MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • India vs England: ధోనీ, కోహ్లీ ఓడినచోట గిల్ చరిత్ర సృష్టించాడు

India vs England: ధోనీ, కోహ్లీ ఓడినచోట గిల్ చరిత్ర సృష్టించాడు

Shubman Gill: శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు ఎడ్జ్‌బాస్టన్‌లో 336 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి టెస్ట్ చరిత్రలో తొలి విజయం సాధించింది. గిల్ బ్యాటింగ్, కెప్టెన్సీలో అదరగొట్టాడు.

2 Min read
Mahesh Rajamoni
Published : Jul 06 2025, 11:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఎడ్జ్‌బాస్టన్‌లో గిల్ నాయకత్వంలో భారత చారిత్రాత్మక విజయం
Image Credit : Getty

ఎడ్జ్‌బాస్టన్‌లో గిల్ నాయకత్వంలో భారత చారిత్రాత్మక విజయం

ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్‌పై 336 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయం ద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. తొలి టెస్ట్‌లో లీడ్స్‌లో ఇంగ్లాండ్ గెలిచి 1-0 ఆధిక్యంలోకి వెళ్లగా, ఈ విజయంతో భారత్ సమం చేసింది.

26
గిల్ బ్యాటింగ్, కెప్టెన్సీలో సరికొత్త చరిత్ర
Image Credit : Getty

గిల్ బ్యాటింగ్, కెప్టెన్సీలో సరికొత్త చరిత్ర

ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ రెండోసారి చరిత్రను రాసాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేయడం ద్వారా ఒకే టెస్ట్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసి సునీల్ గవాస్కర్ తర్వాత రెండవ భారత ఆటగాడిగా నిలిచాడు.

అంతేకాకుండా, గిల్ ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. లెజెండరీ ప్లేయర్లు సైతం ఇక్కడ భారత్ కు విజయాన్ని అందించలేకపోయారు. విరాట్ కోహ్లీ, ధోనిలు సైతం భారత్ ను ఈ గ్రౌండ్ లో గెలిపించలేకపోయారు.

Related Articles

Related image1
Akash Deep: పఠాన్ అంచనా నిజమైంది.. 10 వికెట్లు తీశాడు.. టీమిండియాలో మరో షమీ !
Related image2
Shubman Gill: ఇంగ్లాండ్ పై గెలుపు.. శుభ్‌మన్ గిల్ 12 ప్రపంచ రికార్డులు
36
ఎడ్జ్‌బాస్టన్‌లో గత భారత కెప్టెన్ల ఫలితాలు
Image Credit : Getty

ఎడ్జ్‌బాస్టన్‌లో గత భారత కెప్టెన్ల ఫలితాలు

ఈ మైదానంలో ఇప్పటివరకు చాలా మంది భారత కెప్టెన్లకు విజయం అందని ద్రాక్షగానే మిగిలింది. కేవలం 1986లో కపిల్ దేవ్ నేతృత్వంలో మ్యాచ్ డ్రా చేయగలిగారు. మిగిలిన అన్ని మ్యాచ్‌లలో భారత్ ఓటమి చవిచూసింది.

  • 1967 - మంసూర్ అలీ ఖాన్ పటౌడీ - 132 పరుగుల తేడాతో ఓటమి
  • 1974 - అజీత్ వాడేకర్ - ఇన్నింగ్స్ , 78 పరుగుల తేడాతో ఓటమి
  • 1979 - ఎస్. వెంకటరాఘవన్ - ఇన్నింగ్స్, 83 పరుగుల తేడాతో ఓటమి
  • 1986 - కపిల్ దేవ్ - డ్రా
  • 1996 - అజారుద్దీన్ - 8 వికెట్ల తేడాతో ఓటమి
  • 2011 - మహేంద్ర సింగ్ ధోనీ - ఇన్నింగ్స్, 242 పరుగుల తేడాతో ఓటమి
  • 2018 - విరాట్ కోహ్లీ - 31 పరుగుల తేడాతో ఓటమి
  • 2022 - జస్ప్రీత్ బుమ్రా - 7 వికెట్ల తేడాతో ఓటమి
  • 2025 - శుభ్‌మన్ గిల్ - 336 పరుగుల తేడాతో విజయం
46
ఇండియా vs ఇంగ్లాండ్: దంచికొట్టిన బ్యాటర్లు
Image Credit : Getty

ఇండియా vs ఇంగ్లాండ్: దంచికొట్టిన బ్యాటర్లు

ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ (269 పరుగులు), రవీంద్ర జడేజా (89 పరుగులు), యశస్వి జైస్వాల్ (87 పరుగులు) రాణించారు. 

ఇంగ్లాండ్ 407 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జేమీ స్మిత్ (184* పరుగులు), హ్యారీ బ్రూక్ (158 పరుగులు) ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ భారాన్ని మోశారు. భారత్‌కు 180 పరుగుల ఆధిక్యం లభించింది.

భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 427 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. గిల్ 161 పరుగులు, జడేజా 69 పరుగులు నాటౌట్, పంత్ 65 పరుగులు, కేఎల్ రాహుల్ 55 పరుగులతో రాణించారు. 

దీంతో భారత్ ఇంగ్లాండ్‌కు 608 పరుగుల లక్ష్యం ఉంచింది. ఛేదనలో 271 పరుగులకే ఇంగ్లాండ్ కుప్పకూలింది. జేమీ స్మిత్ 88 పరుగులతో పోరాడినా ఫలితం దక్కలేదు. భారత బౌలింగ్‌లో ఆకాష్ దీప్ 6 వికెట్లు పడగొట్టాడు.

56
భారత బౌలర్లు అదరగొట్టారు
Image Credit : ANI

భారత బౌలర్లు అదరగొట్టారు

మొదటి ఇన్నింగ్స్‌లో మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌కు షాక్ ఇచ్చాడు. అలాగే, ఆకాష్ దీప్ 4 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆకాష్ దీప్ మరోసారి చెలరేగి 6 వికెట్లు సాధించాడు. ఈ ప్రదర్శనతో అతను మొత్తం 10 వికెట్లతో మ్యాచ్‌ను ముగించాడు. బ్యాటింగ్ లో గిల్ దుమ్మురేపితే.. బౌలింగ్ లో ఆకాశ్ దీప్ ఇంగ్లాండ్ దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు.

66
గిల్ నాయకత్వంలో భారత జట్టు కొత్త అధ్యాయం
Image Credit : Getty

గిల్ నాయకత్వంలో భారత జట్టు కొత్త అధ్యాయం

శుభ్‌మన్ గిల్ ఈ విజయంతో తన నాయకత్వ నైపుణ్యాన్ని నిరూపించాడు. ధోనీ, కోహ్లీ వంటి దిగ్గజాలు సాధించలేకపోయిన విజయాన్ని సాధించి, భారత్ టెస్ట్ చరిత్రలో ఓ మైలురాయిని నెలకొల్పాడు. ఇప్పుడు మూడో టెస్ట్ జూలై 10 నుంచి లార్డ్స్ మైదానంలో ప్రారంభం కానుంది. అక్కడ కూడా విజయం సాధించాలని భారత్ ఉత్సాహంగా ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
శుభ్‌మన్ గిల్
క్రికెట్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved