- Home
- Andhra Pradesh
- కొనసాగుతోన్న సస్పెన్స్, ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు మరోసారి వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే?
కొనసాగుతోన్న సస్పెన్స్, ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు మరోసారి వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే?
AP EAPCET Results: ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇప్పటికే వాయిదా పడిన ఫలితాలను మంగళవారం విడుదల చేస్తారని ప్రకటించినా, రిజల్ట్స్ రాలేవు.

సీబీఎస్ఈ ఫలితాల కారణంగానే జాప్యం
ఈఏపీసెట్ ర్యాంకుల నిర్ణయంలో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటంతో అన్ని విద్యార్థులకు సమాన న్యాయం జరగాలనే ఉద్దేశంతో అధికారులు ఫలితాల విడుదలను నిలిపివేశారు. ముఖ్యంగా సీబీఎస్ఈ 12వ తరగతి సవరించిన ఫలితాలు, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాతే ర్యాంకులు ప్రకటించాలని నిర్ణయించారు. దీంతో ఫలితాల విడుదల మరింత ఆలస్యమైంది.
3.29 లక్షల మంది భవితవ్యాన్ని నిర్ణయించే పరీక్ష
ఈ ఏడాది మే 12 నుంచి మే 20 వరకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.29 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు ముగిసి చాలా రోజులు కావడంతో విద్యార్థులు తమ ర్యాంకులు తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 1న ఫలితాలు రావాల్సి ఉన్నప్పటికీ, అనివార్య కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.
కౌన్సెలింగ్ షెడ్యూల్పైనా ప్రభావం
ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫలితాల విడుదల ఆలస్యం కావడంతో కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా వెనక్కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు జులై 2న ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నప్పటికీ, అధికారిక ప్రకటన వచ్చే వరకు పూర్తి స్పష్టత లేదు. మరి జూలై 2న అయినా ఫలితాలు వస్తాయో చూడాలి.

