రాజ్ తో సమంత ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.. శతమానం భవతి అని దీవించిన నటి
నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. చేతులతో విడిపోగానే సమంతకి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. మునుపటిలా వేగంగా సినిమాల్లో నటించలేకపోయింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Samantha
నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. చేతులతో విడిపోగానే సమంతకి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. మునుపటిలా వేగంగా సినిమాల్లో నటించలేకపోయింది. మయోసైటిస్ నుంచి కోరుకున్న సమంత ఇప్పుడు తిరిగి యాక్టివ్ అయింది. కాకపోతే గతంలో లాగా సమంత ప్రస్తుతం సినిమాలకు సైన్ చేయడం లేదు. ఖుషి చిత్రమే ఆమె తెలుగులో నటించడం చివరి చిత్రం.
samantha
అయితే ఇటీవల సమంత శుభం చిత్రంతో నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. అదేవిధంగా వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అడుగు వేసింది. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్ ఇప్పుడు బహిరంగ రహస్యం. ఆమె ఓపెన్ గానే రాజ్ నిడిమోరు తో సన్నిహితంగా ఉంటున్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
Subham Movie
కొంతకాలంగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉంటున్నారు. అయితే అధికారికంగా సమంత నోటి నుంచి ఆ మాట ఇంకా రాలేదు. శుభం చిత్రం విజయం సాధించడంతో సమంత సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో సమంత వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నటి మధుమణి వేదికపై మాట్లాడుతూ సమంత రాజ్ రిలేషన్ గురించి కామెంట్స్ చేశారు. దీనికి సమంత రియాక్ట్ అయిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Subham Movie
నటి మధుమణి మాట్లాడుతూ.. తన కెరీర్ లో తాను చాలామంది హీరోలకు హీరోయిన్లకు తల్లిగా నటించాను అని పేర్కొన్నారు. దాదాపు 400 చిత్రాల్లో నటించా. కానీ సమంతతో నటించడం ఇదే తొలిసారి. రంగస్థలం చిత్రంలో సమంతకు తల్లిగా నటించే అవకాశం కొద్దిలో చేజారింది. శుభం చిత్రంలో నాకు అవకాశం రాగానే చాలా సంతోషంగా అనిపించింది. కానీ షూటింగ్ మొదలు పెట్టగానే చికెన్ గున్యాకు గురయ్యా. ఆ టైంలో ఈ చిత్రంలో నటించగలుగుతానా లేదా అనే సందేహం కలిగింది.
Samantha
కానీ నాలుగు నెలల తర్వాత కోలుకొని తిరిగి ఈ చిత్రంలో నటించా. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన సమంతకి శుభం. రాజ్ తో సమంత కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. మీరిద్దరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి.. శతమానం భవతి అని మధుమణి దీవించారు. మధుమణి కామెంట్స్ కి సమంత చప్పట్లతో రియాక్షన్ ఇచ్చింది.