Team India: భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే ఎంట్రీ
Team India: ఇండియా అండర్-19 జట్టు త్వరలోనే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. జూన్ 24 నుండి జూలై 23 వరకు ప్రాక్టీస్ మ్యాచ్ తో పాటు 5 వన్డేలు ఆడనుంది. యంగ్ ప్లేయర్ ఆయుష్ మాత్రే కెప్టెన్గా ఎంపిక చేయగా, వైభవ్ సూర్యవంశీ కూడా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు
ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తుంది. జూన్ 20 నుండి 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో ఆడుతుంది. అదే నెలలో, ఇండియా అండర్-19 జట్టు కూడా ఇంగ్లాండ్ వెళ్తుంది. ఈ క్రమంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియా జూనియర్ జట్టును ప్రకటించింది.
భారత జట్టులోకి 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ
రాజస్థాన్ జట్టు తరఫున ఐపీఎల్ దుమ్మురేపే ప్రదర్శనలతో అదరగొట్టిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి కూడా భారత జూనియర్ జట్టులో చోటు దక్కింది. ఐపీఎల్ చరిత్రలో 35 బంతుల్లో సెంచరీ చేసిన అతి చిన్న వయస్సు ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే.
ఇంగ్లాండ్ కు భారత అండర్-19 జట్టు
ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు 50 ఓవర్ల ప్రాక్టీస్ మ్యాచ్ తో పాటు 5 వన్డే మ్యాచ్ లను ఆడనుంది. ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో 2 డే మ్యాచ్లు ఆడుతుందని బీసీసీఐ తెలిపింది.
టీమిండియా జూనియర్ జట్టు కెప్టెన్ గా సీఎస్కే యంగ్ ప్లేయర్ ఆయుష్ మాత్రే
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టుకు కెప్టెన్ గా చెన్నై సూపర్ కింగ్స్ యంగ్ ప్లేయర్ ఆయుష్ మాత్రేను బీసీసీఐ ఎంపిక చేసింది. అతనితో పాటు జట్టులో వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్ సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ గుండు (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), హర్వంష్ సింగ్ (వికెట్ కీపర్) కూడా ఉన్నారు.
భారత అండర్ 19 టీమ్ లో ముగ్గురు పంజాబ్ ప్లేయర్లు
పంజాబ్కు చెందిన విహాన్, రాహుల్, అన్మోల్జీత్ అండర్-19 భారత జట్టులో ఎంపిక కావడంపై హర్భజన్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. పీసీఏ కృషిని ఆయన ప్రశంసించారు. కాగా, ఇండియా అండర్-19 జట్టు జూన్ 24న తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత 5 వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది.