MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Infosys Shares ఇన్ఫోసిస్ నాారాయణమూర్తి తాతయ్య కానుక: 17 నెలల మనవడికి రూ.223 కోట్ల ఆస్తి!

Infosys Shares ఇన్ఫోసిస్ నాారాయణమూర్తి తాతయ్య కానుక: 17 నెలల మనవడికి రూ.223 కోట్ల ఆస్తి!

Infosys Shares: ప్రతి తాతయ్య తన మనవడు, మనవరాలికి ప్రేమతో చాక్లెట్లు, బిస్కెట్లు కొని పెడుతుంటారు. పుట్టినరోజులాంటి ప్రత్యేక సందర్భాల్లో చిన్నచిన్న కానునకలిస్తుంటారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తన మనవడు ఏకాగ్రకి అలాగే కొన్ని షేర్లు బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు వాటి విలువ అక్షరాలా 213 కోట్లు. తాజాగా ఇన్ఫోసిస్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటించిన డివిడెండ్ రూపంలోనే రూ.10 కోట్లు అందుకోనున్నాడు. 

1 Min read
Author : Anuradha B
Published : Apr 19 2025, 10:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇన్ఫోసిస్ డివిడెండ్

ఇన్ఫోసిస్ డివిడెండ్

దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మార్చి 31, 2025 నాటికి ముగిసిన ఆర్థిక సంవత్సరానికి, కంపెనీ వాటాదారులకు షేరుకు రూ.22 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. దీని రికార్డ్ తేదీ మే 30 గా నిర్ణయించారు. ఒక నెలలోపు అంటే జూన్ 30 లోపు డివిడెండ్ మొత్తం చెల్లిస్తామని కంపెనీ తెలిపింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
నారాయణ మూర్తి మనవడు

నారాయణ మూర్తి మనవడు

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి  కుమారుడు రోహన్, కోడలు అపర్ణ కృష్ణన్ కుమారుడే ఏకాగ్ర.  2023 లో బెంగళూరులో జన్మించాడు. మనవడు పుట్టిన సంతోషంలో నారాయణ మూర్తి తన 15 లక్షల షేర్లను అతడికి కానుకగా ఇచ్చాడు.  వీటి నుంచి ఏకాగ్ర కేవలం డివిడెండ్ రూపంలోనే దాదాపు రూ.3.30 కోట్లు అందుకుంటాడు. తాతయ్య తన మనవడు ఏకాగ్రకు షేర్లను బహుమతిగా ఇచ్చినప్పుడు, షేరుకు రూ.49 చొప్పున మూడు డివిడెండ్ అందుకున్నాడు. మొత్తంగా అతడు కేవలం డివిడెండ్ రూపంలోనే రూ.10కోట్ల రూపాయల లబ్ది పొందాడు.

34
ఏకాగ్ర షేర్ల విలువ

ఏకాగ్ర షేర్ల విలువ

17 నెలల ఏకాగ్రకు రూ.223 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. ఏప్రిల్ 18 నాటికి ఇన్ఫోసిస్, ఒక్కో షేరు ధర రూ.1420. అంటే, ఏకాగ్ర వద్ద ఉన్న షేర్ల మొత్తం మార్కెట్ విలువ రూ.213 కోట్లు. దీనికి రూ.10 కోట్ల డివిడెండ్ కలిపితే, ఏకాగ్ర వద్ద రూ.223 కోట్లు ఉంటాయి. 

44
సుధా మూర్తి డివిడెండ్ రూ.76 కోట్లు

సుధా మూర్తి డివిడెండ్ రూ.76 కోట్లు

నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి కూడా డివిడెండ్ ద్వారారూ.76 కోట్లు అందుకుంటారు. నారాయణ మూర్తి కుమార్తె అక్షత మూర్తి, అల్లుడు రిషి సునాక్‌లకు ఇద్దరు కుమార్తెలు, కృష్ణ, అనుష్క. నారాయణ మూర్తి కుమార్తె అక్షత వద్ద ఇన్ఫోసిస్‌లో దాదాపు 3.89 లక్షల షేర్లు ఉన్నాయి.  ఆమె ఇప్పటికి డివిడెండ్ రూపంలో రూ.85.71 కోట్లు అందుకున్నారు.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇక‌పై వాహ‌నాలు నీటితో న‌డ‌వ‌నున్నాయా.? విదేశీ సంస్థ వినూత్న ఆవిష్క‌ర‌ణ‌.
Recommended image2
రిటైర్మెంట్ తర్వాత ఎవరిపై ఆధారపడొద్దా.? ఇలా చేస్తే ప్రతీ 3 నెల‌ల‌కు మీ అకౌంట్‌లోకి రూ. 61 వేలు
Recommended image3
Business Idea: కిర్రాక్ వ్యాపారం.. యాభై వేల పెట్టుబడి పెడితే నెలకు లక్ష సంపాదించవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved