MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ లో భార‌త్ జోరు !

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ లో భార‌త్ జోరు !

WTC Points Table: భార‌త్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. వైజాగ్ టెస్టులో టీమిండియా భారీ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 05 2024, 05:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
india, cricket

india, cricket

India vs England: విశాఖ‌లో జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో టీమిండియా అద్భుత‌మైన ఆట‌తీరును క‌న‌బ‌ర్చింది. రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. భార‌త జ‌ట్టు విజ‌యంలో య‌శ‌స్వి జైస్వాల్, శుభ్ మ‌న్ గిల్, జ‌స్ప్రీత్ బుమ్రా, ర‌విచంద్ర‌న్ అశ్విన్ కీల‌క పాత్ర పోషించాడు. గెలుపుతో 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భార‌త్-ఇంగ్లాండ్ లు 1-1తో స‌మంగా నిలిచాయి. అయితే, టీమిండియా భారీ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఈ విజయంతో భారత్ పీసీటీ 52.77కు చేరడంతో పీసీటీ 50 ఉన్న దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్లను అధిగమించగలిగింది. డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్ లో ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా 55 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

34

కాగా, ఇంగ్లాండ్ తో హోరాహోరీగా సాగిన రెండో టెస్టులో భారత బౌలర్లు రాణించ‌డంతో 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. అయితే, మధ్యాహ్నం సెషన్ లో ఆ జట్టు 292 పరుగులకు ఆలౌటైంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో పుంజుకోవడానికి భారత్ రెండు సెషన్ల వ్యవధిలో తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్ కు ఓట‌మి త‌ప్ప‌లేదు.

44

రెండో ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా (3/46), రవిచంద్రన్ అశ్విన్ (3/71), అక్షర్ పటేల్ (1/75), కుల్దీప్ యాదవ్ (1/60)ల‌ సమష్టి కృషితో భార‌త్ విజ‌యం సాధించింది. మొత్తంగా ఈ మ్యాచ్ లో భార‌త పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా 9 వికెట్లు తీసుకున్నాడు. అద్భుత‌మైన బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో చెల‌రేగిన బుమ్రాకు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ ల‌భించింది. కాగా, భార‌త్-ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి రాజ్ కోట్ వేదికగా ప్రారంభం కానుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
విరాట్ కోహ్లీ
విశాఖపట్నం
క్రికెట్
రోహిత్ శర్మ
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Playoff: ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన బెంగళూరు.. పంజాబ్ కొంపముంచిన ఓటమి, చెన్నైకి బూస్ట్!
Recommended image2
ODI World Cup 2027: వరల్డ్ కప్ ఆడటంపై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
Recommended image3
IPL 2026: ఫిన్ అలెన్ రచ్చతో పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్.. ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్ల సునామీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved