నాకు సంతోషం ఇవ్వలేదు, అందుకే విడిపోయాం.. పవిత్రతో జీవితం ఎలా ఉందో చెప్పిన నరేష్!
నరేష్-పవిత్ర లోకేష్ తమ రిలేషన్ తో వార్తలకు ఎక్కారు. వీరి బంధాన్ని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి తిరస్కరించడంతో అనేక గొడవలు జరిగాయి. కాగా పవిత్రతో తన జీవితం ఎలా ఉందో నరేష్ చెప్పుకొచ్చాడు.
నటుడు నరేష్ నటి పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరు అధికారికంగా పెళ్లి చేసుకోలేదు. ఒకవేళ చేసుకున్నా దాన్ని బయట పెట్టడం లేదు. కారణం ఏమిటంటే... నరేష్ కి అధికారికంగా విడాకులు రాలేదు. అందుకే పెళ్లి విషయం దాస్తున్నారనే టాక్ ఉంది.
ఇక నరేష్-పవిత్ర లోకేష్ ల బంధాన్ని రమ్య రఘుపతి అంగీకరించడం లేదు. నరేష్ కి మూడో భార్య అయిన రమ్య రఘుపతి విడాకులు ఇవ్వలేదు. ఆమెకు కొడుకు ఉన్న నేపథ్యంలో నేను విడాకులు ఇవ్వనంటూ ఆమె అంటున్నారు. ఇద్దరి మధ్య కోర్ట్ వివాదాలు, ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి.
నరేష్-పవిత్ర ప్రస్తుతం కలిసే జీవిస్తున్నారు. పవిత్ర లోకేష్ కి కూడా గతంలో వివాహం జరిగింది. ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు. భర్తతో విడిపోయిన పవిత్ర లోకేష్ నరేష్ కి దగ్గరైంది. దాదాపు ఓ ఐదేళ్లుగా వీరు కలిసి జీవిస్తున్నారు.
pavitra lokesh and naresh
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న నరేష్ పవిత్ర లోకేష్ తో లైఫ్ ఎలా ఉందో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ... ఒకరు మంచి ఒకరు చెడ్డ అని చెప్పలేము. ప్రపంచంలో సగం మంది భార్య భర్తలు విడిపోతున్నారు. 70 నుండి 80 శాతం మంది పెళ్లి వలన సమస్యలు ఎదుర్కొని విడివిడిగా ఉంటున్నారు.
Naresh - Pavitra Lokesh
మనిషికి 40 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా తోడు అవసరం. ఈ వయసులో ఒంటరిగా బ్రతకడం కష్టం. మనకు తోడు ఉండే కరెక్ట్ పార్ట్నర్ కావాలి. నాకు జరిగిన మూడు పెళ్లిళ్ల కారణంగా సంతోషం కలగలేదు. అందుకే విడాకులు తీసుకున్నాను. అందుకే నేను ఓ డెసిషన్ తీసుకున్నాను. దాని కారణంగా చాలా కాంట్రవర్సీ చోటు చేసుకుంది.
పవిత్రతో నా జీవితం బాగుంది. మిగతా జీవితం ప్రశాంతంగా ముగించాలని అనుకుంటున్నాము, అని నరేష్ చెప్పుకొచ్చాడు. నరేష్ ఇటీవల మళ్ళీ పెళ్లి టైటిల్ తో ఒక మూవీ చేశాడు. అది వాళ్ళ నిజ జీవితాలకు దగ్గరగా ఉన్న చిత్రం కావడం విశేషం.