MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Sports
  • Cricket
  • Team India: భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే ఎంట్రీ

Team India: భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే ఎంట్రీ

Team India: ఇండియా అండర్-19 జట్టు త్వరలోనే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. జూన్ 24 నుండి జూలై 23 వరకు ప్రాక్టీస్ మ్యాచ్ తో పాటు 5 వన్డేలు ఆడనుంది. యంగ్ ప్లేయర్ ఆయుష్ మాత్రే కెప్టెన్‌గా ఎంపిక చేయగా, వైభవ్ సూర్యవంశీ కూడా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.

1 Min read
Mahesh Rajamoni
Published : May 22 2025, 08:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు
Image Credit : ANI

ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు

ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తుంది. జూన్ 20 నుండి 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడుతుంది. అదే నెలలో, ఇండియా అండర్-19 జట్టు కూడా ఇంగ్లాండ్ వెళ్తుంది. ఈ క్రమంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియా జూనియర్ జట్టును ప్రకటించింది.

25
భారత జట్టులోకి 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ
Image Credit : Asianet News

భారత జట్టులోకి 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ

రాజస్థాన్ జట్టు తరఫున ఐపీఎల్ దుమ్మురేపే ప్రదర్శనలతో అదరగొట్టిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి కూడా భారత జూనియర్ జట్టులో చోటు దక్కింది. ఐపీఎల్ చరిత్రలో 35 బంతుల్లో సెంచరీ చేసిన అతి చిన్న వయస్సు ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే.

Related Articles

IPL 2025: ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిది ఆ జట్టేనా !
IPL 2025: ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిది ఆ జట్టేనా !
GT vs LSG LIVE: టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్.. లావెండర్ జెర్సీలో గుజరాత్ టైటాన్స్
GT vs LSG LIVE: టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్.. లావెండర్ జెర్సీలో గుజరాత్ టైటాన్స్
35
ఇంగ్లాండ్ కు భారత అండర్-19 జట్టు
Image Credit : BCCI Photo

ఇంగ్లాండ్ కు భారత అండర్-19 జట్టు

ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు 50 ఓవర్ల ప్రాక్టీస్ మ్యాచ్ తో పాటు 5 వన్డే మ్యాచ్ లను ఆడనుంది. ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో 2 డే మ్యాచ్‌లు ఆడుతుందని బీసీసీఐ తెలిపింది.

45
టీమిండియా జూనియర్ జట్టు కెప్టెన్ గా సీఎస్కే యంగ్ ప్లేయర్ ఆయుష్ మాత్రే
Image Credit : ANI

టీమిండియా జూనియర్ జట్టు కెప్టెన్ గా సీఎస్కే యంగ్ ప్లేయర్ ఆయుష్ మాత్రే

ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టుకు కెప్టెన్ గా చెన్నై సూపర్ కింగ్స్ యంగ్ ప్లేయర్ ఆయుష్ మాత్రేను బీసీసీఐ ఎంపిక చేసింది. అతనితో పాటు జట్టులో వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్ సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ గుండు (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), హర్వంష్ సింగ్ (వికెట్ కీపర్) కూడా ఉన్నారు.

55
భారత అండర్ 19 టీమ్ లో ముగ్గురు పంజాబ్ ప్లేయర్లు
Image Credit : X

భారత అండర్ 19 టీమ్ లో ముగ్గురు పంజాబ్ ప్లేయర్లు

పంజాబ్‌కు చెందిన విహాన్, రాహుల్, అన్‌మోల్జీత్ అండర్-19 భారత జట్టులో ఎంపిక కావడంపై హర్భజన్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. పీసీఏ కృషిని ఆయన ప్రశంసించారు. కాగా, ఇండియా అండర్-19 జట్టు జూన్ 24న తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత 5 వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది.

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
భారత దేశం
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved