Harry Brook: హ్యారీ బ్రూక్ సెంచరీ.. జేమీ స్మిత్ సునామీ బ్యాటింగ్
India vs England: ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత్ పై ఇంగ్లాండ్ యంగ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ సెంచరీ కొట్టాడు. ఇది తన కెరీర్ లో 9వ సెంచరీ. అంతకుముందు జేమీ స్మిత్ కూడా తుఫాను సెంచరీ కొట్టాడు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
భారత్ పై హ్యారీ బ్రూక్ మొదటి టెస్ట్ సెంచరీ
ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ తన టెస్ట్ కెరీర్లో భారత్ పై తొలి సెంచరీని సాధించాడు. మొత్తంగా తనకు ఇది 9వ టెస్టు సెంచరీ. ఎడ్జ్బాస్టన్లో జరిగిన టెస్ట్ మ్యాచ్ మూడవ రోజున ఇంగ్లాండ్ 84/5 పరుగులతో కష్టాల్లో ఉన్న సమయంలో జేమీ స్మిత్ తో కలిసి హ్యారీ బ్రూక్ జట్టును నిలబ్టెట్టాడు. భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ వీరిద్దరూ సెంచరీలు బాదారు.
మొదటి ఇన్నింగ్స్లో భారత జట్టు 587 పరుగులు చేసింది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 77/3 పరుగులు చేసింది. మూడో రోజు ప్రారంభంలో మహమ్మద్ సిరాజ్ విజృంభించి జో రూట్, బెన్ స్టోక్స్ను వరుస బంతుల్లో అవుట్ చేశాడు.
ఆ తర్వాత బ్రూక్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను నిలబెట్టే ఆటతో సెంచరీ కొట్టాడు. హ్యారీ బ్రూక్ 121 పరుగులతో ఆడుతున్నాడు. తన ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు.
జేమీ స్మిత్ తుపాను సెంచరీ
జేమీ స్మిత్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 80 బంతుల్లో సెంచరీ కొట్టాడు. దీంతో భారత్పై లంచ్కు ముందు సెంచరీ కొట్టిన ప్టేయర్ గా నిలిచాడు. ఏబీ డివిలియర్స్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ జేమీ స్మిత్.
అలాగే, ఇది ఇంగ్లాండ్ టెస్ట్ చరిత్రలో మూడవ వేగవంతమైన సెంచరీగా నిలిచింది. సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు జేమీ స్మిత్. ప్రస్తుతం 151 పరుగులతో ఆడుతున్నాడు. తన ఇన్నింగ్స్ లో 19 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.
బ్రూక్-స్మిత్ అజేయ భాగస్వామ్యం
జేమీ స్మిత్ (151* పరుగులు), హ్యారీ బ్రూక్ (121* పరుగులు) కలిసి ఆరో వికెట్కు 246 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఇది ఇంగ్లండ్కు బలమైన పునాది వేస్తోంది. ప్రారంభంలో 10 బంతుల్లోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్, లంచ్ వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 172 పరుగులు చేసింది.
భారత్పై ఎదురుదాడి చేస్తున్న ఇంగ్లాండ్ బ్యాటర్లు
100 పరుగులలోపే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఇంగ్లాండ్. అయినప్పటికీ, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ లు తమ దూకుడు ఆటను కొనసాగించారు. ఇంగ్లాండ్ జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. భారత బౌలింగ్ ను దంచికొడుతున్నాడు. వీరిద్దరి సెంచరీలతో ఇంగ్లాండ్ 300+ మార్కును దాటేసింది.
భారత్ భారీ స్కోరు
ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కు శుభ్మన్ గిల్ 269 పరుగులు, యశస్వి జైస్వాల్ 87 పరుగులు, జడేజా 89 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 42 పరుగుల ఇన్నింగ్స్ లతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 587 పరుగులు చేసింది. రెండవ రోజు ముగిసేసరికి భారత్ ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు పడగొట్టి మంచి స్థితిలో ఉన్నా, మూడవ రోజు దూకుడు తగ్గింది.
ఒక సమయంలో ఇంగ్లాండ్ 84/5 పరుగుల వద్ద ఉండగా, బ్రూక్, స్మిత్ కలిసి కేవలం 90 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. స్మిత్ ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో ఒక్క ఓవర్లో నాలుగు బౌండరీలు, ఒక సిక్స్ సాధించి మ్యాచ్ రూపాన్ని మార్చేసే ఇన్నింగ్స్ ను ఆడాడు.
ఇంగ్లండ్, ఒక్కసారిగా స్కోరింగ్ రేట్ పెంచి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచింది. స్పిన్నర్లు రంగంలోకి దిగిన తర్వాత కూడా జడేజా, వాషింగ్టన్లపై స్మిత్ బ్యాక్ టు బ్యాక్ బౌండరీలతో సెంచరీ కొట్టాడు.