వారసులకే మర్యాదలు అందుకే నాకు అసహ్యం... సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు
తాజాగా హీరోయిన్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. డాన్స్ రియాలిటీ షోస్ ని ఉద్దేశిస్తూ సాయి పల్లవి కొంచెం ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
Sai Pallavi
ఇటీవల సాయి పల్లవి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడూతూ... టెలివిజన్ ఛానల్స్ లో డబ్బుకే ప్రాధాన్యత ఇస్తారు. ప్రముఖుల వారసులకే మర్యాదలు, గౌరవాలు దక్కుతాయి. అందుకే నాకు డాన్స్ రియాలిటీ షోస్ పై నమ్మకం లేదు. ఒక విధంగా చెప్పాలంటే డాన్స్ పోటీలు అంటే నాకు అసహ్యం, అన్నారు.
డాన్స్ షోస్ తో వెలుగులోకి వచ్చిన సాయి పల్లవి ఇంత దారుణమైన కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. మంచి డాన్సర్ అయిన సాయి పల్లవి విజయ టీవీలో ప్రసారమైన తమిళ డాన్స్ రియాలిటీ షో ''ఉంగళిల్ యారు అడుత్త ప్రభుదేవా'' షోలో పోటీపడ్డారు. ఫైనల్ కి చేరిన సాయి పల్లవి రన్నర్ గా నిలిచారు.
బహుశా ఈ ఫలితం సాయి పల్లవి అసహనానికి కారణం కావచ్చు. మొదటి బహుమతి రావాల్సిన నన్ను ప్రముఖుల కోసం తొక్కేశారని సాయి పల్లవి భావిస్తూ ఉండవచ్చు. అసలు డాన్స్ రియాలిటీ షోలలో జరిగేదంతా మోసమే అని పరోక్షంగా చెప్పడం ద్వారా సాయి పల్లవి అతి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు.
ప్రస్తుతం సాయి పల్లవి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె అభిప్రాయాన్ని సమర్దిస్తుండగా మరికొందరు తప్పుబడుతున్నారు. మరోవైపు సాయి పల్లవి సడన్ గా సినిమాలు తగ్గించారు. ఆమె అధికారికంగా ఒక్క తెలుగు చిత్రానికి కూడా సైన్ చేయలేదు.
సాయి పల్లవి అనధికారిక విరామం ఫ్యాన్స్ ని ఆందోళను గురి చేస్తుంది. ఆమె డై హార్డ్ ఫ్యాన్స్ సాయి పల్లవి సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. సాయి పల్లవి చివరి చిత్రం గార్గి. తెలుగు తమిళ భాషల్లో విడుదలైంది. తెలుగులో ఆమె ట్రాక్ చాలా బాగుంది.
సాయి పల్లవి గత మూడు తెలుగు చిత్రాల్లో రెండు సూపర్ హిట్ అయ్యాయి. లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ మంచి విజయాలు నమోదు చేశాయి. విరాటపర్వం మాత్రం నిరాశపరిచింది. డిమాండ్ ఉండి కూడా సాయి పల్లవి కొత్త చిత్రాల ప్రకటన ఎందుకు చేయడం లేదో అర్థం కావడం లేదు.