Today Gold Rate in Hyderabad: ఊహించిందే జరిగింది..పసిడి ప్రియులకు పిడుగులాంటి వార్త
Today Gold Rate in Hyderabad: కొన్ని రోజులుగా ఊరట కల్పించిన బంగారం , వెండి ధరలు ఇప్పుడు ఊహించని షాక్ ఇచ్చాయి. ఇన్వెస్టర్లు, నిపుణులు ఊహించిందే జరిగింది. 5 రోజులుగా రూ.5వేల వరకూ తగ్గిన రేట్లు ఇప్పుడు ఎంత పెరిగాయో తెలుసా?

పసిడి ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్
పసిడి ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్. ధరలు తగ్గుతున్నాయని సంతోషించేలోపే మరో పిడుగు లాంటి వార్త వచ్చింది. పెట్టుబడిదారులు, మార్కెట్లు నిపుణులు ముందు ఇదే విషయంపై హెచ్చరిస్తున్నారు. వారు ఊహించిందే జరిగింది. మరోసారి గోల్డ్, సిల్వర్ రేట్లు ఆకాశానికి ఎగబాకాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ రూ.5 వేలకు పైగా పతనమైంది. దీంతో శుభకార్యాలు పెట్టుకున్న వారంతా హ్యాపీగా ఫీలయ్యారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు.
24 క్యారెట్ల బంగారంపై రూ.1200 పెరుగుదల
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారంపై రూ.1200 పెరిగింది. ఇప్పుడు 10 గ్రాముల మేలిమి పసిడి రూ.1,58,620కు చేరింది. 22 క్యారెట్లకు 10 గ్రాములపై రూ.1100 ఎగబాకి రూ.1,45,400కు వచ్చింది. అటు వెండి కూడా బంగారం వెనుకే నడుస్తోంది.అందుకే వెండిలోనూ మార్పు కనిపిస్తోంది. కిలోపై దాదాపు రూ.4వేలు పెరిగి రూ.2,80లక్షల వద్ద కొనసాగుతోంది. అయితే జీఎస్టీ, మేకింగ్ ఛార్జీల బట్టి వేర్వేరు ప్రాంతాల్లో రేట్లు తేడా ఉంటాయి. ఎప్పటికప్పుడు మార్కెట్లు గమనించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సీన్ మారింది
యుద్ధ ప్రభావంతో గత నెలలో భారీగా రేట్లు పెరిగాయి. కానీ సీన్ మారింది. యుద్ధం కొనసాగుతున్నా కూడా ధరలు తగ్గడం మొదలైంది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే బంగారం, వెండి పాత పాటే పాడుతున్నాయి. వారం ప్రారంభంలో అంటే నిన్న సోమవారం కూడా ధరలు తగ్గి రిలీఫ్ ఇచ్చింది. మళ్లీ ఒక్కసారిగా ధరలు ఎగబాకి షాక్ ఇచ్చాయి. ఐదురోజుల గ్యాప్ తర్వాత పెరిగాయి. ఈ పెరుగుదల తాత్కాలికమా? లేక తగ్గుతుందా అనేది చూడాలి.
కొనుగోలుదారుల్లో ఆందోళన
ముందున్నది ఉగాది, అందులోనూ పెళ్లిళ్లు, శుభకార్యాలు. ఈ సమయంలో గోల్డ్ రేట్లు పెరగడం కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు కొనాలా లేక ఆగాలా అని ఆలోచిస్తున్నారు.మార్కెట్లను గమనించి కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

