PM Kisan: ఇవి లేకపోతే పీఎం కిసాన్ డబ్బులు పడవు
PM Kisan: మీరు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారా? రైతులంతా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ పథకం లబ్ధి పొందాలంటే కొన్ని డాక్యుమెంట్స్ చాలా పక్కాగా ఉండాలి. అందులో ఒక్కటి లేకపోయినా మీకు కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు మీ ఖాతాలో పడవు. ఆ డాక్యుమెంట్స్ ఏంటి? పథకం డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ పథకం ద్వారా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. కానీ కొందరికి అర్హత ఉన్నా సరైన డాక్యుమెంట్లు లేక పథకం డబ్బులు పొందలేకపోతున్నారు. ఈ విడత పీఎం కిసాన్ పథకం డబ్బులు సరిగ్గా జమ కావాలంటే మీ డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.

20వ విడత విడుదల తేదీ ఎప్పుడు?
సాధారణంగా నాలుగు నెలలకోసారి పీఎం కిసాన్ యోజన పథకం డబ్బులు విడుదల చేస్తారు. 18వ విడత అక్టోబర్ 2024లో రైతుల ఖాతాల్లో వేశారు. 19వ విడత ఫిబ్రవరి 2025లో వచ్చింది. 20వ విడత జూన్ 2025లో వస్తుందని అధికారుల ద్వారా తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ లోపే ఆధార్-బ్యాంక్ లింకింగ్, భూమి ధ్రువీకరణ, e-KYC వంటివి పూర్తి చేసుకోవడం తప్పనిసరి.
ఆధార్ లింకింగ్ తప్పనిసరి
డబ్బులు రాకపోవడానికి ప్రధాన కారణం ఆధార్-బ్యాంక్ లింకింగ్ లేకపోవడమే. చాలా మంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి సాంకేతిక సమస్యల వల్ల కూడా ఆధార్ లింక్ కావడం లేదు. పీఎం కిసాన్ యోజన పథకం కింద మీ బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. లేకపోతే డబ్బులు రావు. ఇప్పుడే చెక్ చేసుకొని వెంటనే లింక్ చేసుకోండి.
భూమి ధ్రువీకరణ తప్పనిసరి
ఆధార్ తర్వాత ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య భూమి ధ్రువీకరణ లేకపోవడం. భూమి ధ్రువీకరణ జరిగిందో లేదో జూన్ 20 లోపే చెక్ చేసుకొని వెంటనే చేయించుకోండి. మీ భూమి వివరాలు సరిగ్గా లేకపోతే డబ్బులు ఆగిపోతాయి. మీ భూమి డాక్యుమెంట్లు అప్డేట్ చేసి, వెరిఫై చేయించుకోండి.
e-KYC పూర్తి చేయాలి
ఈ రోజుల్లో ప్రతి విషయానికి e-KYC చేయించుకోవాలని చెబుతున్నారు. పీఎం కిసాన్ యోజన స్కీమ్ కి కూడా e-KYC తప్పకుండా చేయించుకోవాలి. లేకపోతే డబ్బులు ఆలస్యంగా జమ అయ్యే అవకాశం ఉంటుంది. CSC కేంద్రాలు, pmkisan.gov.in వెబ్సైట్ లేదా PM-KISAN యాప్ ద్వారా e-KYC పూర్తి చేసుకోవచ్చు.