పెద్దతెరపై మరోసారి రచ్చ చేసేందుకు వస్తోన్న యాంకర్ రష్మి.. ఆ కోరిక ఇప్పుడైనా తీరేనా?
`జబర్దస్త్` యాంకర్ రష్మి గౌతమ్ బుల్లితెరపై రచ్చ చేస్తుంది. వరుసగా మూడు షోలకు యాంకర్గా చేస్తూ హంగామా చేస్తుంది. చాలా రోజుల తర్వాత పెద్ద తెరపై రచ్చ చేసేందుకు రాబోతుంది.
Rashmi Gautam
యాంకర్ రష్మి కెరీర్ నిజానికి నటిగానే ప్రారంభమయ్యింది. మొదట ఆమె సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చింది. పెద్దగా గుర్తింపు రాలేదు. రష్మి ఒకరు నటించారనే విషయం ఆమె `జబర్దస్త్`లో పాపులర్ అయ్యేంత వరకు గానీ తెలియదు. దీంతో బుల్లితెరపై ఫోకస్ పెట్టింది. అందులో మొదట సీరియల్స్ లో నటించింది. ఈ క్రమంలో అటు సినిమాలు, ఇటు సీరియల్స్ చేస్తూ వచ్చింది.
Rashmi Gautam
ఈ క్రమంలో 2013లో `జబర్దస్త్`కి యాంకర్గా చేసే అవకాశం దక్కించుకుంది. యాంకర్గా ప్రారంభం నుంచే ఆకట్టుకుంది. ఆమె వచ్చీ రాని తెలుగులో ముద్దు ముద్దుగా మాట్లాడం ఆడియెన్స్ కి బాగా నచ్చింది. పైగా కమెడీయన్లు ఆమెపై పంచ్లు వేయడంతో అవి బాగా పేలేవి. దీనికి తోడు తన గ్లామర్ షో బాగా కలిసొచ్చింది. క్రేజీ యాంకర్గా మార్చింది.
యాంకర్గా చేస్తూనే నటిగా బిగ్ స్క్రీన్పై రాణించాలనేది ఆమె కోరిక. ఆ దిశగా అడుగులు వేసింది. షోస్ చేస్తూనే సినిమాల్లో నటిస్తూ వచ్చింది. 2002లో `హోలి` చిత్రంతో నటిగా తన కెరీర్ ని ప్రారంభించిన ఈ భామ `కరెంట్`, `ఎవరైనా ఎప్పుడైనా`, `గణేష్ః జస్ట్ గణేష్`, `బిందాస్`, `ప్రస్థానం` చిత్రాలు చేసింది. దీంతోపాటు తమిళం, హిందీలోనూ యాక్ట్ చేయడం విశేషం.
ఈ క్రమంలో `గుంటూరు టాకీస్`తో విజయాన్ని అందుకుంది. ఇందులో బోల్డ్ రోల్ లో మెప్పించింది రష్మి. దీంతో ఈ యాంకర్కి సినిమాల్లో లైఫ్ వచ్చినట్టే అనుకున్నారు. కానీ ఆతర్వాత సరైన ఆఫర్లు రాలేదు. సరైన ఆఫర్లని ఎంచుకోలేకపోయింది. అన్నీ చిన్న చిత్రాలే చేసింది.అవి ఎప్పుడొచ్చాయో కూడా తెలియకుండా అలా వచ్చి ఇలా పోయాయి. దీంతో పెద్ద తెరపై మంచి పేరు దక్కించుకోవాలనే కోరిక అలానే ఉండిపోయింది.
ఇన్నాళ్లకు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది రష్మి. ఆమె హీరోయిన్గా నటించిన చిత్రం విడుదలకు సిద్ధమైంది. నందుతో కలిసి `బొమ్మ బ్లాక్ బస్టర్` చిత్రంలో నటించింది. ఆర్థిక కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడింది. ఇన్నాళ్లకి మళ్లీ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చింది యూనిట్. దీంతో రష్మికి ఉత్సాహం వచ్చింది. ఈ సినిమాని నవంబర్ 4న విడుదల చేయబోతున్నారు. దీంతో ప్రమోషన్ జోరు పెంచారు.
ఇటీవల ఓ ఫ్రాంక్ వీడియో చేశారు. ఇందులో నందు.. రష్మిపై ఫైర్ అయ్యారు. ఆమె ఫోన్లు ఎత్తడం లేదని, ప్రమోషన్లకి రావడం లేదని నిలదీశాడు. రష్మి షూటింగ్ చేస్తున్న లొకేషన్కి వెళ్లి హంగామా చేశారు. ఆమెని అందరి ముందు నిలదీయగా నేను రాను, తనకు ఆ ప్రెజర్ తీసుకోవడం ఇష్టం లేదని చెప్పింది. కాసేపు వీరంతా హడావుడి చేశారు. అయితే ఇదంతా ప్రమోషన్ స్టంట్ అని తెలుస్తుంది. ఈ సినిమాకి రాజ్ విరాఠ్ దర్శకత్వం వహించారు. మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారట. ఇందులో నందు, రష్మి డీ గ్లామర్ రోల్లో కనిపించనున్నారని టాక్.
ప్రస్తుతం రష్మి గౌతమ్ యాంకర్గా బిజీగాఉంది. `జబర్దస్త్`తోపాటు `ఎక్స్ ట్రా జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలకు హోస్ట్ గా చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటి వరకు ఒక్కటే షో చేసిన రష్మి, అనసూయ, సుధీర్ వెళ్లిపోవడంతో వారి షోస్ కూడా తనే చేస్తూ బుల్లితెరపై రచ్చలేపుతుంది. మరి పెద్ద తెరపై ఏ రేంజ్లో రచ్చ చేస్తుందో చూడాలి.