వందల కోట్లు సంపాదించిన పద్మనాభం.. చివరి రోజుల్లో రోడ్డున పడటానికి కారణమేంటో తెలుసా?
Padmanabham: సీనియర్ నటుడు, కమెడియన్ పద్మనాభం తనదైన కామెడీతో ఆరు దశాబ్దాలపాటు ఆడియెన్స్ ని అలరించారు. ఆయన నటుడిగానే కాదు, నిర్మాతగా, దర్శకుడిగానూ నిరూపించుకున్నారు. కానీ హాస్యనటుడిగానే గుర్తింపు తెచ్చుకున్నారు. వందల సినిమాలు చేసి మెప్పించిన ఆయన తన ఆరు దశాబ్దాల కెరీర్లో వందల కోట్ల విలువ చేసే ఆస్తులు సంపాదించాడు. కానీ చివరి రోజులు వచ్చేసరికి అన్నీ పోగొట్టుకుని ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తింది. మరి ఎందుకు అలా జరిగింది? ఆయన చేసిన మిస్టేక్ ఏంటనేది చూస్తే.

padmanabham
Padmanabham: పద్మనాభం.. నాటకాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో కూడా విభిన్నమైన పాత్రలు పోషించినప్పటికీ కామెడీ పాత్రలతో పాపులర్ అయ్యారు. ముఖ్యంగా నారద పాత్రలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. సినిమాల్లోకి వచ్చాక కూడా అనేక పౌరాణిక చిత్రాల్లో నారద పాత్రలు పోషించారు.
ఇంకా చెప్పాలంటే ఆయన నారద పాత్రలకు బెస్ట్ ఆప్షన్గా నిలిచారు. బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన అటు సినిమాలు, ఇటు నాటకాలు వేస్తూ రాణించారు. తన ఆరు దశాబ్దాల కెరీర్లో నాలుగు వందలకుపైగా చిత్రాలు చేశారు.

padmanabham
మొన్నటి వరకు బ్రహ్మానందం లేకుండా సినిమాలు లేనట్టుగానే, అప్పట్లో పద్మనాభం లేకుండా సినిమాలుండేవి కావు. అంతగా అలరించిన ఆయన ఆర్థికంగానూ బాగానే సంపాదించాడు. నటుడిగా ఏడాదికి పదుల సంఖ్యల్లో సినిమాలు చేసేవారు.
ఆడియెన్స్ ని అలరించేవారు. దీంతో ఆయన ఆస్తులు కూడా బాగానే సంపాదించాడట. ఇప్పటి విలువతో పోల్చితే అప్పట్లో ఆయన వందల కోట్లు సంపాదించాడట. కానీ చివరి రోజుల్లో మాత్రం అన్నీ కోల్పోయాడు.
padmanabham
అందుకు కారణం.. పద్మనాభం నటుడే కాదు, దర్శకుడు, నిర్మాత కూడా. రేఖ అండ్ మురళీ కంబైన్స్ పతాకంపై ఐదారు సినిమాలను నిర్మించారు. నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎక్కువా ఆయన డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు.
తనకు ఇదే బాగా నష్టాలను తీసుకొచ్చిందట. చివరి రోజుల్లో ఆయన ఆస్తులన్నీ పోయి రోడ్డున పడ్డ పరిస్థితికి రావడానికి ఇదే కారణమట. ఇక్కడే వందల కోట్లు సంపాదించారు. అన్నీ ఇక్కడే పోగొ్ట్టుకున్నారు. తాను సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కానీ డిస్ట్రిబ్యూషన్ చూసుకోవడం కుదరలేదు, ఎవరినో నమ్మి చేస్తే వాళ్లు మోసం చేశారు.
పద్మనాభం నటుడిగా బిజీగా ఉన్నారు. ఇవన్నీ చూసుకోలేకపోయారు. నమ్మిన వాళ్లు మోసం చేశారు. దీంతో అన్నీ కోల్పోయారని రోడ్డున పడ్డపరిస్థితి వచ్చిందని తెలిపారు నటుడు తిరుపతి ప్రకాష్. ఆయన ఒకప్పుడు కమెడియన్గా మెప్పించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు కనిపించడం లేదు. అయితే తిరుపతి ప్రకాష్కు పద్మనాభం పెద్దనాన్న అవుతారు. వారికి మంచి రిలేషన్ ఉంది. దానితోనే పద్మనాభం జీవితంలో చివరి రోజుల్లో జరిగిన విషయం తెలిపారు ప్రకాష్.
read moreప్రభుదేవా రియాలిటీ బయటపెట్టిన మొదటి భార్య.. కొడుకు విషయంలో ఊహించని వ్యాఖ్యలు
also readసుమన్ షూటింగ్లకు వచ్చేవాడు కాదు, డబ్బుల కోసమే ఒప్పుకున్నాడు.. బ్లూ ఫిల్మ్ కేసు తర్వాత అలా చేశాడా?