- Home
- Entertainment
- రామ్ చరణ్, ఎన్టీఆర్ లాగా చిరంజీవి, బాలయ్య కాంబోలో భారీ మల్టీ స్టారర్? కథ రాస్తున్న దర్శకుడెవరంటే?
రామ్ చరణ్, ఎన్టీఆర్ లాగా చిరంజీవి, బాలయ్య కాంబోలో భారీ మల్టీ స్టారర్? కథ రాస్తున్న దర్శకుడెవరంటే?
Chiranjeevi Balakrishna Combo: రామ్ చరణ్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ గా వచ్చి ఆర్ఆర్ఆర్ ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇలాగే చిరంజీవి , బాలకృష్ణ కాంబినేషన్ లో కూడా భారీ మల్టీ స్టారర్ కు ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ ఈ బిగ్ మూవీకి కథ రాస్తున్న దర్శకుడు ఎవరో తెలుసా..?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Chiranjeevi-Balakrishna Multi starer
Chiranjeevi, Balakrishna Mega Multi Starrer Movie: టాలీవుడ్ అనే కాదు ఏ ఇండస్ట్రీలో అయినా..ఇద్దరు పెద్ద హీరోలు ఉన్నారంటే.. వారి మధ్య ఫ్యాన్ వార్ కామన్. ఇద్దరు హీరోల సినిమాలు ఒకే సారి రిలీజ్అయితే.. అది పెద్ద యుద్దమే అవుతుంది. పొరపాటున ఒక హీరో సినిమా హిట్ అయ్యి మరో హీరో సినిమా డిజాస్టర్ అయితే.. ఇక యాంటీ ఫ్యాన్స్ చేసే ట్రోల్స్ కు.. అనే మాటలకు.. పొలిటికల్ వార్ కంటే ఫ్యాన్ వార్ దారుణంగా ఉంటుంది. తెలుగులో చిరు బాలయ్య, ఎన్టీఆర్,చరణ్, తమిళంలో అజిత్ విజయ్ ఇలా స్టార్ హీరోల మధ్య పోటీ అలా ఉంటుది.
Also Read: బాబాయ్ బాలయ్య, అబ్బాయి ఎన్టీఆర్, ఇద్దరితో రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?
అయితే ఫ్యాన్స్ మాత్రమే తన్నుకుంటారు. మాహీరో గొప్పంటే మా హీరో గొప్ప అంటుంటారు. హీరోలు మాత్రం బాగానే ఉంటారు. మన టాలీవుడ్ లో ఫ్యాన్స్ వార్ ఉన్న ఇద్దరు హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి ట్రిపుల్ ఆర్ లాంటి భారీ మల్టీ స్టారర్ చేసి ఆస్కార్ రేంజ్ కు వెల్ళారు. మధ్యలో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కూడా మా హీరోను తక్కువ చేశారంటూ రకరకాల పుకార్లు పుట్టించినా.. ఎన్టీఆర్, రామ్ చరణ్ మాత్రం అన్నదమ్ముల్లా చాలా క్లోజ్ గా ఉంటూ.. తమ మధ్య ఏ గొడవలులేవు అని ప్రూ చేసుకున్నారు.
Also Read: అజిత్ సినిమా వల్ల నా జీవితం నాశనం అయ్యింది.. హీరోయిన్ ఆవేదన
ఇక ఇలానే మెగాస్టార్ చిరంజీవి, నట సింహం బాలయ్య ఫ్యాన్స మధ్య కూడా దశాబ్ధాలుగా ఫ్యాన్స్ వార్ నడుస్తూనే ఉంది. ఇక ఈ ఇద్దరు హీరోలతో కూడా భారీ మల్టీ స్టారర్ ను ప్లాన్ చేశారట. రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరు, బాలయ్యకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ ఇద్దరు స్టార్లు కలిసి సినిమా చేస్తే రికార్డ్ బద్దలవ్వడం ఖాయం..బాక్సా ఫీస్ బ్రేక్ అవ్వడం ఖాయం. కాని ఈ ఇద్దరు హీరోలను ఒప్పించడమే పెద్ద పని. ఈ స్టార్ హీరోల పాత్రలు ఎవరు తక్కువ కాకుండా.. ఎవరు ఎక్కువ కాకుండా.. హోరా హోరీగా ఇమేజ్ లు బ్యాలెన్స్ చేస్తూ కథ రాయగలగాలి. ఇందుకోసం ప్రయత్నాలు జరుగుతన్నాయి అనేది టాక్.
నిజమెంతో తెలియదు కాని. చిరంజీవి, బాలయ్య తో భారీమల్టీ స్టారర్ కోసం బోయపాటి శ్రీనును డైరెక్టర్ గా తీసుకోబోతున్నారు అని టాక్ నడుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కోసం ఆయన ఓ కథను రాసే పనిలో ఉన్నాడన్నది సమాచారం. అంతే కాదు ఈసినిమా కోసం బాలయ్యతో పాటు చిరు కూడా ఇంట్రెస్ట్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. సమరసింహారెడ్డి, ఇంద్రసేనా రెడ్డి రేంజ్ లో వీరిద్దరి పాత్రలు ఉండబోతున్నాయట. దాని కోసం కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం.
ఈ వార్త నిజమయ్యి.. ఇండస్ట్రీ నుంచి వస్తున్న టాక్ సరైందే అయితే.. ఈ ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్ మధ్య మనస్పర్ధలు పోయి.. పండగ చేసుకునే అవకాశం ఉంది. ఒక వేళ ఇద్దరి పాత్రలో ఏమైన తేడాలు వస్తే.. ఫ్యాన్స్ వార్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. విమర్శలు, ట్రోల్స్ పక్కన పెడితే.. నిజంగా చిరంజీవి, బాలకృష్ణ కలిసి భారీ మల్టీ స్టారర్ చేస్తే.. అద్భుతమే జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Also Read: 1000 కోట్ల సినిమాను, ఒక్క యంగ్ హీరో కోసం వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Chiranjeevi-Balakrishna
రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా అప్పుడు కూడా ఎన్టీఆర్ పాత్రను తగ్గించారంటూ విమర్శలు వచ్చినా.. అవేమి పంటించుకోకుండా సినిమాను ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్ళారు టీమ్. అలాగే బాలయ్య, మెగాస్టార్ కలిసి సినిమా చేస్తే.. అది కూడా పవర్ ఫుల్ రోల్స్ చేస్తూ అద్భుతంగా ఉంటుంది. మరి ఇది నిజంగా జరుగుతుందా..? లేక రూమర్ గానే మిగిలిపోతుందా అనేది చూడాలి.