- Home
- Entertainment
- ఉదయభాను మొదటి పెళ్లి గురించి లీక్ చేస్తానని ఆమె తల్లే ఎందుకు బెదిరించింది? నరకం అనుభవించిన స్టార్ యాంకర్
ఉదయభాను మొదటి పెళ్లి గురించి లీక్ చేస్తానని ఆమె తల్లే ఎందుకు బెదిరించింది? నరకం అనుభవించిన స్టార్ యాంకర్
టాలీవుడ్ లో ఒకప్పుడు యాంకరింగ్ అంటే అందరికీ ఉదయభానునే గుర్తుకు వచ్చేవారు. చాలాకాలం ఉదయభాను తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ యాంకర్ గా కొనసాగారు.

టాలీవుడ్ లో ఒకప్పుడు యాంకరింగ్ అంటే అందరికీ ఉదయభానునే గుర్తుకు వచ్చేవారు. చాలాకాలం ఉదయభాను తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ యాంకర్ గా కొనసాగారు. ఆమె యాంకర్ అయినప్పటికీ హీరోయిన్లని మించే అందంతో చాలామంది అభిమానులని ఉదయభాను సొంతం చేసుకుంది. అయితే కొన్ని విభేదాలు, ఇతర కారణాల వల్ల ఆమె కెరీర్ లో బ్రేక్ తీసుకుంది. అప్పటి నుంచి ఆమెకి అవకాశాలు నెమ్మదిగా తగ్గుతూ వచ్చాయి.
తల్లి అయ్యాక యాంకరింగ్ కి ఉదయభాను మరింతగా దూరమైంది. ఉదయభాను నటిగా కూడా రాణించారు. ఎర్రసైన్యం చిత్రం చిత్రంతో ఉదయభాను నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించింది. జులాయి, లీడర్ లాంటి చిత్రాల్లో ఉదయభాను స్పెషల్ సాంగ్స్ చేసింది.
ఉదయభాను వ్యక్తిగత జీవితం లో చాలా కష్టాలు ఎదుర్కొంది. ఆమె తండ్రి ఎస్కే పటేల్ ఉదయభాను చిన్నతనంలోనే మరణించారు. 15 ఏళ్ల వయసులోనే ఉదయభాను తల్లి అరుణ ఆమెకి బలవంతంగా ఒక ముస్లిం వ్యక్తితో వివాహం చేసింది. చిన్నతనంలోనే వివాహం కావడంతో ఉదయభాను నరకం అనుభవించింది. కొంతకాలానికి ఉదయభాను తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది.
ఆ తర్వాత ఆమె విజయ్ కుమార్ అనే వ్యక్తితో ప్రేమలో పడడం అతన్ని వివాహం చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరి వివాహం సమయంలో పెద్ద హైడ్రామానే సాగింది. విజయ్ తో వివాహం వద్దని ఉదయభాను తల్లి అడ్డు చెప్పిందట. అంతేకాదు అనేక వేధింపులకు గురిచేసిందని ఉదయభాను స్వయంగా అప్పట్లో మీడియాకు తెలిపింది. విజయ్ ని పెళ్లి చేసుకుంటే మొదటి వివాహం గురించి బయట చెప్పేస్తానని తన తల్లి బెదిరింపులకు గురిచేసినట్లు ఉదయభాను ఆరోపించారు.
ప్రస్తుతం ఉదయభాను, విజయ్ అన్యోన్యంగా జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కవల ఆడపిల్లలు సంతానం. ఉదయభాను తరచుగా సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఓ ఇంటర్వ్యూలో ఇటీవల మీరు చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా లేరు ఎందుకని ? అంటూ యాంకర్ ప్రశ్నించగా.. ఉదయభాను షాకింగ్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్ లో పెద్ద మాఫియా ఉంది. ఆ సిండికేట్ ని బ్రేక్ చేయడం అంత సాధ్యం కాదు. అందుకే నా వరకు వచ్చిన అవకాశాలను మాత్రమే వినియోగించుకుంటున్నా అని తెలిపారు.