Rahu Ketu: రాహు కేతువుల మధ్య చిక్కుకున్న గ్రహాలు.. ఈ 4 రాశుల వారికి కష్టాలు
Rahu Ketu: రాహువు కుంభరాశిలోకి.. కేతువు సింహరాశిలోకి చేరాయి. దీని వల్ల ఈ రెండు ఛాయా గ్రహాల మధ్య మిగిలిన గ్రహాలన్నీ చిక్కుకుపోయాయి. దీని వల్ల 4 రాశుల వారికి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వీరు మూడు రోజుల పాటూ అంటే జూలై 19 వరకు జాగ్రత్తగా ఉండాలి.

సింహ రాశి
కేతువు ఇప్పుడు సింహరాశిలోనే ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వారిపై దాని ప్రభావం ఉంటుంది. వీరు ఎక్కువగా బాధపడే అవకాశం ఉంది. శుక్రుడు కూడా ప్రస్తుతం ఇదే రాశిలో ఉండటంతో, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. భారీ పెట్టుబడులు, పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వీరిలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఇక ప్రేమ, వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు రావచ్చు. కాబట్టి మూడు రోజుల పాటూ జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి
ప్రస్తుతం రాహువు కుంభరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వారు కూడా జూలై 19 వరకు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పనిచేస్తున్న చోట, ఆఫీసులో ఆకస్మిక మార్పులు, బాధ్యతలు వస్తాయి. సహోద్యోగులతో గొడవలు జరగవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డబ్బు లావాదేవీల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలోనే ప్రస్తుతం సూర్యుడు, గురు గ్రహం ఉన్నారు. కాబట్టి ఈ గ్రహస్థితి ప్రభావం కర్కాటక రాశి వారిపైనా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా గురుడు అస్తమించిన స్థితిలో ఉండటం వల్ల శుభ ఫలితాలు రాకపోవచ్చు. కుటుంబ బాధ్యతలు వీరికి పెరిగే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి, భావోద్వేగ నిర్ణయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓపికతో ఉంటే పరిస్థితులు మళ్లీ చక్కబడతాయి.
మిథున రాశి
మిథున రాశి వారు జూలై 19 వరకు జాగ్రత్తగా ఉండాలి. వీరు మాటల విషయంలో, కమ్యూనికేషన్లో ఆచితూచి అడుగేయాలి. ఆఫీసులో లేదా కుటుంబంలో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఏ విషయంలోనైనా పూర్తి సమాచారం తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోండి.

