- Home
- Entertainment
- నేను బ్లడ్ అమ్ముకున్నానని కొందరు విమర్శించడానికి కారణం ఇదే, వాళ్ళే స్వయంగా నాతో చెప్పారు.. చిరు కామెంట్స్
నేను బ్లడ్ అమ్ముకున్నానని కొందరు విమర్శించడానికి కారణం ఇదే, వాళ్ళే స్వయంగా నాతో చెప్పారు.. చిరు కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి గతంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి కొన్నేళ్లపాటు రాజకీయాల్లో కొనసాగారు. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి గతంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి కొన్నేళ్లపాటు రాజకీయాల్లో కొనసాగారు. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే చిరంజీవి రాజకీయాల్లో పూర్తి స్థాయిలో విజయం సాధించలేదు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు.
megastar chiranjeevi
రాజకీయాల్లో ఉన్నప్పుడు చిరంజీవి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. దీని గురించి చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థులు ఇష్టం వచ్చినట్లు తిట్టారు. నేను విమర్శలని తీసుకోగలను. కానీ కొందరు హద్దులు దాటి విమర్శించారు. అయినా పర్వాలేదు. అయితే వాళ్లలాగే తీవ్ర స్థాయిలో వ్యక్తిగత దూషణలకు దిగడం నా స్వభావం కాదు.
కొంతకాలానికి రాజకీయాలు నాకు సరిపడవనిపించింది. అందుకే పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొందరు వ్యక్తులు నేను బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ అమ్ముకున్నట్లు తీవ్రమైన విమర్శలు చేశారు. మరి ఈ స్థాయిలో విమర్శించాలా అని అనిపించింది.
నన్ను అంతలా విమర్శించిన వాళ్లే తర్వాత వచ్చి నాకు క్షమాపణలు చెప్పారు. తాను బ్లడ్ అమ్ముకున్నట్లు అబద్ధాలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందో నాకు వివరించారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తుంటామని వాళ్లు నాతో చెప్పారు అని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సినిమాల విషయానికొస్తే చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలోని చిత్రం కూడా ప్రారంభమైంది. ఈ చిత్రానికి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదల ఒక నిర్మాతగా వ్యవహరించనున్నారు.