MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • UPI Payments: యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీలు.? క్లారిటీ ఇచ్చిన‌ ఫోన్‌పే సీఈవో

UPI Payments: యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీలు.? క్లారిటీ ఇచ్చిన‌ ఫోన్‌పే సీఈవో

UPI Payments: లోక్‌సభలో పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టానికి సంబంధించిన సవరణ బిల్లు ఆమోదం పొందడంతో యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధిస్తారనే వార్తలు వైర‌ల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఫోన్‌పే సహ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ కీలక ప్ర‌క‌ట‌న చేశారు

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 08 2026, 07:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యూపీఐ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు
Image Credit : Asianet News

యూపీఐ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు

సమీర్ నిగమ్ 'ఎక్స్'లో స్పందిస్తూ భారతీయ వినియోగదారుల కోసం యూపీఐ సేవలు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని వెల్లడించారు. ఒక వ్యక్తి మరో వ్యక్తికి డబ్బు పంపినా, రోజువారీ చెల్లింపులు చేసినా ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న విధానంలో సాధారణ యూపీఐ లావాదేవీలకు ఎలాంటి మార్పు లేదని ఆయన తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అయితే MDRపై ఎందుకు చర్చ జరుగుతోంది?
Image Credit : Gemini AI

అయితే MDRపై ఎందుకు చర్చ జరుగుతోంది?

ప్రస్తుతం చర్చకు కారణమైన అంశం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR). ఇది వినియోగదారుడు చెల్లించే ఫీజు కాదు. వ్యాపార సంస్థలు డిజిటల్ చెల్లింపులు స్వీకరించినప్పుడు, ఆ చెల్లింపును ప్రాసెస్ చేసే బ్యాంకులు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించే సేవా రుసుమునే MDR అంటారు. 2020 నుంచి యూపీఐ, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై MDRను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అయితే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నిర్వహణకు అయ్యే ఖర్చులను దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తులో కొన్ని ప్రత్యేక వ్యాపార లావాదేవీలపై మాత్రమే MDR విధించే అవకాశంపై ప్రభుత్వం చట్టపరమైన వెసులుబాటు కల్పించింది.

Related Articles

Related image1
36 ఏళ్ల క్రితం మాదాపూర్‌లో గజం ధ‌ర ఎంత ఉండేదో తెలుసా? లక్ష పెట్టుడి పెట్టుంటే, నేడు కోటీశ్వ‌రుల‌య్యేవారు
Related image2
హైద‌రాబాద్‌లోని సుచిత్ర స‌ర్కిల్‌కు ఆ పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా.?
35
ఎవరికి వర్తించే అవకాశం ఉంది?
Image Credit : Getty

ఎవరికి వర్తించే అవకాశం ఉంది?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ప్రతి యూపీఐ లావాదేవీపై ఛార్జీలు విధించే ప్రతిపాదన లేదు. సంవత్సరానికి రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న పెద్ద వ్యాపార సంస్థలు, కార్పొరేట్ సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్, లగ్జరీ హోటళ్లలో రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని వ్యాపార చెల్లింపులపై మాత్రమే MDR వర్తించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే స్నేహితుడికి డబ్బు పంపడం, కుటుంబ సభ్యులకు నగదు బదిలీ చేయడం లేదా సాధారణ దుకాణాల్లో చేసే వ్యక్తిగత యూపీఐ చెల్లింపులపై ప్రస్తుతం ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని స్పష్టమవుతోంది.

45
కొత్త చట్టం అసలు ఏం చెబుతోంది?
Image Credit : our own

కొత్త చట్టం అసలు ఏం చెబుతోంది?

లోక్‌సభ ఆమోదించిన పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్ట సవరణతో ప్రభుత్వం అవసరమైతే కొన్ని ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలపై MDR విధించే అధికారం పొందింది. అయితే ఇది వెంటనే అన్ని యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు అమల్లోకి వస్తాయనే అర్థం కాదు. ఈ సవరణ భవిష్యత్తులో అవసరమైతే ఎంపిక చేసిన వ్యాపార లావాదేవీలకు మాత్రమే వర్తించేలా చట్టపరమైన అవకాశం కల్పిస్తుంది. దీనిపై తుది నిబంధనలు ఇంకా ప్రకటించలేదు. అందువల్ల ప్రస్తుతం వినియోగదారులు యూపీఐ వినియోగంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

55
యూపీఐ వ్యవస్థకు ఆర్థిక స్థిరత్వంపై చర్చ
Image Credit : our own

యూపీఐ వ్యవస్థకు ఆర్థిక స్థిరత్వంపై చర్చ

ప్రస్తుతం దేశంలో కోట్లాది మంది ప్రతి రోజు యూపీఐ సేవలను వినియోగిస్తున్నారు. ఈ భారీ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను నిర్వహించడానికి బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, సైబర్ భద్రత, మోసాల నివారణ, సాంకేతిక మౌలిక వసతులపై నిరంతరం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ఖర్చులను భవిష్యత్తులో ఎలా భరించాలనే అంశంపై పరిశ్రమలో చర్చ కొనసాగుతోంది. అయితే ఈ చర్చల ప్రభావం సాధారణ వినియోగదారులపై పడదని, యూపీఐ ద్వారా చేసే రోజువారీ చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయని ఫోన్‌పే సీఈవో సమీర్ నిగమ్ స్పష్టం చేయడంతో కోట్లాది యూజర్లకు ఊరట లభించింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
Latest Videos
Recommended Stories
Recommended image1
Recharge plan: జియో యూజ‌ర్ల‌కు పండ‌గే.. రూ. 550కే 15 ఓటీటీ యాప్‌లు
Recommended image2
ఇన్‌స్టా ద్వారా వీళ్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే మతిపోవాల్సిందే..!
Recommended image3
Gold Price Hike: శ్రావణమాసం వేళ పసిడి షాక్..రూ.1.50 లక్షలు దాటేయడంతో కొనుగోలుదారుల్లో ఆందోళన
Related Stories
Recommended image1
36 ఏళ్ల క్రితం మాదాపూర్‌లో గజం ధ‌ర ఎంత ఉండేదో తెలుసా? లక్ష పెట్టుడి పెట్టుంటే, నేడు కోటీశ్వ‌రుల‌య్యేవారు
Recommended image2
హైద‌రాబాద్‌లోని సుచిత్ర స‌ర్కిల్‌కు ఆ పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved