MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ATM: ఏటీమ్ యూజ‌ర్ల‌కు అల‌ర్ట్‌.. మ‌రికొన్ని గంట‌ల్లో మార‌నున్న నిబంధ‌న‌లు. ఛార్జీల మోత

ATM: ఏటీమ్ యూజ‌ర్ల‌కు అల‌ర్ట్‌.. మ‌రికొన్ని గంట‌ల్లో మార‌నున్న నిబంధ‌న‌లు. ఛార్జీల మోత

బ్యాంక్ ఖాతా ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికీ ఏటీఎమ్ కార్డు ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. ఇక ఏటీఎమ్ల‌ను ఉప‌యోగించే క్ర‌మంలో ప‌లు నిబంధ‌న‌లను అమ‌లు చేస్తుంటారు. వీటిని అధికారులు త‌ర‌చూ మారుస్తుంటారు. తాజాగా రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం లావాదేవీల‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..  

1 Min read
Narender Vaitla
Published : Apr 30 2025, 07:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మే 1, 2025 నుంచి ఏటీఎం లావాదేవీల ఛార్జీలు పెరగనున్నాయి. ఖాతాదారులు ఉచిత పరిమితికి మించి చేసే ప్రతి లావాదేవీకి ఇప్పటి వరకు వసూలు చేస్తున్న రూ. 21 ఛార్జీని, ఇకపై రూ. 23గా మార్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం మార్చి 28న విడుదలైన ఆర్బీఐ సర్క్యులర్‌లో వెల్ల‌డించారు. 

25

ఛార్జీల పెంపు ఎవ‌రికి వ‌ర్తిస్తుంది.? 

ఈ ఛార్జీల పెంపు అన్ని వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఆధీకృత ఏటీఎం నెట్‌వర్క్ ఆపరేటర్లు, కార్డు చెల్లింపు నెట్‌వర్కులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు వర్తిస్తుంది. సొంత బ్యాంకు ఏటీఎమ్‌లో నెల‌కు 5 ఉచిత లావాదేవీలు ఉంటాయి. 

Related Articles

Related image1
India vs Pak: భార‌త్, పాక్ యుద్ధం త‌ప్ప‌దా.? ఏ క్ష‌ణంలో అయినా..
Related image2
Ola: ఓలా స్కూట‌ర్ల‌పై రూ. 40 వేల డిస్కౌంట్‌.. అక్ష‌య తృతీయ వేళ అదిరిపోయే ఆఫ‌ర్
35

ఇత‌ర బ్యాంకు ఏటీఎంల విష‌యానికొస్తే.. మెట్రో నగరాల్లో నెలకు మూడు ఉచిత లావాదేవీలు, నాన్ మెట్రో నగరాల్లో ఐదు ఉచిత లావాదేవీలు ఉంటాయి. ఈ ఉచిత లావాదేవీలలో డబ్బు తీసుకోవడం (విత్‌డ్రా), డిపాజిట్లు, బ్యాలెన్స్ చెక్, పిన్ మార్పు వంటి ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు కూడా ఉంటాయి. 
 

45

ఏటీఎం ఛార్జీల‌ను ఎందుకు పెంచారు.? 

బ్యాంకుల నిర్వహణ ఖర్చులు పెరగడం, ఏటీఎం సేవల నిర్వహణలో పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఆర్బీఐ ఈ పెంపును అనుమతించింది. దీంతో ఏటీఎమ్‌ల‌లో ప‌రిమితికి మించి ట్రాన్సాక్ష‌న్స్ చేసే వారు అద‌నంగా ఛార్జీలు చెల్లించ‌క త‌ప్ప‌దు. ఆర్బీఐ నిర్ణ‌యంతో డిజిట‌ల్ చెల్లింపులు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

55

ప్ర‌స్తుతం ఎన్ని ఏటీఎమ్‌లు అందుబాటులో ఉన్నాయి.? 

2025 జ‌న‌వరి నాటికి దేశంలో ఆన్-సైట్ ఏటీఎంలు, క్యాష్ రీసైక్లర్ యంత్రాలు (CRM): 1,30,902, ఆఫ్-సైట్ ఏటీఎంలు, CRMలు: 85,804 ఉన్నాయి. ఆర్బీఐ తీసుకున్న నిర్ణ‌యంతో యూజ‌ర్లు అప్ర‌మ‌త్త‌తో ఉండాల‌ని నిపుణులు చెబుతున్నారు. 

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved