MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Andhra Pradesh
  • Thalliki Vandanam: ఏపీలో తల్లుల ఖాతాల్లోకి రూ. 15 వేలు.. అమల్లోకి కొత్త పథకం

Thalliki Vandanam: ఏపీలో తల్లుల ఖాతాల్లోకి రూ. 15 వేలు.. అమల్లోకి కొత్త పథకం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన 'సూపర్‌ సిక్స్‌' హామీల అమల్లో మరో ముందడుగు వేసింది. సీఎం చంద్రబాబు “తల్లికి వందనం” పథకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ పథకం ద్వారా పేద విద్యార్థులకు చదువు కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అందించనున్నారు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jun 11 2025, 05:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మరో పథకానికి గ్రీన్ సిగ్నల్
Image Credit : Gemini

మరో పథకానికి గ్రీన్ సిగ్నల్

సూపర్‌ సిక్స్‌లో మరో ముఖ్యమైన హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. గురువారం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. 67.27 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.8,745 కోట్లు జమ చేయనున్నారు. ఈమేరకు విధి విధానాలు ఖరారు చేస్తూ ఇవాళ జీవో విడుదల చేయనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
లక్ష్యం ఏంటి?
Image Credit : Asianet News

లక్ష్యం ఏంటి?

పేదరికం కారణంగా పిల్లలు విద్యను మధ్యలో ఆపకూడదన్నదే తల్లికి వందనం పథకం ఉద్దేశం. విద్య అనేది జీవితాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం. అందుకే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15,000 తల్లి ఖాతాలో నేరుగా జమ చేయనున్నారు.

Related Articles

Related image1
Oyo: క‌పుల్స్‌కి పండ‌గే.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఓయో
Related image2
Honeymoon Murder case: మంగ‌ళ‌సూత్రం, టీష‌ర్ట్‌.. భ‌ర్త‌ను చంపిన భార్య‌ను ప‌ట్టించిన‌వి ఇవే..
36
అర్హులు ఎవరు.?
Image Credit : Getty

అర్హులు ఎవరు.?

ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పథకం వర్తిస్తుంది. తల్లి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉండాలి. కనీసం 75% హాజరు ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు అయి ఉండాలి. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల పిల్లలకు ఈ పథకం వర్తించదు.

46
ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Image Credit : iSTOCK

ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

ప్రస్తుతం ఆన్‌లైన్ దరఖాస్తు లేదు. పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వద్ద నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. స్కూల్ ఆధారంగా ప్రభుత్వం డేటా సేకరిస్తుంది. అర్హత కలిగిన తల్లుల ఖాతాల్లోనే నిధులు జమ చేస్తారు.

56
అవసరమైన పత్రాలు:
Image Credit : iSTOCK

అవసరమైన పత్రాలు:

తల్లి, విద్యార్థి ఆధార్ కార్డు

తల్లి బ్యాంక్ ఖాతా వివరాలు

హాజరు వివరాలు

ఆదాయ ధ్రువీకరణ పత్రం

పాఠశాల ధృవీకరణ

అడ్రస్ ప్రూఫ్

పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

66
NPCI లింకింగ్ తప్పనిసరి
Image Credit : Getty

NPCI లింకింగ్ తప్పనిసరి

తల్లి ఖాతాను ఆధార్‌తో NPCI ద్వారా లింక్ చేయాలి. ఈ ప్రక్రియను బ్యాంక్, మీ సేవా కేంద్రం లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పూర్తిచేయవచ్చు. దరఖాస్తు చేసినవారి ఆధారాలను, హాజరు శాతం, కుటుంబ ఆర్థిక స్థితిని పరిశీలించి అర్హతలు నిర్ధారిస్తారు. అర్హులైన తల్లుల ఖాతాల్లోనే నిధులు నేరుగా జమ చేస్తారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
నారా చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ

Latest Videos
Recommended Stories
Recommended image1
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు పడేది ఎప్పుడంటే?
Recommended image2
Amaravati Real Estate: అమరావతిలో అప్పుడు రూ.16 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.1 కోటి! మైండ్ బ్లాకింగ్ రియల్ ఎస్టేట్ లెక్కలు
Recommended image3
Now Playing
APకి బ్రాండ్ అంబాసిడర్ CBN స్పీచ్ అదరగొట్టిన నిమ్మల| Nimmala Ramanaidu Speech | NTR Bharosa Pensions
Related Stories
Recommended image1
Oyo: క‌పుల్స్‌కి పండ‌గే.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఓయో
Recommended image2
Honeymoon Murder case: మంగ‌ళ‌సూత్రం, టీష‌ర్ట్‌.. భ‌ర్త‌ను చంపిన భార్య‌ను ప‌ట్టించిన‌వి ఇవే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved