ట్రైన్ టికెట్స్ బుకింగ్లో కొత్త రూల్స్: మే 1 నుంచి అమలు
Indian Railways: ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తున్నారా? అయితే మే 1 నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త రూల్స్ మీరు తప్పకుండా తెలుసుకోవాలి. రైల్వే టికెట్ బుకింగ్లోనే కీలకమైన మార్పులు అమల్లోకి వస్తున్నాయి. కొత్త నిబంధనల గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
భారతీయ రైల్వే మే 1 నుంచి టికెట్ బుకింగ్ విధానంలో కొన్ని కీలకమైన మార్పులను తీసుకొస్తోంది. వేసవి సెలవుల్లో లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తారు. కాబట్టి టికెట్ బుకింగ్ రూల్స్లో మార్పులు చేశారు. చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
రైల్వే రూల్స్లో మార్పు ఎందుకు?
చాలా సంవత్సరాలుగా టికెట్ బుకింగ్ల సమయంలో ఎదురయ్యే సమస్యలపై చాలా కంప్లైంట్స్ వచ్చాయి. బుకింగ్ తేదీల్లో గందరగోళం, తత్కాల్ టికెట్ల దుర్వినియోగం వంటి సమస్యలపై ప్రయాణికులు కంప్లైంట్స్ చేస్తూనే ఉన్నారు. వీటన్నింటినీ సరిచేసి వేగంగా, పారదర్శకంగా రైల్వే సేవలను అందించడానికి ఇండియన్ రైల్వే చర్యలు తీసుకుంటోంది.
ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్లు దొరికేందుకు న్యాయమైన అవకాశం కల్పించడంతో పాటు, టికెట్ ఏజెంట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రైల్వే చర్యలు తీసుకుంది.
మూడు ప్రధాన మార్పులు
మొదటిది అన్ని రైళ్లకు ఒకే బుకింగ్ టైమ్ అమలు చేయాలని రైల్వే నిర్ణయించింది. గతంలో వేర్వేరు రైళ్లకు వేర్వేరు బుకింగ్ టైమింగ్స్ ఉండేవి. ఇది తరచుగా ప్రయాణికులను గందరగోళానికి గురిచేసేది. మే 1 నుంచి మెయిల్, ఎక్స్ప్రెస్ లేదా సూపర్ఫాస్ట్ ఏ రకమైన రైలు అయినా అన్ని రైళ్లకు సరిగ్గా 120 రోజుల ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
దీని ద్వారా రైలు మిస్ అవుతుందనే భయం లేకుండా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడానికి, సీట్లను బుక్ చేసుకోవడానికి తగినంత సమయం దొరుకుతుంది.
తత్కాల్ టికెట్ బుకింగ్
రెండో ప్రధాన మార్పు తత్కాల్ టికెట్ బుకింగ్లకు సంబంధించినది. తత్కాల్ అనేది సాధారణంగా చివరి నిమిషంలో ప్రయాణించే వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ దీనిలో చాలా గందరగోళాలు ఉన్నాయి. ఇప్పుడు బుకింగ్ సమయాలను కొద్దిగా మార్చారు.
AC క్లాస్లకు తత్కాల్ బుకింగ్లు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. అదే సమయంలో స్లీపర్ క్లాస్ తత్కాల్ టికెట్లను ఉదయం 11 గంటల నుంచి బుక్ చేసుకోవచ్చు.
ఒక యూజర్ ఐడీ ఒక రోజుకు రెండు తత్కాల్ టికెట్లను మాత్రమే బుక్ చేసుకోనేలా లిమిట్ పెట్టారు. ఏ రైలులోనైనా 30% సీట్లు మాత్రమే తత్కాల్ కింద లభిస్తాయి. కాబట్టి చివరి నిమిషంలో ప్రయాణం ప్లాన్ చేస్తుంటే రైలు టికెట్ బుకింగ్లో వేగంగా, అప్రమత్తంగా ఉండాలి.
రీఫండ్ రూల్స్
రైల్వే ప్రయాణికులకు వారి డబ్బు తిరిగి చెల్లించడం గురించి స్పష్టమైన విధానాన్ని ప్రవేశపెట్టింది. బయలుదేరడానికి 48 గంటల ముందు కన్ఫర్మ్ టికెట్ను రద్దు చేస్తే మీకు 75% డబ్బు తిరిగి వస్తుంది. బయలుదేరడానికి 24 నుంచి 48 గంటల లోపు రద్దు చేస్తే మీకు 50% డబ్బు తిరిగి వస్తుంది. 24 గంటల్లోపు రద్దు చేస్తే ఎలాంటి డబ్బు తిరిగి రాదు.
చార్ట్ తయారయ్యే సమయానికి కన్ఫర్మ్ కాని వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు పూర్తి డబ్బు తిరిగి పొందే వెసులుబాటు కూడా ఉంది. ఈ స్పష్టమైన రూల్స్ ప్రయాణికులు టికెట్ రద్దు చేయడానికి వర్తించే ఛార్జీల గురించి గందరగోళాన్ని తొలగించే విధంగా రూపొందించారు.