జబర్దస్త్ కంటెస్టెంట్స్ ను కాపాడుకునేందుకు యాజమాన్యం తిప్పలు: హైపర్ ఆది సంచలనం
ఇకపోతే జీ తెలుగులో ప్రసారమయిన అదిరిందిలోని కంటెస్టెంట్లందరూ ఈటీవీ నుండి వచ్చినవారే అనేది నిర్వివాదాంశం. చంద్ర, ధనరాజ్, వేణు వంటి వారు జబర్దస్త్ ప్లాట్ ఫారం నుండి వెళితే సద్దాం, ఎక్స్ ప్రెస్ హరి, యాదమ్మ రాజు వంటివారు పటాస్ షో నుండి వెళ్ళినవారు.
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఎంతలా పాపులర్ అయ్యాయో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా జబర్దస్త్ లో హైపర్ ఆది వేసే పంచులకు ప్రేక్షకులు పడిపడి నవ్వడం మనం చూస్తూనే ఉంటాము. ఒక్కసారి స్కిట్ మొదలు పెడితే ఆ పంచులు జెనరేట్ చేసే నవ్వుల ప్రవాహంలో ఎవ్వరైనా తడిసి ముద్దవ్వాల్సిందే.
ఇక ఇదే షో కి పోటీగా జబర్దస్త్ నుండి బయటకు వెళ్లిన నాగబాబు జీ తెలుగులో అదిరింది పేరుతో కొత్త దుకాణం పెట్టారు. కానీ అది అనుకున్నంత సక్సెస్ ని సాధించలేకపోయింది. దానితో అదిరిందికి నూతన హంగులు అద్దారు.
రవి, భానుశ్రీని బయటకు పంపించివేశారు. యాంకర్ శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. మరో జడ్జి గా ఉన్న నవదీప్ ను పక్కనపెట్టేసి జానీ మాస్టర్ కి వెల్కమ్ చెప్పారు. నూతన హంగులను అద్దడంతో అదిరింది కాస్తా బొమ్మ అదిరింది అయింది. (Pic Courtesy: Zee Telugu)
ఇకపోతే జీ తెలుగులో ప్రసారమయిన అదిరిందిలోని కంటెస్టెంట్లందరూ ఈటీవీ నుండి వచ్చినవారే అనేది నిర్వివాదాంశం. చంద్ర, ధనరాజ్, వేణు వంటి వారు జబర్దస్త్ ప్లాట్ ఫారం నుండి వెళితే సద్దాం, ఎక్స్ ప్రెస్ హరి, యాదమ్మ రాజు వంటివారు పటాస్ షో నుండి వెళ్ళినవారు.
ఈటీవీలో కంటెస్టెంట్లందరిని జీ తెలుగు షో నిర్వాహకులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ షో హిట్ అవ్వాలంటే అక్కడ కామెడీ డోస్ ఎక్కువగా ఉండాలని భావిస్తున్నారు బొమ్మ అదిరింది నిర్వాహకులు. ఇందుకోసం మరికొంతమందిని అక్కడకు లాగే ప్రయత్నం చేస్తున్నారు.
ఇందుకోసం జబర్దస్త్ లో బాగా ఎలివేట్ అయిన హైపర్ ఆదికి గాలం వేయడానికి ఆ షో నిర్వాహకులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారట. ఈ విషయాన్నీ హైపర్ ఆది యే చెప్పకనే చెప్పేసాడు. వారి ప్రలోభాలకు లొంగొద్దని జబర్దస్త్ నిర్వాహకులు బ్రతిమిలాడుకుంటున్నారని అన్నాడు.
ఇంతకీ ఎక్కడ ఈ మాటలు అన్నాడు అని అనుకుంటున్నారా..? జబర్దస్త్ స్టేజి మీదనే. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో హైపర్ ఆది ఈ విషయాన్ని బయటపెట్టాడు. అడుక్కునే వ్యక్తి క్యారెక్టర్ వేసిన హైపర్ ఆది అడుక్కోవడం గురించి ఉపదేశం చేస్తూ ఈ విషయాన్నీ బయటపెట్టాడు. (Pic Courtesy: etv Jabardasth)
అడుక్కునే మనకు ఎంట్రీ సాంగులు అవసరమంటావా అని లేడీ గెటప్ లో ఉన్న శాంతి అనడంతో అడుక్కోంది ఎవరంటూ చిట్టా విప్పాడు ఆది. జడ్జిలు కామెడీ పెంచమని అడుక్కుంటే కంటెస్టెంట్లు పేమెంట్లు పెంచమని అడుక్కుంటారు, యాంకర్లు క్లోజ్ లు ఎక్కువ వేయమని అడుక్కుంటారు, పక్క షో వాళ్ళు మా షో కి రండి అని అడుక్కుంటే, ఈ షో వాళ్ళు మీరు లొంగకండి అని అడుక్కుంటారని,మీరు మీరు కలిసి మమ్మల్ని మింగకండి అని కంటెస్టెంట్లు అడుక్కుంటారని ఆది అసలు విషయాన్నీ బయటపెట్టాడు. (Pic Courtesy: Zee Telugu)
ఈ విషయాన్నీ బట్టి జబర్దస్త్ వారికి అదిరింది షో నిర్వాహకులు బలంగానే గాలం వేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇది ఏ ఒక్క హైపర్ ఆదికి మాత్రమే వచ్చిన సమస్య కాదు. జబర్దస్త్ లోని ఇతర కామెడియన్లకు కూడా ఉన్న ఇబ్బందే అని అర్థమవుతుంది.