MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • స్లీప‌ర్ బ‌స్సుల‌ను నిషేధించాల్సిందే.. క‌ర్నూల్ ప్ర‌మాదంపై IOCL మాజీ చైర్మ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

స్లీప‌ర్ బ‌స్సుల‌ను నిషేధించాల్సిందే.. క‌ర్నూల్ ప్ర‌మాదంపై IOCL మాజీ చైర్మ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

Bus Accident: 19 మంది మ‌ర‌ణించిన క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాద సంఘ‌ట‌నపై తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ చైర్మన్ శ్రీకాంత్ ఎం వైద్య లింక్డిన్ వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర పోస్ట్ చేశారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఆయ‌న మాట‌ల్లోనే..

2 Min read
Narender Vaitla
Published : Oct 28 2025, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆ డిజైన్‌నే మృతి వలయం
Image Credit : Shrikant M Vaidya/linkedin

ఆ డిజైన్‌నే మృతి వలయం

భారతదేశంలో స్లీపర్ బస్సుల్లో జరిగే అగ్ని ప్రమాదాలు ఎన్నో కుటుంబాల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ప్రతి సారి విచారణలు, సానుభూతులు, పరిహారాలు కానీ అసలు సమస్య మాత్రం అలాగే ఉంది. నేను దశాబ్దాలుగా ప్రమాదకరమైన ఆయిల్‌ రంగంలో పనిచేసిన అనుభవంతో చెబుతున్నాను. భద్రత అంటే కేవలం జాగ్రత్తలు కాదు, అది క్రమశిక్షణ, కఠిన నియంత్రణ, రాజీ లేని నిబద్ధత.

26
తాజా ఘటనలు భయంకర వాస్తవం చెబుతున్నాయి
Image Credit : Linkedin

తాజా ఘటనలు భయంకర వాస్తవం చెబుతున్నాయి

అక్టోబర్ నెలలోనే రెండు ఘటనల్లో 41 మంది మృతి చెందారు. కర్నూలులో 19 మంది, రాజస్థాన్ గ్రామీణ ప్రాంతంలో 20 మంది. గత దశాబ్దంలోనే 130 మందికి పైగా స్లీపర్ బస్సు అగ్ని ప్రమాదాల్లో మరణించారు. వీరిలో చాలా మంది నిద్రలోనే మంటల్లో చిక్కుకున్నారు, బయటకు రావడానికి 20–30 సెకన్ల సమయం కూడా దొరకలేదు. ఇది ప్రమాదం కాదు, ఇది ఇంజనీరింగ్ వైఫల్యం.

Related Articles

Related image1
మొంథా తుపానుకు ఆ పేరు ఎందుకు పెట్టారు? దీని అర్థం ఏంటి? అస‌లు తుపాన్ల‌కు పేర్లు ఎలా పెడ‌తారు?
Related image2
రూ. 20 వేల పెట్టుబడితో నెలకు రూ. 30 వేల ఆదాయం.. సొంత ఊరిలోనే డబ్బులు సంపాదించే అవకాశం
36
ప్రాణాలు బలి తీసుకునే డిజైన్
Image Credit : Twitter

ప్రాణాలు బలి తీసుకునే డిజైన్

స్లీపర్ బస్సుల సమస్య కేవలం డ్రైవర్ తప్పిదం కాదు, డిజైన్ కూడా. ఈ బ‌స్సులో బెడ్స్ చాలా త‌క్కువ ప్ర‌దేశంలో ఏర్పాటు చేశారు. బ‌స్సు మ‌ధ్య‌లో న‌డ‌వ‌డానికి కూడా వీలు లేకుండా చాలా స‌న్న‌ని మార్గం ఉంటుంది. అత్యవసర ద్వారాలు మూసివేసి ఉంటాయి లేదా ప్ర‌యాణికుల‌కు కనిపించవు. అలాగే బ‌స్సులో ఉప‌యోగించిన ప్లాస్టిక్ ఇంటీరియర్ మంటల్లో వేగంగా దహనమవుతుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేకపోవడం లేదా అందుబాటులో లేకపోవడం వల్ల మంటలు వేగంగా వ్యాపిస్తాయి. అధికంగా ప్రయాణికులను ఎక్కించడం వల్ల కదిలే స్థలం కూడా ఉండదు.

శ్రీకాంత్ ఎం వైద్య లింక్డిన్ పోస్ట్ 

46
ఇతర దేశాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి
Image Credit : Twitter

ఇతర దేశాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి

ప్రపంచంలోని ఇతర దేశాలు ఈ ప్రమాదాన్ని గుర్తించి క‌ఠిన‌మైన‌ నిర్ణయాలు తీసుకున్నాయి.

* చైనా: 2012లో స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించింది.

* వియత్నాం: బస్సు డిజైన్‌, సేఫ్టీ కోడ్లు, ఎమర్జెన్సీ ద్వారాలు ఇలా అన్నింటినీ కొత్తగా రూపొందించింది.

* జర్మనీ: స్లీపర్ బస్సులను పరిమిత, నియంత్రిత విధానంలో మాత్రమే అనుమతిస్తోంది.

కానీ భారత్ మాత్రం ఇంకా ప్రమాదం జరిగాక విచారణలతో సరిపెట్టుకుంటోంది.

56
వ్య‌వ‌స్థ వైఫ‌ల్యం
Image Credit : Twitter

వ్య‌వ‌స్థ వైఫ‌ల్యం

దేశంలో దాదాపు 16 లక్షల బస్సులు నడుస్తున్నాయి. వాటిలో 78% ప్రైవేట్ ఆపరేటర్లు ఐదు బస్సుల కంటే తక్కువనే నిర్వహిస్తున్నారు. ఇంత విస్తృతమైన చిన్నచిన్న యాజమాన్యాలపై సరైన పర్యవేక్షణ జరగడం అసాధ్యం. ప్రభుత్వ RTC బస్సులు తగ్గడంతో ఆ ఖాళీని అనధికారిక స్లీపర్ బస్సులు, మార్చిన వాహనాలు, తప్పు వైరింగ్ పూరిస్తున్నాయి. లాభం, వేగం, అదనపు సీట్లు వంటి వాటికి ప్రాధాన్య‌త ఇచ్చి.. అన్నింటికంటే ముఖ్యమైన‌ భద్రతను మాత్రం గాలికి వ‌దిలేశారు.

66
పూర్తిగా నిషేధించాల్సిందే..
Image Credit : Generated by google gemini AI

పూర్తిగా నిషేధించాల్సిందే..

ఇలాంటి తప్పు డిజైన్‌ను “సవరించడం” అసాధ్యం. మంటలు పట్టే డిజైన్‌ను నియంత్రించలేము, తొలగించడమే ఏకైక‌ మార్గం. చైనా, వియత్నాం వంటి దేశాలు చెయ్యగలిగితే, భారత్ ఎందుకు చేయ‌లేదు. రాత్రి ప్రయాణం అనేది గమ్యస్థానానికి చేరుకోవాలనే ఆశతో ఉండాలి, ప్రాణాలతో బయటపడాలనే భయంతో కాదు.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
నేరాలు, మోసాలు
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved