MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Pawan kalyan: స‌ర్కారు గుడ్ న్యూస్.. వారికి నేరుగా ఇంటికే రేషన్ సరుకులు

Pawan kalyan: స‌ర్కారు గుడ్ న్యూస్.. వారికి నేరుగా ఇంటికే రేషన్ సరుకులు

Ration distribution: ఇకపై నెలలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రెండు పూటలుగా రేషన్ డీలర్ల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ ఉంటుంద‌ని ఆంధ‌ప్ర‌దేశ్ ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు.

2 Min read
Mahesh Rajamoni
Published : May 31 2025, 05:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నెలలో 15 రోజులు, రెండూ పూటలుగా రేషన్ సరుకుల పంపిణీ
Image Credit : X/JanaSena Party

నెలలో 15 రోజులు, రెండూ పూటలుగా రేషన్ సరుకుల పంపిణీ

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ సరుకుల పంపిణీలో ప్రభుత్వం కీలక మార్పులు తీసువ‌చ్చింది. ఇకపై ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ స‌రుకులు అందించ‌నున్నారు. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేయనుంది.

 రోజుకు రెండు పూట‌లు ప్ర‌భుత్వం స‌రుకులు పంపిణీ చేయ‌నుంది. ఈ కొత్త విధానాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ మేర‌కు ఏపీ ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంబంధిత వివ‌రాలు వెల్ల‌డించారు.

25
గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు
Image Credit : our own

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు

గత ప్రభుత్వ హయాంలో రేషన్ సరుకులను ఇంటింటికి ఇవ్వడంపై తీసుకున్న నిర్ణయం కార్యాచరణలో పూర్తిగా విఫలమైందని కూట‌మి ప్ర‌భుత్వం పేర్కొంది. రూ.1600 కోట్ల వ్యయంతో వాహనాలను కొనుగోలు చేసినా, అవి నెలలో 1-2 రోజులు మాత్రమే జంక్షన్ల వద్ద నిలిపి పంపిణీ చేయడం వల్ల లక్షలాది పేదలకు రేషన్ సరుకులు అందకుండా పోయాయ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కార్యాల‌యం పేర్కొంది.

వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక ప్రజలు తమ రోజువారీ ఉపాధిని మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో పాటు ఈ విధానంలో అవకతవకలు వెల్లడి కావడంతో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిందని తెలిపింది.

Related Articles

Related image1
Pawan Kalyan: సినిమా హాళ్ల బంద్... ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సీరియస్.. కీలక ఆదేశాలు
Related image2
వారం గ్యాప్‌లో రెండోసారి ఢిల్లీకి Chandrababu..ఎందుకు వెళ్తున్నారు!
35
రేష‌న్ బియ్యం అక్ర‌మ రవాణా
Image Credit : Gemini AI

రేష‌న్ బియ్యం అక్ర‌మ రవాణా

ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రేష‌న్ బియ్యం పంపిణీ వ్య‌వ‌స్థ‌లో అక్ర‌మాల‌ను అరిక‌ట్టేందుకు చ‌ర్య‌లు తీసుకుంది. దీనికి అధిక ప్రాధాన్యతనిస్తూ, కాకినాడ, విశాఖపట్నం పోర్టుల్లో వేలాది టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకుంది. ఈ రేషన్ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు, ప్రతి పేద కుటుంబానికి సరుకులు సమయానికి అందించేందుకు నూతన విధానాన్ని తీసుకొచ్చిన‌ట్టు ప‌వ‌న్ తెలిపారు.

45
కొత్త రేష‌న్ విధానంతో ప్ర‌జ‌ల‌కు మ‌రింత సౌల‌భ్యం
Image Credit : @pawan kalyan

కొత్త రేష‌న్ విధానంతో ప్ర‌జ‌ల‌కు మ‌రింత సౌల‌భ్యం

ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు రేషన్ డీలర్ల దుకాణాలే పంపిణీ కేంద్రాలుగా మళ్లీ వ్యవస్థీకరించారు. రద్దీని తగ్గించేందుకు రోజుకు రెండు పూటలుగా పంపిణీ ఉంటుంది. దీనివల్ల ప్రతి ఒక్కరికి రేషన్ సరుకులు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం నమ్మకం వ్యక్తం చేసింది.

55
వృద్ధులు, దివ్యాంగుల ఇంటికి నేరుగా రేష‌న్ స‌రుకులు
Image Credit : our own

వృద్ధులు, దివ్యాంగుల ఇంటికి నేరుగా రేష‌న్ స‌రుకులు

ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించే ప్రత్యేక సదుపాయాన్ని ప్రభుత్వం అందించనుంది. ఈ చర్య ప్రజలకు మేలు చేస్తుందని, అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. 

కొత్తగా తీసుకున్న చ‌ర్య‌లు ప్రజలకు సమర్థవంతంగా సేవలందించడంలో సహాయపడుతుందనీ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో పారదర్శకతను తీసుకువస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ చ‌ర్య‌లు మంత్రి నాదెండ్ల నేతృత్వంలో జనరంజకంగా అమలవుతుందని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆకాంక్షించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
పవన్ కళ్యాణ్
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
అమరావతి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved