గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో `ప్రేమమ్` బ్యూటీ అనుపమా పరమేశ్వరన్
`ప్రేమమ్` బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొంది. అందులో భాగంగా మొక్కలు నాటింది. బాచుపల్లిలో మొక్కలు నాటి ఆయా ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది అనుపమ.
మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన అనుపమా పరమేశ్వరన్ `అ..ఆ` చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అందులో నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో మెరిసింది.
ఆ తర్వాత `శతమానం భవతి`, `ప్రేమమ్`, `ఉన్నది ఒక్కటే జిందగీ`, `రాక్షసుడు` చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ ల్లో భాగమైన ఈ బ్యూటీ తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొంది. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు బాచుపల్లి లో మొక్కలు నాటింది.
ఆమె మాట్లాడుతూ, జోగినపల్లి సంతోష్ కుమార్ నుంచి ప్రేరణ తీసుకొని హీరో నిఖిల్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటనని అనుపమ పరమేశ్వరన్ తెలిపింది.
అడవులు, పర్యావరణాన్ని కాపాడటానికి ఎంపి సంతోష్ చేసిన అద్భుతమైన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని తెలిపారు.
అనంతరం మరో ముగ్గురుకి సోషల్ వేదిక ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసురుతానని చేస్తానని తెలిపింది. ఈ కార్యక్రమంలో మమత హాస్పిటల్ ఎం.డి డా. పువ్వాడ నయన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.