ఇండియా పాకిస్తాన్ తొలి యుద్ధం.. ఎన్టీరామారావు లెటర్ వైరల్.. ఏం చేశాడంటే?
ఇండియా పాకిస్తాన్ యుద్ధం వేళ నందమూరి తారక రామారావు రాసిన ఒక లెటర్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇండో పాక్ తొలి యుద్ధం సమయంలో ఆయన రియాక్షన్ ఇందులో ఉండటం విశేషం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
india pakistan war
ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. పాక్ ఇప్పటికే పూర్తి స్థాయి మిలటరీ వార్ని ప్రకటించింది. పాక్ అత్యుత్సాహానికి భారత్ ధీటుగా బదులు చెబుతుంది. ఈ ఉగ్రవాద దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
ఈ క్రమంలో భారత ప్రభుత్వం యుద్ధానికి సంబంధించి నేడు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. భారత్ కూడా పూర్తి స్థాయి మిలటరీ వార్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
vijay deverakonda
ఇదిలా ఉంటే మన దేశం కోసం పోరాడుతూ కొందరు సైనికులు వీరమరణం పొందారు. మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ `ఆపరేషన్ సిందూర్`లో పోరాడి వీరమరణం పొందిన విషయం తెలిసిందే. మరో సైనిక అధికారి కూడా దేశం కోసం ప్రాణాలను అర్పించారు.
ఈ క్రమంలో సైన్యం కోసం కొందరు ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. సినిమా రంగం నుంచి విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్ తమ విరాళాన్ని ప్రకటించారు. మరికొందరు ముందుకు వస్తున్నారు.
sr ntr
ఈ క్రమంలో ఎన్టీరామారావుకి సంబంధించిన లెటర్ ఒకటి వైరల్ అవుతుంది. ఇండియా పాకిస్తాన్ తొలి యుద్ధం(1965) సమయంలో మన దేశం కోసం పోరాడుతున్న వీర సైనికుల నిధికి విరాళం సేకరించడానికి స్వయంగా రంగంలోకి దిగారు.
ఈ మేరకు ఆయన ప్రజలను ఉద్దేశించి ఒక లెటర్ ని విడుదల చేశారు. 60ఏళ్లనాటి ఆ లెటర్ ని సీనియర్ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. మరి ఇందులో ఎన్టీ రామారావు ఏం చెప్పాడనేది చూస్తే.
sr ntr letter
`ఈనాడు మన భద్రత కోసం, దేశ గౌరవం కోసం దుష్ట శత్రువు నెదుర్కొని భీకర సంగ్రామంలో ప్రాణ త్యాగం చేస్తున్న సోదర భారత వీర సైనికుల సహాయార్థం దేశ రక్షణ నిధి సేకరణకై నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్య కేంద్రాలలో ప్రదర్శనలీయ సంకల్పించాను. నా అభిమానుల ఆదరణ, యావదాంధ్ర ప్రజానీకం ఆశీస్సులు, మా పరిశ్రమ అండదండలు ఈ ప్రజాహిత కార్యాన్ని జయప్రదం చేయగలవనే విశ్వాసము ఉన్నాను.
నన్నీ కార్యానికి పురికొల్పినవి నా అభిమానుల, కళాపోషకుల, చలనచిత్ర పరిశ్రమల అనుబంధ వ్యాపార సంస్థల, సహకార సంపత్తులు. వారి ఆశీస్సులు అర్థిస్తూ మాతృదేశ సంరక్షణకై తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయ విజ్ణప్తి చేస్తున్నాను` అని ప్రజలను ఉద్దేశించి ఎన్టీఆర్ ఈ లెటర్ని విడుదల చేశారు.
sr ntr
ఇండియా పాకిస్తాన్ తొలి యుద్ధం 1965లో జరుగుతున్నప్పుడు ఎన్టీరామారావు భారత సైన్యం కోసం ఈ విధంగా స్పందించారు. తనవంతుగా విరాళం సేకరించి సైనికులకు అందించారు.