గడ్డకట్టే మంచులో.. అమీర్తో ముద్దుసీన్ వెనకాల అసలు కథ చెప్పిన కరీష్మా
అమీర్ ఖాన్, కరీష్మా కపూర్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా `రాజా హిందుస్థాని` ఎంతటి బ్లాక్బస్టర్గా నిలిచిందే తెలిసిందే. ఇందులో లిప్లాక్ కిస్సులు చాలా ఫేమస్. ఆ ముద్దుల కథ చెప్పింది కరీష్మా.
`రాజా హిందుస్థాని` 1996లో విడుదలై ఆ దశకంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూడో చిత్రంగా నిలిచింది. దీనికి ధర్మేష్ దర్శన్ దర్శకత్వం వహించారు.
ఇందులో లిప్లాక్ కిస్సులు చాలా ఫేమస్. ఇటీవల కాలంలో లిప్లాక్ కిస్సులు ట్రెండ్ అయ్యాయి. కానీ అసలు వాటికి ఆ కాలంలో ఓ ఊపు తీసుకొచ్చారు అమీర్, కరీష్మా.
ఘాటు రొమాన్స్ కిది మరింత కిక్ని తీసుకొచ్చింది. దీంతో ఆడియెన్స్ సినిమాని ఎగబడి చూశారు. బ్లాక్ బస్టర్ చేశారు.
అయితే తాజాగా ఈ ముద్దు సీన్ వెనకాల అసలు కథని చెప్పింది కరీష్మా కపూర్. ఇటీవల ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయాలను పంచుకుంది. ఆ ముద్దు సీన్ గుర్తు చేసుకుంది.
కరీష్మా చెబుతూ, ఈ షాట్ పర్ఫెక్ట్ గా వచ్చేందుకు చాలా కష్టపడ్డామని తెలిపింది.
ఓ వైపు మంచు కురుస్తుండగా, గడ్డకట్టిన మంచులో ఫిబ్రవరి నెలలో ఈ సీన్ తీసినట్టు తెలిపింది. ఊటీలో ఈ సీన్ తీసినట్టు పేర్కొంది.
ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ చేసి, సాయంత్రం ఆరు గంటలకు క్లోజ్ చేసేవారట. ఆ ముద్దు సీన్ని ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేశారు. కానీ తాము మాత్రం చుక్కలు చూశామని చెప్పారు.
సరిగ్గా సీన్ రాకపోవడంతో దర్శకుడు కట్ చెబుతున్నాడు. టేక్ల మీద టేక్లు తీసుకుంటున్నాడు. మేమేమో మంచులో వణికిపోతున్నాం.
అంతటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో పనిచేయడం ఓ డిఫరెంట్ ఎక్స్ పీరియెన్స్. ఆ సంఘటనని లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది.
దాదాపు రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్ని తన అందచందాలు, నటనతో ఓ ఊపుఊపిన కరీష్మా కపూర్ 2012లో వచ్చిన `డేంజరస్ ఇష్క్` చిత్రం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల `జీరో` చిత్రంలో గెస్ట్ గా మెరిశారు. మరోవైపు టీవీ షోస్ చేస్తూ రాణిస్తుంది.