MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • మైనర్ బైక్ నడిపితే రూ.25,000, మందు తాగి డ్రైవ్ చేస్తే రూ.10,000: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఇకపై రూ.వేలల్లోనే ఫైన్

మైనర్ బైక్ నడిపితే రూ.25,000, మందు తాగి డ్రైవ్ చేస్తే రూ.10,000: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఇకపై రూ.వేలల్లోనే ఫైన్

‘భరత్ అనే నేను’ అనే సినిమా మీరు చూశారా? అందులో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి రూ.వేలల్లో ఫైన్ వేసిన సీన్ గుర్తుందా? ఇప్పుడు ఇండియాలో అలాంటి కఠినమైన నియమాలు అమలులోకి వచ్చాయి. ఇకపై సిగ్నల్ జంప్ చేసినా కూడా రూ.వేలల్లో ఫైన్ వేస్తారు.

2 Min read
Naga Surya Phani Kumar
Published : Jun 14 2025, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రూల్స్ పాటించకపోవడమే ప్రమాదాలకు కారణం
Image Credit : Asianet News

రూల్స్ పాటించకపోవడమే ప్రమాదాలకు కారణం

మన దేశంలో నిర్లక్ష్యం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. అందుకే ఇలాంటి రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కఠినమైన ట్రాఫిక్ రూల్స్ ని అమలుచేయాలని నిర్ణయించింది.

అతివేగం, మద్యం తాగి డ్రైవ్ చేయడం, పిల్లలు వెహికల్స్ నడపడం, సిగ్నల్స్ క్రాస్ చేయడం ఇలా ట్రాఫిక్ రూల్స్ పాటించని కారణంగా ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే చలానాలు భారీగా పెంచింది. ముఖ్యంగా మైనర్ల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నామని అధికారులు గుర్తించారు.

25
రూల్స్ పాటించకపోతే ఫైన్ రూ.వేలల్లోనే..
Image Credit : Google

రూల్స్ పాటించకపోతే ఫైన్ రూ.వేలల్లోనే..

రోడ్డు ప్రమాదాల వల్ల ఈజీగా ప్రాణాలు పోతున్నాయి. చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి కారణమవుతోంది. కుటుంబ సభ్యులను పోగొట్టుకొని ఆ కుటుంబాలు మానసికంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన నేరాలను అరికట్టడమే లక్ష్యంగా కఠినమైన ట్రాఫిక్ రూల్స్ అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది.

కొత్త రూల్స్ ప్రకారం శిక్షలు ఎలా ఉన్నాయంటే..

మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ మొదటి సారి పట్టుబడితే వారికి రూ.10,000 జరిమానా విధిస్తారు. లేదా ఆరు నెలల జైలు శిక్ష వేస్తారు.

ఇదేవిధంగా రెండో సారి దొరికితే రూ.15,000 జరిమానా, రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు.

రెడ్ సిగ్నల్ జంప్ చేస్తే ఇప్పటి వరకు రూ.500 ఫైన్ వేసేవారు. ఇ-చలానా ఫోన్ కి లేదా మొయిల్ కి వచ్చేది. ఇకపై రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తే రూ.5,000 ఫైన్ కట్టాలి.

Related Articles

Related image1
Traffic Rules Updated: వామ్మో.. తాగి బండి నడిపితే రూ.5 వేలు ఫైనా? కొత్త రూల్స్ ఇంత కఠినంగా ఉన్నాయేంటి?
Related image2
New Traffic Rules in AP : ఇకపై వెహికిల్ నడిపేవారికే కాదు... వెంటున్నవారికీ ట్రాఫిక్ ఫైన్స్
35
స్పీడ్ లిమిట్ దాటినా రూ.5,000 ఫైన్
Image Credit : our own

స్పీడ్ లిమిట్ దాటినా రూ.5,000 ఫైన్

రోడ్డుపై వెళ్తున్నప్పుడు స్పీడ్ లిమిటేషన్స్ కనిపిస్తాయి. వాటిని పాటిస్తూ ప్రయాణం చేస్తే సేఫ్ గా గమ్యస్థానం చేరుకోవచ్చు. వాటిని అతిక్రమించే డ్రైవర్లకు కూడా ఇకపై ఫైన్ వేయనున్నారు. అది రూ.వందల్లో కాకుండా ఏకంగా రూ.5,000 వరకు జరిమానా విధిస్తారు.

అదేవిధంగా అధిక బరువుతో వెళ్లే ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ యజమానులకు రూ.20,000 కంటే ఎక్కువ జరిమానా విధిస్తారు.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే ఇప్పుడు ఏకంగా రూ.5,000 ఫైన్ కట్టాల్సిందే. అయితే మీరు గాని డిజీ లాకర్, ఎంపరివాహన్ లాంటి యాప్‌లోని డిజిటల్ కాపీలు చూపిస్తే మీరు ఎలాంటి ఫైన్ కట్టాల్సిన పని లేదు.

45
పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోయినా రూ.10,000
Image Credit : PTI

పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోయినా రూ.10,000

హెల్మెట్, సీట్ బెల్ట్ ఏం పెట్టుకుంటాం లే అని చాలా మంది నిర్లక్ష్యం వహిస్తారు. కాని ప్రమాదం జరిగినప్పుడు అవే మన ప్రాణాలు కాపాడతాయన్న విషయాన్ని ఎవరూ గుర్తించరు. అందుకే ఇకపై హెల్మెట్ పెట్టుకోకపోయినా, సీట్ బెల్ట్ ధరించకపోయినా రూ.1,000 ఫైన్ వేస్తారు. అంతే కాకుండా 3 నెలల పాటు లైసెన్స్ కూడా సస్పెండ్ చేస్తారు.

పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోయినా, అసలు తీసుకోకపోయినా రూ.10,000 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు. అంతేకాకుండా సామాజిక సేవ చేయాలని డ్యూటీ కూడా వేస్తారు.

55
మైనర్ డ్రైవింగ్ చేస్తే జైలే..
Image Credit : our own

మైనర్ డ్రైవింగ్ చేస్తే జైలే..

మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే బండి యజమానికి రూ.25,000 ఫైన్ వేస్తారు. అంతేకాకుండా అతను 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. దీంతో పాటు అతని వాహన రిజిస్ట్రేషన్ ఒక సంవత్సరం పాటు రద్దు అవుతుంది.

ఇదే సంఘటనలో మైనర్ 25 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు లైసెన్స్ పొందకుండా నిషేధం విధిస్తారు.

మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ఇప్పుడు రూ.5,000 వరకు జరిమానా విధిస్తారు. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలే ఎక్కువ జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ప్రయాణం
ప్రభుత్వ పథకాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved