MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Sports
  • Cricket
  • ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ లో భార‌త్ జోరు !

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ లో భార‌త్ జోరు !

WTC Points Table: భార‌త్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. వైజాగ్ టెస్టులో టీమిండియా భారీ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.  

2 Min read
Mahesh Rajamoni
Published : Feb 05 2024, 05:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
india, cricket

india, cricket

India vs England: విశాఖ‌లో జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో టీమిండియా అద్భుత‌మైన ఆట‌తీరును క‌న‌బ‌ర్చింది. రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. భార‌త జ‌ట్టు విజ‌యంలో య‌శ‌స్వి జైస్వాల్, శుభ్ మ‌న్ గిల్, జ‌స్ప్రీత్ బుమ్రా, ర‌విచంద్ర‌న్ అశ్విన్ కీల‌క పాత్ర పోషించాడు. గెలుపుతో 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భార‌త్-ఇంగ్లాండ్ లు 1-1తో స‌మంగా నిలిచాయి. అయితే, టీమిండియా భారీ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది.

24
Asianet Image

విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఈ విజయంతో భారత్ పీసీటీ 52.77కు చేరడంతో పీసీటీ 50 ఉన్న దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్లను అధిగమించగలిగింది. డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్ లో ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా 55 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

34
Asianet Image

కాగా, ఇంగ్లాండ్ తో హోరాహోరీగా సాగిన రెండో టెస్టులో భారత బౌలర్లు రాణించ‌డంతో 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. అయితే, మధ్యాహ్నం సెషన్ లో ఆ జట్టు 292 పరుగులకు ఆలౌటైంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో పుంజుకోవడానికి భారత్ రెండు సెషన్ల వ్యవధిలో తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్ కు ఓట‌మి త‌ప్ప‌లేదు.

44
Asianet Image

రెండో ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా (3/46), రవిచంద్రన్ అశ్విన్ (3/71), అక్షర్ పటేల్ (1/75), కుల్దీప్ యాదవ్ (1/60)ల‌ సమష్టి కృషితో భార‌త్ విజ‌యం సాధించింది. మొత్తంగా ఈ మ్యాచ్ లో భార‌త పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా 9 వికెట్లు తీసుకున్నాడు. అద్భుత‌మైన బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో చెల‌రేగిన బుమ్రాకు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ ల‌భించింది. కాగా, భార‌త్-ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి రాజ్ కోట్ వేదికగా ప్రారంభం కానుంది. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
భారత దేశం
విరాట్ కోహ్లీ
విశాఖపట్నం
క్రికెట్
రోహిత్ శర్మ
క్రీడలు
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved