ అండ్ టొబాగో విజేతలుగా నిలిచారు. టాప్ మోడల్ కాంపిటీషన్‌లో మిస్ ఇండియా (నందిని గుప్తా), మిస్ ఐర్లాండ్, మిస్ నమీబియా, మిస్ మార్టినిక్  తమ ఖండాల్లో విజేతలుగా ఎంపికయ్యారు.

Related Articles

ఒక్క హీరోయిన్ తోనే 4 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన చిరంజీవి, పదేళ్లలో 19 సినిమాలు.. చివరికి శత్రువులుగా మారారు
ఒక్క హీరోయిన్ తోనే 4 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన చిరంజీవి, పదేళ్లలో 19 సినిమాలు.. చివరికి శత్రువులుగా మారారు
ఎన్టీఆర్ 102వ జయంతి: నివాళి అర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. ఎమోషనల్ గా కనిపించిన నందమూరి బ్రదర్స్
ఎన్టీఆర్ 102వ జయంతి: నివాళి అర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. ఎమోషనల్ గా కనిపించిన నందమూరి బ్రదర్స్
36
సుందరీమణుల సందడి 
Image Credit : Instagram

సుందరీమణుల సందడి 

ఫైనల్ కు ముందు పోటీదారులంతా తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు సందర్శించారు. చార్మినార్, యునెస్కో వారసత్వంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాలని సందర్శించారు. పోచంపల్లి పల్లెల్లోని ఇక్కత్ చేనేత కళను ఆస్వాదించారు. మహిళల సాధికారత, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ స్టార్ట్‌అప్‌లు వంటి సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.

46
మే 31న గ్రాండ్ ఫినాలే 
Image Credit : Instagram

మే 31న గ్రాండ్ ఫినాలే 

ఈ విధంగా సుందరీమణుల హంగామా హైదరాబాద్, తెలంగాణ ఇతర ప్రాంతాల్లో కొనసాగింది. మే 31న జరిగే తుది పోటీల్లో మొత్తం 40 మంది సుందరీమణులు క్వార్టర్ ఫైనల్స్ కి అర్హత సాధిస్తారు. వీరిలో ఇప్పటికే టాప్ మోడల్ ఛాలెంజ్, స్పోర్ట్స్ ఛాలెంజ్, టాలెంట్ ఛాలెంజ్, బ్యూటీ విత్ ఎ పర్సన్ ఇలా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో 14 మంది క్వార్టర్ ఫైనల్స్ కి చేరారు. మిగిలిన 26 మందిని న్యాయనిర్ణేతలు ఖండాల వారీగా ఎంపిక చేస్తారు. ఎంపికైన 14 మందిలో మిస్ ఇండియా నందిని గుప్తా కూడా ఉండడం విశేషం. 

56
ఫైనల్ పోటీలు ఇలా.. 
Image Credit : Instagram

ఫైనల్ పోటీలు ఇలా.. 

ఈ 40 మందిలో ఒక్కో ఖండం నుంచి 10 మంది చొప్పున పోటీదారులు ఉంటారు. ఆ తర్వాతి రౌండ్ లో ఒక్కో ఖండం నుంచి 5 మంది చొప్పున మొత్తం 20 మందిని న్యాయ నిర్ణేతలు ఫిల్టర్ చేస్తారు. ఆ తర్వాత 8 మందిని ఒక్కో ఖండం నుంచి ఇద్దరిని ఎంపిక చేస్తారు. విజేతని నిర్ణయించే ఫైనల్ పోటీకి ఒక్కో ఖండం నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు. ఇలా మిస్ వరల్డ్ కిరీటం కోసం జరిగే ఫైనల్ పోటీల్లో నలుగురు సుందరీమణులు ఉంటారు. ఆయా ఖండాల్లో వారిని విజేతలుగా ప్రకటిస్తారు. ఈ నలుగురిలో ఒక్కరిని న్యాయనిర్ణేతలు విజేతగా ప్రకటించి మిగిలిన వారిని రన్నరప్ లు గా అనౌన్స్ చేస్తారు. 

66
భారీ భద్రతా ఏర్పాట్లు 
Image Credit : Instagram

భారీ భద్రతా ఏర్పాట్లు 

ఈ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్రాన్ని సాంస్కృతికంగా, సామాజికంగా ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా నిలుస్తోంది. మే 31న సాయంత్రం 5:30 గంటలకు రెడ్ కార్పెట్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. అనంతరం గ్రాండ్ ఫినాలే పోటీలు HITEXలో ప్రారంభం అవుతున్నాయి.

ఫైనల్ పోటీల కోసం 3500 మంది అతిథులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు నిర్వహించనుంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు, సైబర్ పోలీసులు, అధికారులు, నిర్వాహకులు ఫైనల్ పోటీల భద్రత పై సమీక్షలు చేస్తున్నారు. 

tirumala AN
About the Author
tirumala AN
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది. Read More...
హైదరాబాద్
తెలంగాణ
 
Recommended Stories
Top Stories