- Home
- Entertainment
- Allu Arjun: హేట్ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్ సందేశం
Allu Arjun: హేట్ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్ సందేశం
అల్లు అర్జున్ చాలా రోజుల తర్వాత అభిమానుల ముందుకు వచ్చారు. వారిని ప్రత్యేకంగా మీట్ అయ్యాడు. ఈ సందర్భంగా ట్రోల్స్, హేట్స్ కి సంబంధించి అభిమానులను ఉద్దేశించి హాట్ కామెంట్ చేశాడు.

అభిమానులను కలిసిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాడు. మంగళవారం ఆయన అభిమానులతో ప్రత్యేక మీట్ ఏర్పాటు చేశాడు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ అభిమానుల అసోసియేషన్స్ ఏర్పాటు చేశారు. ఈ అసోసియేషన్స్ కమిటీలు ఏర్పడిన నేపథ్యంలో ఆయన తాజాగా అభిమానులను కలిశాడు. వారితో కలిసి ఫోటోలు దిగాడు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ పై ఆయన రియాక్ట్ అయ్యాడు. తనని అభిమానించేవారు, హేట్ చేసేవారు, ట్రోలర్స్ అందరికి కలిపి ఆయన ఒక విషయాన్ని చెప్పాడు.
అభిమానులు, హేటర్స్, ట్రోలర్స్ కి బన్నీ సందేశం
అభిమానులను కలవడం తనకు సంతోషంగా ఉందని, వారికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపాడు. వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించాడు. వారికి థ్యాంక్స్ తప్ప ఈ రోజు ఏం చెప్పలేను అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులను, హేటర్స్ ని, ట్రోలర్స్ ని ఉద్దేశించి ఆసక్తికర కామెంట్ చేశాడు. ఇతరులను విమర్శించడం ఎప్పుడూ సరైనది కాదని, మనకు నచ్చని వాళ్ల కోసం మన డబ్బుని ఖర్చు పెడతామా? లేదు కదా, అలాగే, మనకు నచ్చని వాళ్ల కోసం మన సమయం, డబ్బు, ఎనర్జీ వేస్ట్ చేయకూడదు అని బన్నీ చెప్పాడు.
అమ్మాయి ఇంటి ముందైనా కూర్చొని ఎంజాయ్ చేయండి
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పై స్పందించడం కంటే, ఆ సమయాన్ని మీ సొంత ఎదుగుదల కోసం ఉపయోగించుకోవాలని, మీకు నచ్చిన పని చేయాలని, నీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు కూర్చోండి, పర్లేదు, కనీసం నువ్వు అయినా ఆ టైమ్ ని ఎంజాయ్ చేస్తావని తెలిపారు అల్లు అర్జున్. ఎవరినీ ఎప్పుడూ ట్రోల్ చేయోద్దని చెప్పాడు. టైమ్ గానీ, ఎనర్జీ గానీ, ఏదైనా అనుకోండి, ప్రతి మనిషి ఒక రోజులో వంద శాతం ఉందనుకుంటే, దాన్ని మీరు దేనికి వాడతారనేది ముఖ్యం. ఆ ఎనర్జీని సరైన దానికి ఉపయోగించుకోండి అని చెప్పాడు బన్నీ. ఆయన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ సినిమాలు
అల్లు అర్జున్ `పుష్ప` చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీసు షేక్ చేసిన విషయం తెలిసిందే. `పుష్ప 2` మూవీ ఏకంగా సుమారు రూ.1700కోట్ల వరకు వసూళ్లని రాబట్టింది. ఇప్పుడు బన్నీ `రాకా` మూవీలో నటిస్తున్నాడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో దీపికా పదుకొనె కీలక పాత్రలో నటిస్తుంది. ఆమెతోపాటు మరో నలుగురు హీరోయిన్లు కనిపిస్తారని సమాచారం. సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో కాన్సెప్ట్ తో సూపర్నేచురల్ థ్రిల్లర్గా ఈ మూవీ రూపొందుతుందని సమాచారం. దీన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ దీన్ని నిర్మిస్తోంది. దీంతోపాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నాడు బన్నీ.

