MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Andhra Pradesh
  • Free Bus Travel: ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం.. గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్ర‌బాబు.. కీలక ఆదేశాలు

Free Bus Travel: ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం.. గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్ర‌బాబు.. కీలక ఆదేశాలు

Free Bus Travel: ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని జిల్లాలో ఎక్కడికైనా ‘జీరో ఫేర్ టికెట్’తో ప్రయాణించవచ్చిన పేర్కొంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కీల‌క ఆదేశాలు జారీ చేశారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 21 2025, 05:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ ప‌థ‌కం ప్రారంభం
Image Credit : Getty

ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ ప‌థ‌కం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకువ‌స్తున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు.

మహిళలు జిల్లాలో ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని సీఎం వెల్లడించారు. ఈ ప్రయోజనం రాష్ట్రంలోని అన్ని జిల్లాల మహిళలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ క్ర‌మంలోనే కీల‌క ఆదేశాలు ఇచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉచిత బ‌స్సు ప్ర‌యాణం కానీ, టిక్కెట్టు ఇస్తారు !
Image Credit : Google gemini AI

ఉచిత బ‌స్సు ప్ర‌యాణం కానీ, టిక్కెట్టు ఇస్తారు !

మహిళలకు ఇచ్చే టికెట్‌పై ‘జీరో ఫేర్ టికెట్’ అనే విధానాన్ని ప్రవేశపెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ టికెట్‌లో ప్రయాణ స్థలం, ప్రయోజనం పొందిన మొత్తం, ప్రభుత్వ రాయితీ వివరాలు ముద్రించాలన్నారు. 

దీనివల్ల మహిళలు తమకు ప్రయోజనం ఎంతగా లభించిందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాడు ఆధికారుల‌కు సూచించారు.

Related Articles

Related image1
Koneru Humpy : ఫిడే చెస్ వరల్డ్ కప్ లో అద‌ర‌గొట్టిన తెలుగు తేజం.. కోనేరు హంపీ పై చంద్ర‌బాబు, రేవంత్ ప్ర‌శంస‌లు
Related image2
Mithun Reddy: వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? 3200 కోట్ల స్కామ్ ఏంటి?
35
ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ప‌థ‌కం ఆర్థిక భారం కాకుండా చర్యలు
Image Credit : Getty

ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ప‌థ‌కం ఆర్థిక భారం కాకుండా చర్యలు

ఉచిత బ‌స్సు ప్ర‌యాణం పథకం ఆర్టీసీకి భారంగా మారకుండా చూసేందుకు ఇతర ఆదాయ మార్గాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నిర్వహణ వ్యయం తగ్గించే మార్గాలను అన్వేషించి సంస్థను లాభాల బాటలో నడిపే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారుల‌ను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల అనుభవాల ఆధారంగా ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

45
ఇకపై ఏపీ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు మాత్ర‌మే !
Image Credit : our own

ఇకపై ఏపీ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు మాత్ర‌మే !

భవిష్యత్తులో ఏపీ ఆర్టీసీ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులే కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావ‌డం ద్వారా నిర్వహణ వ్యయం తగ్గుతుందని పేర్కొన్నారు. అవసరమైన విద్యుత్‌ను స్వయం ఉత్పత్తి చేసుకునే చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని RTC డిపోలలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశించారు.

55
ఎన్నికల హామీల‌ను త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తాం : చంద్రబాబు నాయుడు
Image Credit : our own

ఎన్నికల హామీల‌ను త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తాం : చంద్రబాబు నాయుడు

2024 ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. ఈ హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం స్కీమ్‌ను రూపొందించి అమలుకు కసరత్తు ప్రారంభించింది. తాము ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతోన్న ఉచిత బస్సు ప్ర‌యాణం పథకాలను అధ్యయనం చేసి, అక్కడి విధానాల ఆధారంగా ఏపీలో అమలుకు సిద్ధమవుతోంది.

ఆగస్టు 15 నుంచి అమలుకానున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక పురోగతికి నాంది పలుకుతుంద‌ని అధికార వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ‘జీరో ఫేర్ టికెట్’, ఎలక్ట్రిక్ బస్సులు, నిర్వహణ వ్యయం తగ్గింపు వంటి చర్యలతో ఇది వ్యయబద్ధమైన పథకంగా మారనుందని చెబుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ
అమరావతి
నారా చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇక ఉద్యోగాల కోసం హైద‌రాబాద్ వెళ్లాల్సిన ప‌నిలేదు.. ఏపీలోని ఈ జిల్లాలో భారీ స్టార్ట‌ప్ హ‌బ్
Recommended image2
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు పడేది ఎప్పుడంటే?
Recommended image3
Amaravati Real Estate: అమరావతిలో అప్పుడు రూ.16 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.1 కోటి! మైండ్ బ్లాకింగ్ రియల్ ఎస్టేట్ లెక్కలు
Related Stories
Recommended image1
Koneru Humpy : ఫిడే చెస్ వరల్డ్ కప్ లో అద‌ర‌గొట్టిన తెలుగు తేజం.. కోనేరు హంపీ పై చంద్ర‌బాబు, రేవంత్ ప్ర‌శంస‌లు
Recommended image2
Mithun Reddy: వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? 3200 కోట్ల స్కామ్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved