MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో 44.5 డిగ్రీల ఎండలు, వడగాల్పులతో పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. తెలంగాణలోనూ ఈదురుగాలుల వానలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 17 2026, 07:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీ, తెలంగాణలో విచిత్ర వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు, మరోవైపు పిడుగుల వానలు
Image Credit : Gemini AI

ఏపీ, తెలంగాణలో విచిత్ర వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు, మరోవైపు పిడుగుల వానలు

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వెదర్ కండిషన్స్ విచిత్రంగా మారాయి. ఒకే టైమ్‌లో రెండు వేర్వేరు వాతావరణ పరిస్థితులు జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఒకపక్క మండే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తూ నిప్పుల కొలిమిని తలపిస్తుంటే.. ఇంకోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల సడన్‌గా మేఘాలు కమ్ముకుని వర్షాలు పడుతున్నాయి.

నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కాస్త బలహీనపడి అల్పపీడనంగా కొనసాగుతోంది. దీనికి ఉపరితల ఆవర్తనం కూడా తోడవడంతో వాతావరణంలో ఈ మార్పులు వస్తున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ఏపీలో ముచ్చెమటలు.. 44.5 డిగ్రీల టెంపరేచర్ గురూ
Image Credit : Getty

ఏపీలో ముచ్చెమటలు.. 44.5 డిగ్రీల టెంపరేచర్ గురూ

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత నెక్స్ట్ లెవెల్‌కు చేరింది. చాలా జిల్లాల్లో ఉక్కపోత, వడగాలులతో జనాలు అల్లాడిపోతున్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే రోజుల్లో విజయనగరం, మన్యం, పోలవరం, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఎండల తీవ్రత పెరుగుతుంది. ఇక్కడ ఏకంగా 42 డిగ్రీల నుండి 44.5 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది.

ఇప్పటికే కర్నూలు జిల్లా నగరడోనలో 43.5 డిగ్రీలు, పల్నాడు బెల్లంకొండలో 42.6 డిగ్రీల రికార్డ్ బ్రేక్ ఎండలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 37 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 66 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉండటంతో మధ్యాహ్నం పూట బయటకు రావాలంటేనే జనాలు భయపడుతున్నారు.

Related Articles

Related image1
Petrol Diesel Price: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడే ఎందుకు పెంచారు? కారణాలు చూస్తే షాక్ అవుతారు !
Related image2
Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? ఎక్కువ తింటే ఏమవుతుంది?
35
రైతన్నలారా బీ కేర్‌ఫుల్.. ఈ జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక
Image Credit : Gemini

రైతన్నలారా బీ కేర్‌ఫుల్.. ఈ జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక

ఇలాంటి హాట్ క్లైమేట్‌లోనూ ఏపీలోని కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. అల్పపీడనం ఎఫెక్ట్‌తో మన్యం, అల్లూరి, పోలవరం, తూర్పుగోదావరి, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన లైట్ వానలు పడే అవకాశం ఉంది.

వానలతో పాటు పిడుగులు పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అందుకే పొలాల్లో పనులు చేసే రైతులు, గొర్రెల కాపరులు, పశువుల కాపరులు వర్షం వచ్చేటప్పుడు పొరపాటున కూడా చెట్ల కింద ఉండొద్దని అధికారులు హెచ్చరించారు.

45
తెలంగాణలోనూ ఈదురుగాలుల వానలు.. హై టెంపరేచర్స్
Image Credit : Freepik

తెలంగాణలోనూ ఈదురుగాలుల వానలు.. హై టెంపరేచర్స్

ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా వెదర్ ఇలానే ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన సిస్టమ్ వల్ల రాష్ట్రంలోని ఒకటి రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ సాధారణం నుండి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

అయితే వర్షాలు పడినా పెద్దగా ఉపశమనం దక్కేలా లేదు. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా మ్యాగ్జిమం టెంపరేచర్స్ మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అంటే వర్షం పడి తగ్గిన వెంటనే విపరీతమైన ఉక్కపోతతో జనాలు సఫర్ అవ్వక తప్పదు.

55
ఎండలతో జాగ్రత్త
Image Credit : iSTOCK

ఎండలతో జాగ్రత్త

ఈ హాట్ అండ్ హ్యుమిడ్ వెదర్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా కవర్ చేసుకోవాలి. ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్, షుగర్, బీపీ ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండేందుకు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, మంచి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Andhra Pradesh: ఉచిత క‌నెక్ష‌న్లు, భారీ స‌బ్సిడీలు.. క్లీన్ ఎనర్జీ దిశ‌గా ఏపీ అడుగులు
Recommended image2
Now Playing
Dy CM Pawan Kalyan Fires On Udayanidhi Stalin Comments | Asianet News Telugu
Recommended image3
Now Playing
Dy CM Pawan Kalyan Sensational Comments : అన్నీ చూస్తున్న... అన్నీ గమనిస్తున్న | Asianet News Telugu
Related Stories
Recommended image1
Petrol Diesel Price: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడే ఎందుకు పెంచారు? కారణాలు చూస్తే షాక్ అవుతారు !
Recommended image2
Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? ఎక్కువ తింటే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved