బాలీవుడ్ హాట్ భామ.. ఇక తెలుగులో అందాల విందు..
ఇన్నాళ్ళూ తన అందాలతో బాలీవుడ్ని ఓ ఊపుఊపుతున్న హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా తాజాగా టాలీవుడ్ని ఊపేందుకు సిద్ధమవుతుంది. బాలీవుడ్లో వడ్డిన అందాల విందుకి రెట్టింపు టాలీవుడ్ ఆడియెన్స్ కి వడ్డించేందుకు రెడీ అవుతుంది. తాజాగా ఈ సెక్సీ భామ ఓ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రముఖ దర్శకుడు సంపత్ నంది అందించిన కథతో `బ్లాక్ రోజ్` అనే సినిమా రూపొందబోతుంది. షేక్ స్పియర్ రచించిన `ది మర్చంట్ ఆఫ్ వెనీస్`లోని షైలాక్ పాత్ర ఆధారంగా లేడీ ఓరియెంటెడ్గా ఈ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి తెలుగు, హిందీలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ఇటీవల ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సంపత్నందితోపాటు ఊర్వశీ రౌతేలా కూడా పాల్గొనడం విశేషం. ఈ సినిమా గురించి ఈ చిత్ర కథా రచయిత సంపత్ నంది చెబుతూ, మహిళా ప్రధానంగా సాగే ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రమిదని, విచక్షణరహిత, యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతమనే కౌటిల్యుడి అర్థశాస్త్రంలోని కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు.
ఈ సినిమాతో బాలీవుడ్ నటి ఊర్వశీని తెలుగులోకి తీసుకురావడం ఆనందంగా ఉందని, ఆమె అంద చందాలు, కథ, దర్శకుడి టేకింగ్ ఆకట్టుకుంటాయని నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి తెలిపారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు.
2015లో మిస్ దివా యూనివర్స్ లో టైటిల్ విన్నర్గా నిలిచిన ఈ హాట్ భామ 2013లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి `సింగ్ సాబ్ ది గ్రేట్` చిత్రంలో నటించింది. ఆ తర్వాత `సనమ్ రే`, `గ్రేట్ గ్రాండ్ మస్తీ`, `హేట్ స్టోరీ4`, `పాగల్పంతి`, `వర్జిన్ భానుప్రియ`చిత్రాలతో మెస్మరైజ్ చేసింది. దీంతోపాటు `బాగ్ జానీ`, `కాబిల్` చిత్రాల్లో స్పెషల్ సాంగ్లో మంత్రముగ్ధుల్ని చేసింది.
వీటితోపాటు పలు వెబ్ సిరీస్, మ్యూజికల్ ఆల్బమ్స్ లోనూ నటిస్తూ ఘాటైన అందాలతో మెస్మరైజ్ చేస్తున్న విషయం తెలిసిందే.