MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఏపీలో మావోయిస్టుల కలకలం: 5 జిల్లాల్లో 50 మందికి పైగా అరెస్ట్.. హిడ్మా ఎన్‌కౌంటర్‌

ఏపీలో మావోయిస్టుల కలకలం: 5 జిల్లాల్లో 50 మందికి పైగా అరెస్ట్.. హిడ్మా ఎన్‌కౌంటర్‌

Maoist : విజయవాడ, ఏలూరు సహా ఐదు జిల్లాల్లో భారీ సెర్చ్ ఆపరేషన్‌లో 50 మందికి పైగా మావోయిస్టులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టుల అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌ తర్వాత ఈ దాడుల వేగం పెంచారు.

2 Min read
Mahesh Rajamoni
Published : Nov 18 2025, 11:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీలో మావోయిస్టులు.. వరుస సోదాలతో కలకలం
Image Credit : X/Ch.Santakar

ఏపీలో మావోయిస్టులు.. వరుస సోదాలతో కలకలం

ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల కదలికలు మళ్లీ పెరిగాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రంలోకి చొరబడిన మావోయిస్టులు ఐదు జిల్లాల్లో తలదాచుకున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారం అందిన తరువాత పోలీసులు విస్తృతస్థాయి ఆపరేషన్ చేపట్టారు. 

ముఖ్యంగా విజయవాడ న్యూ ఆటోనగర్ ప్రాంతంలో గుర్తించిన 28 మందితో పాటు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 50 మందికి పైగా మావోయిస్టులు అదుపులోకి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ చర్యలు అల్లూరి జిల్లాలో హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే వేగం పుంజుకోవడం ప్రత్యేకంగా నిలిచింది.

25
న్యూ ఆటోనగర్‌లో భారీగా మావోయిస్టుల అరెస్టులు
Image Credit : Getty

న్యూ ఆటోనగర్‌లో భారీగా మావోయిస్టుల అరెస్టులు

విజయవాడలోని కానూరు సమీపంలోని కొత్త ఆటోనగర్ ప్రాంతంలో మావోయిస్టులు గుంపులుగా ఉండుతున్నారన్న సమాచారం పోలీసులకు చేరింది. వెంటనే ఆక్టోపస్, ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్ బృందాలు సంయుక్తంగా భవనాన్ని ముట్టడించి 28 మందిని అదుపులోకి తీసుకున్నాయి. 

వీరిలో 21 మంది మహిళలు ఉన్నట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. అదనంగా, మావోయిస్టు కేంద్ర కమిటీకి భద్రతగా ఉండే తొమ్మిది మంది, హిడ్మా బెటాలియన్ సభ్యులుగా గుర్తించిన 19 మంది కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలిపారు. భవనాన్ని అద్దెకు తీసుకోవడానికి కూలిపనుల పేరుతో వచ్చినట్లు అనుమానిస్తున్నారు.

Related Articles

Related image1
ఎన్‌కౌంట‌ర్‌లో హిడ్మా మృతి, ఇంత‌కీ ఎవ‌రిత‌ను.? కోటి రూపాయ‌ల రివార్డ్ ఎందుకు ఉంది.?
Related image2
భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
35
ఏలూరు–కాకినాడల్లో మరిన్ని అరెస్టులు
Image Credit : getty

ఏలూరు–కాకినాడల్లో మరిన్ని అరెస్టులు

విజయవాడతో పాటు ఏలూరు గ్రీన్ సిటీ ప్రాంతంలో 15 మంది మావోయిస్టులు అరెస్టయ్యారని సమాచారం. వీరంతా గత వారం రోజుల్లో ఒడిశా దిశ నుంచి వచ్చినట్లు పోలీసుల అనుమానాలు చెబుతున్నాయి. మరోవైపు కాకినాడలో ఇద్దరు మావోయిస్టులు అదుపులోకి వచ్చారు. మొత్తం మీద అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, కాకినాడ జిల్లాలలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరికొంతమంది మావోయిస్టుల ఆచూకీ కూడా లభించడంతో వారి కోసం ప్రత్యేక బృందాలు సెర్చ్ చేస్తున్నాయి.

45
హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత ఏపీలో వరుస సెర్చ్ ఆపరేషన్లు
Image Credit : n

హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత ఏపీలో వరుస సెర్చ్ ఆపరేషన్లు

మారేడుమిల్లి అడవుల్లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా, అతని భార్య రాజే సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. హిడ్మా మరణం మావోయిస్టు దళాలకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. 

ఈ ఘటన అనంతరం ఆయన డైరీలో లభించిన వివరాలు, ప్రత్యేకంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన డంప్‌లు, తలదాచుకునే ప్రదేశాలు, కీలక సభ్యుల పేర్లు పోలీసులకు మరింత స్పష్టత కలిగించాయి. అందువల్లే రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే సంయుక్త ఆపరేషన్లు ప్రారంభించారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

55
మావోయిస్టుల ప్రణాళికలు భగ్నం.. దర్యాప్తు ముమ్మరం
Image Credit : X/AP_CRDANews

మావోయిస్టుల ప్రణాళికలు భగ్నం.. దర్యాప్తు ముమ్మరం

అరెస్టయిన వారంతా ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చినవారేనని ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. ఇందులో కొందరు సానుభూతిపరులు, మిలీషియా సభ్యులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారు ఏపీలో ఉద్యమాన్ని మళ్లీ పునర్నిర్మించడానికి ప్రయత్నించారని అధికారులు చెబుతున్నారు. సేకరించిన ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాల పరిమాణం కూడా పెద్దదిగా ఉండటంతో, వీటి ఆధారంగా మరిన్ని డంప్‌లను గుర్తించేందుకు బృందాలు సెర్చ్ లు జరుపుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ పర్యవేక్షణలో మళ్లీ మావోయిస్టుల కదలికలను అణచివేయడానికి పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. అరెస్టయినవారి వివరాలు, వారి వ్యూహాలు, భవిష్యత్తు ప్రణాళికలు అన్ని అంశాలపై విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు అధికారికంగా త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
విజయవాడ
విశాఖపట్నం
సాయుధ దళాలు
పోలీసు భద్రత
నారా చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్
అమిత్ షా
నరేంద్ర మోదీ
Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Weather Alert : గజగజా వణికిస్తున్న చలి హటాత్తుగా మాయం..! ఎప్పట్నుంచో తెలుసా?
Recommended image2
2026 సెలవుల లిస్ట్ ఇదే... ఏ నెలలో ఎన్నిరోజులు హాలిడేస్ వస్తున్నాయో తెలుసా?
Recommended image3
విజయవాడకు మకాం మార్చిన మావోయిస్టులు.. ఒకేసారి 27 మంది అరెస్ట్
Related Stories
Recommended image1
ఎన్‌కౌంట‌ర్‌లో హిడ్మా మృతి, ఇంత‌కీ ఎవ‌రిత‌ను.? కోటి రూపాయ‌ల రివార్డ్ ఎందుకు ఉంది.?
Recommended image2
భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved