10 మంది డూప్లికేట్ రాజమౌళిలు తయారయ్యారు, చిరంజీవి, నాగార్జున, రజనీ అప్పట్లోనే..
ప్రస్తుతం ఎలాంటి చిత్రం వచ్చినా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. దీనిపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఓ ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Nagarjuna
ప్రస్తుతం ఎలాంటి చిత్రం వచ్చినా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. దీనిపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఓ ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి, చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్ పై అనురాగ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.

విద్యార్థులంతా సినిమాలు చూడాలి, పుస్తకాలు చదవాలి. తమకి తాము సొంతం వ్యక్తిత్వం ఏర్పరుచుకునేందుకు అవి ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరికీ సొంత వ్యక్తిత్వం ఉండాలి. ఉదాహరణకి ఇండియన్ సినిమాకి ఒక రాజమౌళి ఉన్నాడు. ఆయన్ని చూసిదాదాపు 10 మంది డూప్లికేట్ రాజమౌళిలు తయారయ్యారు. వాళ్లంతా రాజమౌళికి చీప్ వెర్షన్స్. వాళ్లంతా అసలైన రాజమౌళిలు కాలేరు ఎందుకంటే ఒరిజినల్ రాజమౌళి ఒక్కడే. వీళ్లంతా రాజమౌళి ఐడియాలు కాపీ చేయాలని ప్రయత్నిస్తుంటారు. కానీ రాజమౌళి ఆలోచన మాత్రమే ఒరిజినల్ అని అనురాగ్ తెలిపారు.
అదే విధంగా కెజిఎఫ్ చిత్రం చూడండి. కర్ణాటక నుంచి వచ్చిన తొలి పాన్ ఇండియా చిత్రం. కేజీఎఫ్ ని కాపీ కొడుతూ కర్ణాటక నుంచి చాలా చిత్రాలు వచ్చాయి అని అనురాగ్ తెలిపారు. ఈ సందర్భంగా అనురాగ్ కశ్యప్ బాహుబలి రెండు భాగాలు, ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రాల సక్సెస్ ని అభినందించారు. సౌత్ సినిమాకి పాన్ ఇండియా చిత్రాలు కొత్త కాదు అని అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు.పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు పుట్టుకొచ్చినవి కాదు.
Also Read : రాంచరణ్ కి ఉన్న అడిక్షన్ ఏంటి, అది ఇండస్ట్రీ హిట్ కి కారణం అయింది తెలుసా ?
Rajamouli
నా దృష్టిలో పాన్ ఇండియా సినిమా అంటే చిరంజీవి నటించిన ప్రతిబంద్ అని అన్నారు. అదే విధంగా నాగార్జున నటించిన శివ, రజనీకాంత్ నటించిన ఫాలాడి ముక్కా చిత్రాలు తొలినాళ్లలో వచ్చిన పాన్ ఇండియా చిత్రాలు అని అనురాగ్ కశ్యప్ ఉదాహరణగా తెలిపారు.
Rajamouli
అనురాగ్ కశ్యప్ బాలీవుడ్ లో దర్శకుడిగా రాణిస్తున్నారు. సౌత్ లో నటుడిగా కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. ఇటీవల విజయ్ సేతుపతి మహారాజ చిత్రంలో అనురాగ్ విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు.