MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • PM Kisan: ఇవి లేకపోతే పీఎం కిసాన్ డబ్బులు పడవు

PM Kisan: ఇవి లేకపోతే పీఎం కిసాన్ డబ్బులు పడవు

PM Kisan: మీరు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారా? రైతులంతా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ పథకం లబ్ధి పొందాలంటే కొన్ని డాక్యుమెంట్స్ చాలా పక్కాగా ఉండాలి. అందులో ఒక్కటి లేకపోయినా మీకు కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు మీ ఖాతాలో పడవు. ఆ డాక్యుమెంట్స్ ఏంటి? పథకం డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

 

Naga Surya Phani Kumar | Published : May 09 2025, 08:51 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ పథకం ద్వారా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. కానీ కొందరికి అర్హత ఉన్నా సరైన డాక్యుమెంట్లు లేక పథకం డబ్బులు పొందలేకపోతున్నారు. ఈ విడత పీఎం కిసాన్ పథకం డబ్బులు సరిగ్గా జమ కావాలంటే మీ డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 

 

25
Asianet Image

20వ విడత విడుదల తేదీ ఎప్పుడు?

సాధారణంగా నాలుగు నెలలకోసారి పీఎం కిసాన్ యోజన పథకం డబ్బులు విడుదల చేస్తారు. 18వ విడత అక్టోబర్ 2024లో రైతుల ఖాతాల్లో వేశారు. 19వ విడత ఫిబ్రవరి 2025లో వచ్చింది. 20వ విడత జూన్ 2025లో వస్తుందని అధికారుల ద్వారా తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ లోపే ఆధార్-బ్యాంక్ లింకింగ్, భూమి ధ్రువీకరణ, e-KYC వంటివి పూర్తి చేసుకోవడం తప్పనిసరి.

 

 

Related Articles

ఇప్పుడు పెన్షన్ రూ.1,000 కాదు రూ.3000: పెంచేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం
ఇప్పుడు పెన్షన్ రూ.1,000 కాదు రూ.3000: పెంచేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం
రోజుకు రూ.7 పెట్టుబడితో రూ.5000 పెన్షన్ పొందొచ్చు: ఎలాగంటే..
రోజుకు రూ.7 పెట్టుబడితో రూ.5000 పెన్షన్ పొందొచ్చు: ఎలాగంటే..
35
Asianet Image

ఆధార్ లింకింగ్ తప్పనిసరి

డబ్బులు రాకపోవడానికి ప్రధాన కారణం ఆధార్-బ్యాంక్ లింకింగ్ లేకపోవడమే. చాలా మంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి సాంకేతిక సమస్యల వల్ల కూడా ఆధార్ లింక్ కావడం లేదు. పీఎం కిసాన్ యోజన పథకం కింద మీ బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. లేకపోతే డబ్బులు రావు. ఇప్పుడే చెక్ చేసుకొని వెంటనే లింక్ చేసుకోండి.

45
Asianet Image

భూమి ధ్రువీకరణ తప్పనిసరి

ఆధార్ తర్వాత ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య భూమి ధ్రువీకరణ లేకపోవడం. భూమి ధ్రువీకరణ  జరిగిందో లేదో జూన్ 20 లోపే చెక్ చేసుకొని వెంటనే చేయించుకోండి. మీ భూమి వివరాలు సరిగ్గా లేకపోతే డబ్బులు ఆగిపోతాయి. మీ భూమి డాక్యుమెంట్లు అప్డేట్ చేసి, వెరిఫై చేయించుకోండి.

 

55
Asianet Image

e-KYC పూర్తి చేయాలి

ఈ రోజుల్లో ప్రతి విషయానికి e-KYC చేయించుకోవాలని చెబుతున్నారు. పీఎం కిసాన్ యోజన స్కీమ్ కి కూడా e-KYC తప్పకుండా చేయించుకోవాలి. లేకపోతే డబ్బులు ఆలస్యంగా జమ అయ్యే అవకాశం ఉంటుంది. CSC కేంద్రాలు, pmkisan.gov.in వెబ్సైట్ లేదా PM-KISAN యాప్ ద్వారా e-KYC పూర్తి చేసుకోవచ్చు.

Naga Surya Phani Kumar
About the Author
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది. Read More...
ప్రభుత్వ పథకాలు
ఏషియానెట్ న్యూస్
 
Recommended Stories
Top Stories