MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • IMD Rain Alert : అల్లకల్లోలమే.. వచ్చే మూడు రోజులు అతి భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

IMD Rain Alert : అల్లకల్లోలమే.. వచ్చే మూడు రోజులు అతి భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

Heavy Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని భారత వాతారణ శాఖ హెచ్చరించింది. దీంతో దక్షిణ భారతంపై తీవ్ర ప్రభావం ఉండనుంది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

2 Min read
Mahesh Rajamoni
Published : Oct 21 2025, 10:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఐఎండీ అలర్ట్
Image Credit : AI Gemini

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఐఎండీ అలర్ట్

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో దక్షిణ భారతంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతారణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. 

తమిళనాడులోని పలు ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో పాటు భారీ వర్షాల హెచ్చరికల మధ్య ఎంకే స్టాలిన్ సర్కారు అప్రమత్తమైంది. బుధవారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది.

ఈ అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, ఈ అల్పపీడనం రాబోయే 36 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఈ వాతావరణ వ్యవస్థ, బుధవారం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ, “వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు శనివారం వరకు సముద్రంలోకి వెళ్లరాదు” అని హెచ్చరించారు.

25
ఏపీలో ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్‌లు జారీ
Image Credit : Gemini ai

ఏపీలో ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్‌లు జారీ

వాతావరణ శాఖ మంగళవారం నుండి శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్‌లు జారీ చేసింది. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

బుధవారం (అక్టోబర్ 22) నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలను తాకే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక మానిటరింగ్ ఏర్పాటు చేశారు. రాబోయే రెండు రోజుల్లో తీరం వెంబడి గంటకు 35 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Related Articles

Related image1
ప్రజలను అప్రమత్తం చేయండి.. మంత్రులకు చంద్రబాబు పిలుపు..
Related image2
రాబోయే 4 రోజులు జాగ్రత్త ! ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు
35
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Image Credit : X/APCMO

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో బుధవారం అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయి. గురువారం బాపట్ల, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడపలో కూడా మోస్తరు వర్షాలు పడతాయి.

ఇప్పటికే తిరుపతి జిల్లాలోని చిలమనూరు (79 మిమీ), నెల్లూరు జిల్లా ఆత్మకూరు (77.2 మిమీ), గొల్లగుంట (68.5 మిమీ) ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

45
ప్రజలకు అధికారుల హెచ్చరికలు
Image Credit : ANI

ప్రజలకు అధికారుల హెచ్చరికలు

భారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరింది. చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ దగ్గర నిలబడకూడదని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

లోతట్టు ప్రాంతాల ప్రజలు పొంగిపోర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 1800-425-0101 ద్వారా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు.

“రాబోయే ఐదు రోజులు వర్షాలు కొనసాగవచ్చు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు అన్ని జిల్లాల్లో సిద్ధంగా ఉన్నారు” అని ప్రఖర్ జైన్ అన్నారు.

55
తిరుమలలో భారీ వర్షం, భక్తులకు ఇబ్బందులు
Image Credit : X/dasara_bulloduu

తిరుమలలో భారీ వర్షం, భక్తులకు ఇబ్బందులు

తిరుపతి, తిరుమలలో ఇప్పటికే వర్షం పడుతోంది. మంగళవారం ఉదయం నుండి కురుస్తున్న వానలతో శ్రీవారి ఆలయ ప్రాంగణం తడిసిపోయింది. దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థలు ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీచేశాయి. వర్షాల తీవ్రతను బట్టి సంబంధిత జిల్లాల యంత్రాంగం హై అలెర్ట్‌లో ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను పాటించాలని ప్రభుత్వం సూచించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
అమరావతి
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశం
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి
హైదరాబాద్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved