విరాట్, రోహిత్ పై 2007 టీ20 వరల్డ్ కప్ హీరో కామెంట్స్ వైరల్
Virat and Rohit: టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
జోగిందర్ శర్మ ఏం చెప్పారంటే?
టెస్ట్ క్రికెట్ కు భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇది అందరినీ షాక్ కు గురిచేసింది. అయితే, విరాట్, రోహిత్ ఇంకా బాగా ఆడగలరని 2007 టీ20 వరల్డ్ కప్ హీరో జోగిందర్ శర్మ అన్నారు.
ఇండియా ఇంగ్లాండ్ టూర్
ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లాండ్ టూర్ కి ముందు విరాట్ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ కూడా ఇటీవలే రిటైర్ అయ్యాడు. వాళ్ళ రిటైర్మెంట్ తో ఖాళీ ఏర్పడినా.. టీమిండియా కోలుకుంటుందని జోగిందర్ నమ్ముతున్నాడు.
విరాట్ కోహ్లీ ఫిట్నెస్
“విరాట్ ఫిట్నెస్ చూస్తే రిటైర్ అయ్యే టైం కాదనిపిస్తుంది. రోహిత్ కూడా ఆడాల్సింది. అందరికీ కలిసి రాని సమయం వస్తుంది. వాటిని దాటుకుని రావాలి. మన దేశంలో మంచి బెంచ్ స్ట్రెంత్ ఉంది. క్రికెట్ కొనసాగాలి” అని జోగిందర్ శర్మ అన్నాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్
భారత జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెద్దగా రాణించలేకపోయింది. మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు పెద్ద ఇన్నింగ్స్ లు ఆడలేకపోయారు. కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో వారి ఫామ్ ను ఉదాహరణగా చెబుతూ, పెద్ద ప్లేయర్స్ రిటైర్ అయినా ఆస్ట్రేలియా ఇంకా టాప్ టీం అని జోగిందర్ అన్నారు.
విరాట్ 14 ఏళ్ల టెస్ట్ కెరీర్
విరాట్ 14 ఏళ్ల టెస్ట్ కెరీర్ ఇండియాని బలమైన టీం గా మార్చింది. యువ ఆటగాళ్లకు ఫిట్ నెస్, అగ్రెసివ్ నెస్ నేర్పించాడు. 46.85 యావరేజ్ తో 9,230 పరుగులు చేశాడు.