మూడుముళ్ల బంధానికి అడ్డుగా కరోనా... పెళ్లిళ్లు వాయిదా బుల్లితెర సెలబ్రిటీ జంటలు!
కక్కొచ్చిన కళ్యాణం వచ్చినా ఆగదు అనేది పెద్దల సామెత. కానీ కరోనా ఎదురొస్తే ఆ కళ్యాణానికి కూడా బ్రేక్ పడాల్సిందే. ప్రేమ బంధంతో చేరువై మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వాలనుకుంటున్న కొన్ని జంటల ఆశలపై నీళ్లు చల్లింది కరోనా. ఈఏడాది పెళ్లి చేసుకుందాం అనుకున్న కొందరు సెలెబ్రిటీల పెళ్లిళ్లు ఆగిపోయాయి. కరోనా కారణంగా పెళ్లిళ్లు వాయిదా వేసుకున్న ఆ సెలబ్రిటీ జంటలు ఎవరో చూసేయండి.
బుల్లితెర నటులు రాహుల్ విద్య, దిశా పార్మర్ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. 2021లో వీరు పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ శుభవార్తను మీడియాతో, సన్నిహితులతో కూడా పంచుకున్నారు. ఐతే కరోనా సెకండ్ వేవ్ పెళ్ళికి మొండికాలు అడ్డుపెట్టింది. పెళ్లి వాయిదా వేసుకున్న రాహుల్ విద్యా ‘‘కరోనా కారణంగా మేం ఈ శుభకార్యం నిర్వహించలేకపోయాం. పరిస్థితులు కొంచెం చక్కబడగానే చేయాల్సింది చేస్తాం’’ అని మీడియాకు వివరణ ఇచ్చాడు.
యాక్టర్ విపుల్ రాయ్.. అమెరికాకు చెందిన తన ఫియాన్సీ మెలిస్ ఆటిసిని గతేడాదే వివాహం చేసుకోవాల్సింది. గత ఆగస్టులో వీళ్ల పెళ్లికి అన్నీ సిద్ధం అయిపోయాయి. కానీ కరోనా వచ్చి అడ్డుతగిలింది. దీంతో చేసేదేంలేక పెళ్లి వాయిదా వేసుకున్నారు.
మరో ఫేమస్ సీరియల్ నటి శ్రీజిత డీ, మైకేల్ బ్లామ్ పాపే చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ ఏడాది మొదట్లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు ఈజంట. కానీ కరోనా మహహ్మారి విజృంభించడంతో తమ ప్లాన్ మార్చుకోవాల్సి వచ్చింది. పెళ్లిపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని ఈ జంట తెలియజేశారు.
ఫేమస్ హిందీ సీరియల్ ససురాల్ సిమర్ కా నటి వైశాలి టక్కర్ ఈ ఏడాదే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. డాక్టర్ అభినందన్ సింగ్ హుందాల్తో ఏప్రిల్లో ఆమె నిశ్చితార్థం కూడా జరిగింది. జూన్లో వివాహం చేసుకోవాలని ముహూర్తం పెట్టుకున్నారు. ఐతే కరోనా కారణంగా ఏర్పడిన దుర్భర పరిస్థితుల మధ్య పెళ్లి చేసుకోలేనని ఆమె చెప్పారు. వీరిద్దరి పెళ్లి జరగాలంటే సాధారణ పరిస్థితులు ఏర్పడాలి.
నటి సయంతని ఘోష్, అనుగ్రహ్ తివారీ ఇంకా దురదృష్టవంతులు. గతేడాదే వీరి వివాహం జరగాల్సి ఉంది. అప్పుడు కరోనా ఉందని ఈ ఏడాదికి వాయిదా వేశారు. రెండోసారి కూడా వారి వివాహానికి కరోనా అడ్డు తగిలింది. పెళ్లి ఘనంగా చేసుకోవాలన్న కోరిక నాకు లేదు, ఐతే ఇలాంటి కఠిన పరిస్థితుల మధ్య పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే వాయిదా వేస్తున్నాము అంటూ నటి సయంతని ఘోష్ తెలిపారు.
టెలివిజన్ సెలెబ్రిటీ జంట టీనా ఫిలిప్, నిఖిల్ శర్మ 2020 ఏప్రిల్లో ఘనంగా వివాహం చేసుకోవాలని అనుకున్నారు, లాక్ డౌన్ పరిస్థితుల రీత్యా అప్పుడు కుదరలేదు. కనీసం 2021లో అయినా పెళ్లి చేసుకుందాం అనుకున్న ఈ జంటకు నిరాశే మిగిలేలా ఉంది. ఈ కపుల్ బంధుమిత్రులు కూడా విదేశాలలో ఉన్నారట. భారత్ లో నెలకొన్న పరిస్థితుల రీత్యా వారు రావడం కుదరదు కాబట్టి ఇప్పట్లో వీరిద్దరి పెళ్లి గగనమే.