కమల్ హాసన్ తో మరో సినిమా ప్లాన్ చేసిన లోకేష్ కనగరాజ్, విక్రమ్ ను మించి ఉంటుందా..?
Kamal Haasan Reunite with Lokesh Kanagaraj : విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్ కాంబినేషనర్ మరోసారి సందడి చేయబోతోంది. ఈసారి విక్రమ్ ను మించి సినిమ ఉండబోతోందట. నిజమెంత.

లోకేష్ కనకరాజ్
కార్తి హీరోగా 2019 లో వచ్చిన ఖైదీ సినిమాతో దర్శకుడిగా పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు లోకేష్ కనగరాజ్.
లోకేష్ కనకరాజ్ సినిమాలు
కార్తి ఖైదీ సినిమా పాటలు, హీరోయిన్ లేకుండా, ఒకే రోజులో జరిగినట్లుగా చిత్రీకరించిన ఈ సినిమా, లోకేష్ కనకరాజ్ ను తదుపరి స్థాయికి తీసుకెళ్ళింది. ఈ సినిమా విజయం తర్వాత, తలపతి విజయ్ తో 'మాస్టర్' సినిమాను దర్శకత్వం వహించారు. ఆ తర్వాత కమల్ హాసన్ తో 'విక్రమ్' సినిమాను 60 నుండి 70 కోట్ల బడ్జెట్ తో తీసి, 450 కోట్లకు పైగా వసూలు చేసింది.
Also Read: 3500 కోట్ల ఆస్తి ఉన్న తెలుగు హీరో, 99 సినిమాలు చేస్తే 40 కి పైగా ప్లాప్ లే, ఎవరా స్టార్.?
విక్రమ్ సినిమా విజయం
లోకేష్ కనకరాజ్ తన సినిమాలను లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ గా రూపొందిస్తున్నారు. చివరిగా తలపతి విజయ్ తో లియో సినిమాను దర్శకత్వం వహించారు. ప్రస్తుతం రజినీకాంత్ తో 'కూలీ' సినిమా చేస్తున్న లోకేష్, ఆ తర్వాత నటుడు కార్తితో 'ఖైదీ 2' సినిమాను తీయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: రామ్ చరణ్, ఎన్టీఆర్ లాగా చిరంజీవి, బాలయ్య కాంబోలో భారీ మల్టీ స్టారర్? కథ రాస్తున్న దర్శకుడెవరంటే?
ఖైదీ 2 లో కమల్ ?
అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ, ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని సమాచారం. మొదటి భాగాన్ని నిర్మించిన ఎస్ ఆర్ ప్రభు ఈ సినిమాను కూడా నిర్మించే అవకాశం ఉంది. 'ఖైదీ 2 2' లో హీరోయిన్ గా రజిషా విజయన్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
లోకేష్ సినిమాలో కమల్ హాసన్
మొదటి భాగంలో నటించిన చాలా మంది నటులు ఈ భాగంలో కూడా నటించే అవకాశం ఉంది. కార్తితో పాటు కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారట. లోకేష్ కనకరాజ్ కమల్ హాసన్ కి కథ చెప్పారని, ఎప్పుడు షూటింగ్ అని అడిగి, షూటింగ్ కి వస్తానని కమల్ చెప్పారట. కమల్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read: బాబాయ్ బాలయ్య, అబ్బాయి ఎన్టీఆర్, ఇద్దరితో రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?