MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ప్రజలను అప్రమత్తం చేయండి.. మంత్రులకు చంద్రబాబు పిలుపు..

ప్రజలను అప్రమత్తం చేయండి.. మంత్రులకు చంద్రబాబు పిలుపు..

Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మంత్రులకు ఓ పిలుపునిచ్చారు. మంత్రులతో కీలక విషయాలు చర్చించి.. వాటిపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటో తెలుసా

1 Min read
Pavithra D
Published : Oct 21 2025, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గత ప్రభుత్వ నిర్ణయాల ప్రభావం..
Image Credit : Chandrababu Twitter

గత ప్రభుత్వ నిర్ణయాల ప్రభావం..

గత జగన్ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలు.. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై గణనీయంగా ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు 24 గంటలు శ్రమిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పర్యటనలు చేస్తూ.. దిగ్గజ కంపెనీలు ఏపీవైపు చూసేలా ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.

25
మరో పెద్ద సవాల్..
Image Credit : Chandrababu Twitter

మరో పెద్ద సవాల్..

అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందు మరో సవాల్ ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సృష్టిస్తోన్న ఫేక్ ప్రచారాలను తరిమికొట్టాలి. దానికోసం కేడర్ కలిసి పని చేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలోనే వైసీపీ వర్గం వ్యాప్తి చేస్తోన్న ఫేక్ ప్రచారాలను బయటపెట్టాలని సీఎం చంద్రబాబు తన మంత్రివర్గ మంత్రులకు స్పష్టంగా సూచించారు.

Related Articles

Related image1
Chandrababu: అట్లుంటది బాబుతో.! ఢిల్లీలో ఏపీ సీఎం మాస్ ఎలివేషన్ చూస్తే మతిపోతోంది
Related image2
Chandrababu: 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా అరుదైన రికార్డు.. రాజకీయ దురంధరుడు సీఎం చంద్రబాబు
35
ప్రజలను అప్రమత్తం చేయాలి..
Image Credit : Chandrababu Twitter

ప్రజలను అప్రమత్తం చేయాలి..

మంత్రులు వెంటనే దీనిపై దృష్టి సారించాలని.. పార్టీలోని కార్యకర్తలను కూడా ఈ అంశంపై అవగాహన కల్పించాలన్నారు. వైసీపీ చేసే ఫేక్ ప్రచారాలను తిప్పి కొట్టాలని సూచించారు. నకిలీ మద్యం, గూగుల్ డేటా సెంటర్, సంబంధిత కార్యకలాపాలకు సంబంధించి వైసీపీ చేస్తున్న తప్పుడు కథనాల గురించి ప్రజలకు తెలిసేలా చేయాలని.. టీడీపీ కార్యనిర్వాహక నాయకత్వానికి సూచించారు సీఎం చంద్రబాబు.

45
ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలి..
Image Credit : Chandrababu Twitter

ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలి..

ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి.. కూటమి ప్రభుత్వాన్ని తక్కువ చేసేలా వైసీపీ ప్రయత్నిస్తోందని.. అబద్దాల కంటే నిజాలు ప్రజల్లోకి వెళ్ళేలా చేయాలని కేడర్‌కు స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.

55
జోగి రమేష్ అంశంపై..
Image Credit : Chandrababu Twitter

జోగి రమేష్ అంశంపై..

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్ట్ చేయకపోవడంపై టీడీపీ సీనియర్ నాయకత్వం సీఎం చంద్రబాబును అడగగా.. ఈ కేసుపై సిట్ దర్యాప్తు జరుగుతోందని.. సరైన సమయంలో సాక్ష్యాలతో నిందుతులపై అధికారులు చర్యలు తీసుకుంటారని చంద్రబాబు అన్నారు. ఇక్కడ రాజకీయ ప్రతీకార చర్యలకు చోటు ఉండదని ఆయన స్పష్టం చేశారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
నారా చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved