నేను నోరు విప్పలేదు, అందుకే వాళ్ళిద్దరి నుంచి విడిపోయా.. లవ్ ఫెయిల్యూర్ పై నయనతార
సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్ నయనతార. ఓవర్ నైట్ లో నయన్ కు ఈ స్టార్ డమ్ సొంతం కాలేదు. తన ప్రతిభతో ఒక్కో మెట్టూ ఎదుగుతూ వచ్చింది.
సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్ నయనతార. ఓవర్ నైట్ లో నయన్ కు ఈ స్టార్ డమ్ సొంతం కాలేదు. తన ప్రతిభతో ఒక్కో మెట్టూ ఎదుగుతూ వచ్చింది. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ మెరుపులు మెరిపించినా, చీర కట్టులో కనిపించినా, లేడి ఓరియెంటెర్ చిత్రాల్లో నటించినా అది నయనతారకు మాత్రమే సాధ్యం.
స్టార్ హీరోల సినిమాల తరహాలో నయనతార లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రాణించాయి. 35 ఏళ్ల వయసులో కూడా నయన్ వన్నె తరగని అందంతో మెరిసిపోతోంది. ఎన్ని విమర్శలు ఎదురైనా నయన్ తన దారిలో తాను పయనిస్తోంది.
వ్యక్తిగతంగా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ నయన్ వాటిని పట్టించుకోదు. పలు సందర్భాల్లో నయనతార తన ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలిచింది. ప్రభుదేవా, శింబుతో గతంలో నయనతార ప్రేమలో పడింది. కానీ ప్రేమలో నయన్ ఫెయిల్యూర్ చవిచూసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నయన్ శింబు, ప్రభుదేవా నుంచి విడిపోవడం గురించి స్పందించింది.
నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. నేను రెండు సార్లు ప్రేమలో ఫెయిల్ కావడానికి కారణం అదే. నమ్మకం లేకుండా కలసి ఉండడం కంటే విడిపోవడమే బెటర్. అందుకే వాళ్ళిద్దరితో విడిపోయాను. ఆ సమయంలో ఎంత వేదన అనుభవించానో నాకు మాత్రమే తెలుసు.
ఎన్ని విమర్శలు ఎదురైనా నేను నోరు మెదపలేదు. దీనితో చాలా మంది ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేశారు.. నా గురించి తప్పుగా రాశారు అని నయనతార చెప్పుకొచ్చింది.
ఆ డిప్రెషన్ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. సినిమాల వల్లే నేను తిరిగి మనిషిని కాగలిగాను అని నయన్ చెప్పుకొచ్చింది. వల్లభ సినిమా టైం లో శింబుతో, ఆ తర్వాత ప్రభుదేవాతో నయన్ ఘాటు ఎఫైర్ సాగించింది. నయన్ చివరగా తెలుగులో సైరా చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.