- Home
- Entertainment
- ఆ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అందుకే భర్తకు విడాకులు?
ఆ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అందుకే భర్తకు విడాకులు?
నటి మౌనీ రాయ్ తన భర్త సూరజ్ నంబియార్ విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేసింది. అప్పట్నించి మౌనీ రాయ్ తన స్నేహితురాలు దిశా పటానీని పెళ్లి చేసుకోబోతోందంటూ ఓ వైరల్ అయింది. వారిద్దరూ పూల దండలతో ఉన్న ఫోటో వైరల్ అయింది.

హీరోయిన్ మౌనీ రాయ్ విడాకులు
బాలీవుడ్ నటి, సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్ తన భర్తతో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించింది. ఇదే సమయంలో మౌనీ రాయ్.. దిశా పటానీతో తన బంధాన్ని కొనసాగించేందుకే భర్తతో విడాకులు తీసుకుందని వార్తలు వస్తున్నాయి. దిశా పటానీ, మౌని రాయ్ లెస్పియన్లని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. నిజంగానే మౌని రాయ్, దిశా రిలేషన్ షిపలో ఉన్నారా?

దిశాపటానీతో అనుబంధం
మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ ఇద్దరికీీ పెళ్లయి నాలుగేళ్లవుతోంది. కానీ ఇంతవరకు పిల్లలు లేరు. వీరిద్దరూ తాము విడిపోతున్నట్లు కన్ఫర్మ్ చేస్తూ ఓ జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు. తమ వ్యక్తిగత జీవితంపై అనవసర కామెంట్స్ వస్తున్నాయని, తాము విడిపోవాలని నిర్ణయించుకున్నది నిజమేనని వారు చెప్పారు ఈ పరిస్థితిని ప్రైవేట్గా, ప్రశాంతంగా డీల్ చేయడానికి మాకు కొంత టైమ్ కావాలని ప్రకటించారు. అయితే దిశాతో మౌని రాయ్ స్నేహం మాత్రం ఎప్పట్నించో కొనసాగుతోంది. దిశా పటానీ కూడా గతంలో టైగర్ ష్రాప్ తో ప్రేమలో ఉండి తరువాత బ్రేకప్ చెప్పింది.
ఈ ఫోటో వెనుక అసలు కథ
మౌని రాయ్ విడాకులకు దిశా పటానీ కారణమని కామెంట్లు మొదలైపోయాయి. నటి దిశా పటానీతో మౌని సన్నిహితంగా ఉన్న ఫోటోలు మరింత క్యూరియాసిటీని పెంచాయి. కానీ దిశాతో మౌని అనుబంధంలో ఉండడం పూర్తిగా ఫేక్ న్యూస్ అని తెలుస్తోంది. వీరిద్దరూ మెడలో పూల దండలతో ఉన్న ఫోటో బాగా వైరల్ అవుతోంది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని ఎంతో భావిస్తున్నారు.
ఈ నటీమణుల ఫోటో నిజమైనదే కానీ, వీరికి పెళ్లయిన విషయంలో మాత్రం ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్లో తేలింది. నిజానికి ఈ వైరల్ ఫోటోను గత ఏడాది, అంటే జూన్ 2025లో దిశా పటానీ పుట్టినరోజున ఇద్దరు నటీమణులు ఇస్కాన్ టెంపుల్కు వెళ్లినప్పుడు తీసుకున్నారు. అది ఇప్పుడు వైరల్ అవ్వడం వల్ల వారిద్దరూ పెళ్లి చేసుకున్నారనే వాదన వినిపిస్తోంది.
విడాకులకు కారణం...
మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ విడిపోతున్నారనే రూమర్లు చాలా రోజులుగా ఉన్నాయి. చాలా మంది యూజర్లు నిజం తెలుసుకోకుండానే దిశా పటానీని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నిజానికి మౌని రాయ్, దిశా పటానీ మంచి స్నేహితులు మాత్రమే. అంతకుమించి వీరిద్దరి మధ్య ఏం లేదని సమాచారం.

