ఓలా, ఉబర్, రాపిడో కొత్త రూల్స్: రైడర్లు రద్దు చేస్తే కస్టమర్లకు ఫైన్ కట్టాలి
ఓలా, ఉబర్, రాపిడో బుక్ చేసుకుని మనం క్యాన్సిల్ చేశామనుకోండి క్యాన్సిలేషన్ ఛార్జ్ వసూలు చేస్తారు కదా.. అదే డ్రైవర్ క్యాన్సిల్ చేస్తే ఎలాంటి ఛార్జ్ వసూలు చేయరు. ఇప్పుడు ఈ విషయంపై కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. దీంతో ప్రయాణికులకు లాభం కలుగుతుంది. ఆ రూల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఈ కాలంలో మొబైల్ మన జీవితంలో ఎలా అయితే ఒక భాగం అయిపోయిందో ఓలా, ఉబర్, రాపిడో లాంటి ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ కూడా ప్రతి రోజు ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడింది. బస్సుల్లో ఖాళీ ఉండదు. సొంత వెహికల్ లో వెళ్దామంటే ట్రాఫిక్ లో నడపడం చాలా కష్టం. మెట్రోలో త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. కాని ఆ స్టేషన్ల వద్దకు వెళ్లాలన్నా కష్టమే. అందుకే ఓలా, ఉబర్, రాపిడో వంటి ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ ఎంత ఉపయోగంగా ఉంటున్నాయి.
ఓలా, ఉబర్, రాపిడో ల్లో ఛార్జ్ కూడా తక్కువగా ఉండటంతో సొంతంగా ఆటోలు, కార్లు అద్దెకు తీసుకోవడం మానేశారు. దీనికి తగ్గట్టుగానే ఆయా కంపెనీలు కస్టమర్లకు సౌకర్యవంతమైన రైడ్లు అందిస్తున్నాయి. అయితే అప్పుడప్పుడు కస్టమర్లు తమ అవసరాల రీత్యా బుక్ చేసుకున్న రైడ్ ను క్యాన్సిల్ చేస్తుంటారు. దీంతో కంపెనీలు తర్వాత రైడ్ బుక్ చేసినప్పుడు క్యాన్సిలేషన్ ఛార్జ్ కూడా వసూలు చేస్తుంటాయి.
అయితే అదే రైడ్ ను రైడర్ లేదా డ్రైవర్ క్యాన్సిల్ చేస్తే మాత్రం ఎలాంటి ఛార్జ్ ఉండదు. కస్టమర్లకు టైమ్ వేస్ట్ అవడం తప్ప మళ్లీ ఇంకో వెహికల్ బుక్ చేసుకోక తప్పదు.
కస్టమర్లకు కలుగుతున్న ఇలాంటి ఇబ్బందులను తొలగించేలా మహారాష్ట్ర ప్రభుత్వం ఓలా, ఉబర్, రాపిడో సంస్థలకు కొత్త రూల్స్ పెట్టింది. ఇకపై ఇలా రైడర్లు లేదా డ్రైవర్లు కన్ఫర్మ్ అయిన రైడ్ లను క్యాన్సిల్ చేస్తే ఫైన్ కట్టాలని రూల్ పెట్టింది.
ప్రయాణికుల విలువైన సమయం వేస్ట్ చేసినందుకు గాను తగిన పరిహారం ఆ కస్టమర్ అకౌంట్ కి పంపాలని ఈ రూల్ చెబుతోంది. దీని వల్ల రైడర్లు అకారణంగా రైడ్ లను క్యాన్సిల్ చేయకుండా ఉంటారని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రమే తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణలోనూ ఈ రూల్ అమలు చేయాలని జనం కోరుతున్నారు.