బాలీవుడ్ లో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న రామాయణం సినిమా గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. రీసెంట్ గా ఈమూవీ నుంచి ఓ కొత్త ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫోటోతో పాటు ఓ కొత్త విషయం కూడా బయటకు వచ్చింది. అదేంటంటే?

బాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న రామాయణం సినిమా గురించి తాజా సమాచారం సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను నితేష్ తివారీ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాతలు నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరామునిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణాసురుడిగా నటిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం, యశ్ ఈ సినిమాకు నటుడిగా మాత్రమే కాకుండా సహా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఈ ప్రాజెక్టుకు సంబంధించి యాక్షన్ సన్నివేశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇందుకోసం హాలీవుడ్‌కు చెందిన ప్రఖ్యాత స్టంట్ డైరెక్టర్ గై నోరిస్‌ను ఈ సినిమా కోసం తీసుకువచ్చారు.

గై నోరిస్ గతంలో మాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్, ది సుసైడ్ స్క్వాడ్ వంటి ప్రపంచ స్థాయి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు స్టంట్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన భారతదేశానికి వచ్చి రామాయణం షూటింగ్ సెట్స్‌లో యాక్షన్ సన్నివేశాలను డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా, యశ్ , గై నోరిస్ యాక్షన్ సీన్లపై చర్చిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి.

ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘రామాయణం – పార్ట్ 1’ సినిమాను 2026లో దీపావళికి విడుదల చేయాలని యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం రెండవ భాగం దీపావళి 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మైథలాజికల్ మూవీని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందించేందుకు నిర్మాతలు, దర్శకుడు నితేష్ తివారీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. గై నోరిస్ వంటి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన టెక్నీషియన్లను ఇందులో భాగం చేయడం ద్వారా ఈ సినిమా విజువల్ మరింత హైలెట్ అవ్వబోతున్నాయి.