- Home
- Entertainment
- 5000 కోట్ల మార్కెట్, 5 భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు, 2025లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే
5000 కోట్ల మార్కెట్, 5 భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు, 2025లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే
2025 భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల కోసం ఎదురు చూస్తోంది. ఈ ఏడాది ప్రభాస్, ఎన్టీఆర్, యష్, విజయ్ దేవరకొండ, రిషబ్ శెట్టి లాంటి పాన్ ఇండియా స్టార్స్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఎప్పుడు రాబోతోంది తెలుసా?

2025 సినిమాలు పరంగా చరిత్ర సృష్టించబోతోంది. ఈ ఏడాది చాలా పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి. 2025లో 5 భారీ పాన్ ఇండియా మూవీస్ సందడి చేయబోతున్నాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాల బిజినెస్ అంతా 5000 కోట్ల వరకూ అవుతుందని అంచనా.
Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ముహూర్తం ఫిక్స్, ఈసారి రెండు నెలలు ముందే సందడి
Prabhas
1.The Raja Saab (రాజా సాబ్)
రిలీజ్ డేట్ : 10 ఏప్రిల్ 2025
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న తెలుగు సినిమా ఇది. పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న భారీ బడ్జెట్ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇది పొలిటికల్ డ్రామా. ఇందులో రాజకీయం, అధికారం, మోసం వంటి అంశాలు ఉంటాయి.
Also Read: చిరంజీవి కొరియోగ్రఫీ చేసిన ఏకైక సాంగ్ ఏ సినిమాలో తెలుసా?
Yash
2.Toxic (టాక్సిక్)
రిలీజ్ డేట్ : 10 ఏప్రిల్ 2025
ఇది కన్నడ సినిమా పాన్ ఇండియా మూవీ. ఇందులో కేజీఎఫ్ ఫేమ్ యష్ హీరోగా నటిస్తున్నాడు. గీతూ మోహన్ దాస్ డైరెక్టర్. సస్పెన్స్, థ్రిల్ నిండిన ఈ సైకలాజికల్ డ్రామాలో చాలా ట్విస్టులు ఉంటాయి. ఇది ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుంది.
Also Read: విజయ్ దళపతి, సూర్య ఇద్దరు రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏదో తెలుసా?
Vijay Devarakonda
3. Kingdom (కింగ్ డమ్)
రిలీజ్ డేట్ : 30 మే 2025
గౌతమ్ తిన్ననూరి ఈ తెలుగు పాన్ ఇండియా సినిమాకు డైరెక్టర్. ఇందులో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇది ఒక కల్పిత సామ్రాజ్యం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా రెండు పార్టులుగా విడుదల కానుంది. ఇందులో భారీ సెట్స్, యాక్షన్ సీన్స్ ఉంటాయి.
Also Read: 700 సినిమాల్లో నటించిన హీరోయిన్, 40 ఏళ్లలో రెండు పెళ్లిళ్లు, తాగుడికి బానిసైన స్టార్ నటి ఎవరు?
Rishab Shetty
4. Kantara Chapter 1 (కాంతార చాప్టర్ 1)
రిలీజ్ డేట్ : 2 అక్టోబర్ 2025
2022లో రిషబ్ శెట్టి హీరోగా, దర్శకత్వం వహించిన కన్నడ సినిమా 'కాంతార' పాన్ ఇండియా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ 'కాంతార చాప్టర్ 1' పేరుతో వస్తోంది. మరోసారి ఈ సినిమాలో పౌరాణిక, జానపద కథల మిశ్రమం చూడొచ్చు. 'కాంతార' అభిమానులు దీని ప్రీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు.
5. Dil Madrasi
రిలీజ్ డేట్ : 2025 (రిలీజ్ డేట్ ఇవ్వలేదు )
ఇది తమిళ సినిమా. దీన్ని పాన్ ఇండియాగా రిలీజ్ చేయనున్నారు. ఎ.ఆర్. మురుగదాస్ ఈ సినిమాకు డైరెక్టర్. ఇందులో శివకార్తికేయన్, బిజు మీనన్, విద్యుత్ జమ్వాల్, రుక్మిణి వసంత్ నటిస్తున్నారు.