Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Business
  • ఇక లారీల పనైపోయినట్టే: ఒక్క ఛార్జ్ తో 200 కి.మీ ప్రయాణించే హైడ్రోజన్ ట్రక్‌ వచ్చేసింది

ఇక లారీల పనైపోయినట్టే: ఒక్క ఛార్జ్ తో 200 కి.మీ ప్రయాణించే హైడ్రోజన్ ట్రక్‌ వచ్చేసింది

Hydrogen Truck: రవాణా రంగంలో లారీల అవసరం చాలా ఉంటుంది. సాధారణంగా డీజిల్ తో నడిచే లారీలు మనం చూస్తుంటాం. వీటి మెయిన్‌టెనెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే దేశంలోనే టాప్ కంపెనీల్లో ఒకటైన అదానీ గ్రూప్ హైడ్రోజన్ తో నడిచే ట్రక్ ను తయారు చేసింది. ఇటీవల దీన్ని అఫీషియల్ గా ఆవిష్కరించింది. ఈ ట్రక్ ప్రత్యేకతలు తెలుసుకుందాం రండి.   

Naga Surya Phani Kumar | Published : May 17 2025, 08:04 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

భారతదేశపు తొలి హైడ్రోజన్ ట్రక్‌ను అదానీ గ్రూప్ ఆవిష్కరించింది. మైనింగ్ రవాణా కోసం ఈ ట్రక్‌ను ఉపయోగించనున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది. దీని ద్వారా సాంప్రదాయ ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ పై ఆధారపడటం తగ్గుతుందని కంపెనీ తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ట్రక్ ను ఆవిష్కరించారు. 40 టన్నుల బరువును మోసుకెళ్లగల ఈ ట్రక్‌ను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఇటీవల ప్రారంభించారు. కరే పాల్మా గని నుండి విద్యుత్ కేంద్రానికి బొగ్గును తీసుకెళ్లడానికి ఈ ట్రక్ ఉపయోగిస్తామని అదానీ కంపెనీ ప్రకటించింది.

25
Asianet Image

ఒకసారి ఛార్జ్ చేస్తే 200 కి.మీ. ప్రయాణం..

ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న డీజిల్ ట్రక్కులకు బదులుగా క్రమంగా హైడ్రోజన్ ట్రక్కులను ఉపయోగిస్తామని అదానీ కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో వీటి సంఖ్యను పెంచుతామని తెలిపింది. ఒకసారి ఛార్జ్ చేస్తే 200 కి.మీ. దూరం ప్రయాణించగల సామర్థ్యం కలిగినది ఈ ట్రక్ లో మూడు హైడ్రోజన్ ట్యాంకులు అమర్చారు. ఇది డీజిల్ ట్రక్కులకు సమానమైన బరువును మోసుకెళ్లగలదు. 

Related Articles

చిన్న కార్లలో కూడా సేఫ్టీ ఎక్కువే: 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్న మారుతి సుజుకి కార్లు ఇవే
చిన్న కార్లలో కూడా సేఫ్టీ ఎక్కువే: 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్న మారుతి సుజుకి కార్లు ఇవే
మీరు బెస్ట్ SUV కారు కొనాలనుకుంటున్నారా? టాప్ 5 కార్ల వివరాలు ఇవిగో
మీరు బెస్ట్ SUV కారు కొనాలనుకుంటున్నారా? టాప్ 5 కార్ల వివరాలు ఇవిగో
35
Asianet Image

పర్యావరణానికి హాని చేయని వెహికల్స్

ఈ హైడ్రోజన్ ట్రక్, కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని అదానీ గ్రూప్ తెలిపింది. కార్బన్ డయాక్సైడ్, ఇతర కాలుష్య కారక వాయువులను విడుదల చేసే డీజిల్ ట్రక్కుల మాదిరిగా కాకుండా, హైడ్రోజన్ ట్రక్కులు నీటి ఆవిరి, వేడి గాలిని మాత్రమే విడుదల చేస్తాయి. దీని ద్వారా పర్యావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది.

45
Asianet Image

ఇది ఎలా పనిచేస్తుందంటే..

హైడ్రోజన్ ఇంధన కణాలు, విద్యుత్ రసాయన ప్రక్రియ ద్వారా పనిచేస్తాయి. ఇందులో హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసి విద్యుత్తుగా మారుతుంది. ఇందులో నీరు, వేడి మాత్రమే బయటకు విడుదలవుతాయి.

హైడ్రోజన్ ఇంధన కణంలోకి వెళ్ళినప్పుడు అది ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లుగా విడిపోతుంది. ప్రోటాన్లు ఒక పొర ద్వారా వెళ్ళినప్పుడు ఎలక్ట్రాన్లు ఒక సర్క్యూట్ ద్వారా వెళ్లి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్తు వాహనం మోటారుకు శక్తినిస్తుంది. ఈ ప్రక్రియలో వాహనం నుండి నీరు మాత్రమే విడుదలవుతుంది.

55
Asianet Image

టాటా కంపెనీ ట్రక్కులు కూడా వచ్చేస్తున్నాయి..

టాటా కంపెనీ కూడా హైడ్రోజన్ ట్రక్కులు తయారు చేస్తోంది. కొన్ని నెలల క్రితం వీటిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ ట్రక్కులు హైడ్రోజన్ తో పనిచేసేవి కావడంతో పర్యావరణానికి ఎలాంటి హానీ చేయవు. అందుకే ప్రభుత్వం కూడా ఇలాంటి వాహనాల తయారీని ఎంకరేజ్ చేస్తోంది. అదానీ కంపెనీ కూడా మరిన్ని ట్రక్కుల తయారీకి సన్నద్ధమవుతోంది.   

Naga Surya Phani Kumar
About the Author
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది. Read More...
భారతీయ ఆటోమొబైల్
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 
Recommended Stories
Top Stories