- Home
- Entertainment
- పాలిటిక్స్ వల్ల ఆ స్టార్ తో మూవీ చేయలేకపోయా, ఎన్టీఆర్ తో కూడా మిస్ అయింది.. గోపీచంద్ మలినేని కామెంట్స్
పాలిటిక్స్ వల్ల ఆ స్టార్ తో మూవీ చేయలేకపోయా, ఎన్టీఆర్ తో కూడా మిస్ అయింది.. గోపీచంద్ మలినేని కామెంట్స్
ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ దర్శకులలో గోపీచంద్ మలినేని ఒకరు. రీసెంట్ గా గోపీచంద్ మలినేని బాలీవుడ్ లో సీనియర్ హీరో సన్నీ డియోల్ తో జాట్ అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Gopichand Malineni , Jr NTR
ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ దర్శకులలో గోపీచంద్ మలినేని ఒకరు. రీసెంట్ గా గోపీచంద్ మలినేని బాలీవుడ్ లో సీనియర్ హీరో సన్నీ డియోల్ తో జాట్ అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత సన్నీ లియోన్ మాస్ గా కనిపించిన చిత్రం ఇదే. బాలీవుడ్ లో జాట్ మూవీ మంచి విజయమే సాధించింది.
Director Gopichand Malineni
రీసెంట్ గా ఇంటర్వ్యూలో గోపీచంద్ మలినేని కొన్ని ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. వీర సింహారెడ్డి తర్వాత తాను మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ నేను ఆ మూవీ తర్వాత తమిళ స్టార్ దళపతి విజయ్ తో సినిమా చేయాలని ప్రయత్నించాను. దిల్ రాజు సమక్షంలో విజయ్ కి కథ కూడా చెప్పడం జరిగింది. స్టోరీ వినగానే విజయ్ సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశారు.
Gopichand malineni, vijay
కానీ అదే సమయంలో విజయ్ పొలిటికల్ ఎంట్రీ కి రెడీ అవుతున్నారు. చివరి చిత్రానికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. ఆ టైంలో తెలుగు డైరెక్టర్ తో మూవీ వద్దని విజయ్ కి ఆయన సన్నిహితులు చెప్పారట. ఆ విధంగా విజయ్ తో మూవీ మిస్ అయిందని గోపీచంద్ తెలిపారు.
అంతకుముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా ఒక చిత్రం మిస్ అయిందని గోపీచంద్ పేర్కొన్నారు. పండగ చేస్కో తర్వాత ఎన్టీఆర్ కి మోస్ట్ వైలెంట్ గా ఉండే ఒక కథ చెప్పాను. ఆయనకు నచ్చింది. కానీ నీ నుంచి ఎంటర్టైన్మెంట్ మూవీ ఆశిస్తున్నాను గోపి అని ఎన్టీఆర్ అన్నారు. దీంతో ఎన్టీఆర్ కోసం వినోదం ఉండే కథని ప్రిపేర్ చేయాలనుకున్నా. కానీ కుదరలేదని గోపీచంద్ తెలిపారు. ఇప్పుడు ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో. ఆయనతో సినిమా చేయాలంటే భారీ యాక్షన్ కథతోనే చేస్తాను అని గోపీచంద్ తెలిపారు.
Jr NTR
మరొక ఆసక్తికర విషయం ఏంటంటే.. బాలయ్యతో ముందుగా అనుకున్నది వీర సింహారెడ్డి కథ కాదు. ఇప్పుడు నేను బాలీవుడ్లో తెరకెక్కించిన జాట్ చిత్రాన్ని బాలయ్యతో చేయాలనుకున్నా. కానీ బాలయ్య.. గోపి అఖండ తర్వాత అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. వాటిని మ్యాచ్ చేయాలంటే ఒక మంచి ఫ్యాక్షన్ కదా చేయాల్సిందే అని అన్నారు. దీంతో జాట్ కథని పక్కన పెట్టి వీర సింహారెడ్డి స్టోరీ రెడీ చేసినట్లు గోపీచంద్ తెలిపారు.