#Hanuman నిర్మాతని దిల్ రాజు కావాలనే హర్ట్ చేసాడా? ఎందుకలా?
ఎందుకు దిల్ రాజు అలా అన్నారు అంటే అంతకు ముందు హనుమాన్ నిర్మాత...దిల్ రాజు నైజాంలో గుంటూరు కారంకు థియేటర్ కేటాయింపు విషయంలో అన్యాయం చేసాడని అనటమే కారణం అంటున్నారు. ఆ వివరాలు చూద్దాం.
Dil Raju, hanuman
పెద్ద సినిమాలను బట్టి స్క్రీన్లు కేటాయిస్తాం. ముందు మహేష్ బాబు సినిమా గుంటూరు కారం, ఆ తర్వాత వెంకటేష్ సైంధవ్, నాగార్జున అక్కినేని నా సామిరంగ సినిమాలకు స్క్రీన్లను కేటాయిస్తాం. ఆ తర్వాత హనుమాన్ సినిమాకు స్క్రీన్లు కేటాయిస్తాం. కాబట్టి మీడియా దీనికి సహకారం అందించాలి. మీరు పాజిటివ్గా స్పందిస్తే.. మేము మంచి చేయడానికి ముందు వెళ్తాం. నెగిటివ్గా స్పందిస్తే ఏమీ కాదు అని దిల్ రాజు అనటం చర్చనీయాంశంగా మారింది. కావాలనే చివర్లో హనుమాన్ సినిమాని పెట్టారని, హనుమాన్ నిర్మాతని హర్ట్ చేయటానికే ఈ మాటలు అన్నారని టాక్ నడుస్తోంది. అయితే ఎందుకు దిల్ రాజు అలా అన్నారు అంటే అంతకు ముందు హనుమాన్ నిర్మాత...దిల్ రాజు నైజాంలో గుంటూరు కారంకు థియేటర్ కేటాయింపు విషయంలో అన్యాయం చేసాడని అనటమే కారణం అంటున్నారు. ఆ వివరాలు చూద్దాం.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hk7bj43hw2ydq1z6vggzgbnd/dilraju-cleanup-jpg_300x168xt.jpg)
#Gunturkaaram, #MaheshBabu, #Trivikram,dil raju
ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా సంక్రాంతి రిలీజ్ ల గురించిన చర్చే. ముఖ్యంగా దిల్ రాజు మాగ్జిమం థియేటర్స్ ని గుంటూరు కారంకు కేటాయించటం , హనుమాన్ కు దెబ్బ వేసినట్లు గా ఫీలవుతున్నారు. ‘హనుమాన్’ మూవీని సంక్రాంతి రేసు నుంచి తప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినా అవి విఫలమే అయ్యాయని ఒక సందర్భంలో ప్రశాంత్ వర్మనే ఓపెన్గానే వాపోయాడు. అంతే కాకుండా కచ్చితంగా జనవరి 12న తన సినిమా విడుదల అవ్వాలని ఫిక్స్ అయిపోయాడు. అయితే అదే సమయంలో నైజాం, ఆంధ్రాలో అత్యధికంగా గుంటూరు కారం సినిమాకే ఎక్కువ కేటాయించారనే విషయం చర్చనీయాంశమైంది.
గుంటూరు కారం చిత్రం నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను దిల్రాజు తీసుకున్నారు. జనవరి 12న గుంటూరు కారంతోపాటు హనుమాన్ కూడా రిలీజ్ అవుతోంది. అందుకే హనుమాన్ను దెబ్బతీసేందుకు నైజాంలో 95 శాతం థియేటర్లను గుంటూరు కారం చిత్రానికే కేటాయించారు. హైదరాబాద్లో 96 సింగిల్ స్క్రీన్లు ఉండగా అందులో 90 స్క్రీన్లలో గుంటూరు కారం వేస్తున్నారు. హనుమాన్ చిత్రానికి నాలుగైదు థియేటర్లే కేటాయించారని తెలుస్తోంది. దిల్రాజు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల హనుమాన్ చిత్రానికి ఎలాంటి నష్టం జరుగుతుందోనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Dil Raju
అయితే ఈ నేపథ్యంలో హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. దిల్ రాజుతో మాట్లాడినప్పుడు మా సమస్య గురించి క్లారిటీ చెప్పాం. మాది పాన్ ఇండియా సినిమా. నార్త్, ఇతర భాషల్లో రిలీజ్కు ఏర్పాట్లు జరిగిపోయాయి. మేము డేట్ మార్చుకోలేని పరిస్థితి. 11వ తేదీ గానీ, 14వ తేదీ గానీ రావడానికి వీలు కాదు. తెలుగు రాష్ట్రాలతోపాటు అన్నిభాషల్లో రిలీజ్ చేస్తున్నందున రిలీజ్ డేట్ మార్చుకోలేం. అంతేగానీ.. మీ సినిమా మీద కాంపిటిషన్గా వేయడం లేదు అని నిరంజన్ రెడ్డి చెప్పారు.
Ravi Teja
ఇక తెలంగాణలో సింగిల్ 75 స్క్రీన్లు ఉన్నాయి. మల్టీప్లెక్స్లో సినిమా క్రేజ్ బట్టి స్క్రీన్లు కేటాయిస్తారు. కానీ 75 స్క్రీన్లలో మాదే గుత్తాధిపత్యం ఎందుకు? మాకు 15 నుంచి 20 స్క్రీన్లు ఇవ్వమని అడుగున్నాం. కంటెంట్ను బట్టి ఎవరి సినిమా ఏంటనేది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు అని నిరంజన్ రెడ్డి తెలిపారు.
నైజాం విషయానికి వస్తే.. జిల్లాలో మేము కొన్ని స్క్రీన్లను తీసుకొన్నాం. కానీ హైదరాబాద్ సిటీలోనే 78 స్క్రీన్లు ఉన్నాయి. వాటిలో 20 స్క్రీన్లు అడుగుతున్నాం. అయితే వారు ఇస్తారా? ఇవ్వరా? అనేది వేచి చూడాల్సిందే. మా సినిమా బాగుంటుంది. ప్రేక్షకులు ఎక్కడికైనా వెళ్లి చూస్తారనేది మా ఫీలింగ్. 75 స్క్రీన్లు ఉంటే.. అన్నీ మేము తీసుకొంటామంటే.. అది వివక్ష కాదా? అని నిరంజన్ రెడ్డి చెప్పారు.
అంతేకాదు హనుమాన్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నాం. అందుకని మేము ఏ సినిమాను చిన్నచూపు చూడటం లేదు. అయితే రిలీజ్ వాయిదా పడితే మాకు భారీగా నష్టం వాటిల్లుతుంది. సంక్రాంతికి హిందీ, తెలుగు, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. ఫిబ్రవరిలో చైనీస్, జపాన్, కొరియన్ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం అని నిరంజన్ రెడ్డి చెప్పారు.
హనుమాన్ సినిమాకు ఎవరి నుంచి సపోర్ట్ లేదు. మేము ఒంటరి పోరాటం చేస్తున్నాం. ఈ సినిమాకు చిరంజీవి గారు సపోర్ట్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కు వారు వస్తున్నారు. రవితేజ తన ఈగిల్ సినిమా ఉన్నా.. మా సినిమాలోని ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. అందుకు థ్యాంక్యూ చెప్పడం చిన్న మాట అవుతుంది. అంత గొప్ప పనిచేశారు అని నిరంజన్ రెడ్డి తెలిపారు.
అలాగే సంక్రాంతి విడుదలల గురించి మాట్లాడడానికి తాజాగా తెలుగు నిర్మాతలంతా ప్రెస్ మీట్ పెట్టగా.. అందులో ‘హనుమాన్’ మూవీ రిలీజ్పై స్పందించారు దిల్ రాజు. ‘‘ప్రశాంత్ వర్మ నన్ను కలిసి మాట్లాడారు. అప్పుడు నిరంజన్ రెడ్డి అందుబాటులో లేరు. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రోజు వచ్చేలా ట్రై చేసుకోండి అని నేను చెప్పాను. 12,13,14,15 ఇలా. మేజర్గా హిందీ టార్గెట్ చేస్తున్నాం. అందుకే 12న విడుదల కావాలి. వేరే ఆప్షన్ లేదు అని ప్రశాంత్ వర్మ చెప్పారు.
ప్రశాంత్ వర్మ చెప్పిన దాన్నిబట్టి వారు మేజర్గా హిందీ రిలీజ్ కోసం చూస్తున్నారు కాబట్టి అలా అంటే వారికి శుక్రవారమే రిలీజ్ ఉండాలి. కాబట్టి అది మారడానికి ఛాన్స్ లేదు. ‘గుంటూరు కారం’ అయితే ఎప్పటినుండో అదే రోజు రిలీజ్ చేయాలని చూస్తున్నారు. పెద్ద స్టార్ సినిమా కాబట్టి వారు వారం మొత్తం వారికే కావాలని చూస్తారు. వారు కూడా మారడానికి ఛాన్స్ లేదు. రెండు సినిమాలు ఒకేరోజు వచ్చే అవకాశాలే ఉన్నాయి’’ అంటూ ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’కు పోటీ తప్పదని దిల్ రాజు తెలిపారు.
మీడియా ప్రశ్నకు దిల్ రాజు బదులిస్తూ ‘‘రెండు సినిమాల్లో ఏదో ఒక సినిమాను పోస్ట్పోన్ చేయడానికి కృషి చేస్తాం. ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రయత్నిస్తాం. అవి కాకుండా 13న ఒక సినిమా, 14న ఒక సినిమా విడుదల కానున్నాయి. మీరేదో అడుగుతారు, మేమేదో చెప్తాము. దయజేసి దానిని హైలెట్ చేయొద్దు. హెల్తీ పోటీ కోసం చేసే ప్రయత్నం ఇది. అందరూ సాయం చేసి దీనిని కరెక్ట్గా ముందు తీసుకెళ్లండి’’ అంటూ సంక్రాంతి విడుదల గురించి ఒక క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు.
Hanuman
తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ మూవీ ఒక సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీలో హీరోయిన్గా అమృతా అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలయిన టీజర్, ట్రైలర్, పోస్టర్స్.. అన్నీ ఈ జోనర్ సినిమాలు ఇష్టపడేవారిని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
HanuMan
పైగా తెలుగులో మాత్రమే కాదు.. ‘హనుమాన్’ను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇతర భాషల్లో కూడా ప్రమోషన్స్ భారీగానే జరుగుతున్నాయి. ఫైనల్గా దిల్ రాజు చెప్పినదాని ప్రకారం సంక్రాంతికి ‘గుంటూరు కారం’ వర్సెస్ ‘హనుమాన్’ పోటీ తప్పదని అర్థమవుతోంది. అయితే ఎంత పోటీ ఉన్నా... మరో నిర్మాతను దిల్ రాజు టార్గెట్ చేయటం,ఇంటెన్షన్ గా హర్ట్ చేయటం పద్దతి కాదని ఇండస్ట్రీ అంటోంది.